తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలకు చిక్కులు కొనసాగుతూనే ఉన్నాయి. తమ పార్టీ టికెట్పై విజయం దక్కించుకుని.. పొరుగు పార్టీలో చేరిన ఎమ్మెల్యే లను వదిలేది లేదని చెప్పిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ .. న్యాయ పోరాటం కొనసాగిస్తునే ఉన్నారు. తొలుత హైకోర్టు.. తర్వాత సుప్రీంకోర్టు వరకు.. ఈ కేసును కొనసాగించారు. తాజాగా మరోసారి సుప్రీంకోర్టు.. స్పందించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు మాసాల్లోగా నిర్ణయం తీసుకోవాలని.. మరోసారి తేల్చి చెప్పింది.
అంతేకాదు.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. మూడు మాసాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. మొత్తంగా బీఆర్ ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ గూటికి చేరిన విషయం తెలిసిందే. పార్టీ అధికారం కోల్పోగానే కొందరు.. తర్వాత మరికొందరు.. అధికార పార్టీ గూటికి చేరారు. అయితే.. వీరిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ప్రసాదరావుకు బీఆర్ఎస్ విన్నవించింది. ఆయన ఈ విషయంలో ఆలస్యం చేస్తూనే ఉన్నారు.
దీంతో హైకోర్టుకు వెళ్లిన బీఆర్ఎస్కు.. సానుకూలంగానే తీర్పు వచ్చింది. అయినా.. స్పీకర్ పట్టించుకోలేదు. దీనిపై నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్.. `మీరే వేటు వేయండి“ అని కోర్టును కోరింది. దీనిపైనే సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు.. మరోసారి స్పీకర్ ప్రసాదరావుకే సూచనలు చేస్తూ.. మూడు మాసాల్లోనే తేల్చేయాలని పేర్కొంది. అయితే.. ఇది స్పీకర్ విచక్షణపై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించడం కొసమెరుపు. తాము నేరుగా శాసన విధుల్లోకి జోక్యం చేసుకునేది లేదని పేర్కొంది.
కీలక వ్యాఖ్యలు ఇవీ..
+ జంపింగ్ ఎమ్మెల్యేలపై కోర్టులు అనర్హత వేటు వేయజాలవు.
+ ఇలాంటి ఎమ్మెల్యేల పట్ల పార్లమెంటే చట్టం తీసుకురావాలి.
+ పార్టీలు మారడం నిలువరించేందుకు ఇప్పటికే ప్రజాప్రాతినిధ్య చట్టం ఉంది. దీనిని బలోపేతం చేయాలి. అమలు చేయాలి.
+ స్పీకర్లకు విచక్షణాధికారం ఉన్నా.. పరిమితులు ఉంటాయి.
This post was last modified on July 31, 2025 4:13 pm
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…