Political News

బీఆర్ ఎస్ చుట్టూ ఉచ్చు: గోర్రెల పేరిట కోట్లు దోపిడీ.. !

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం, ఒక‌ప్ప‌టి అధికార పార్టీ బీఆర్ ఎస్ చుట్టూ.. గొర్రెల కుంభ‌కోణం చుట్టు కుంటోంది. గొర్రెల పేరుతో రూ.700 కోట్ల రూపాయ‌ల మేర‌కు కుంభ‌కోణం జ‌రిగిన‌ట్టు.. ఏసీబీ అధికారులు ప్రాథ‌మికంగా గుర్తించారు. అంతేకాదు.. దీనికి మించిన సొమ్ము అక్ర‌మ దారుల్లో `పెద్ద‌ల‌కు` చేరింద‌నే అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో మ‌నీలాండ‌రింగ్ వ్య‌వ‌హారాన్ని నిగ్గు తేల్చేందుకు ఈడీ అధికారులు రంగంలోకి దిగారు.

తాజాగా ఈడీ అధికారులు ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వ‌హించారు. బీఆర్ ఎస్ హ‌యాంలో యానిమ‌ల్ హ‌జ్బెండ‌రీ విభాగం డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన రామ‌చంద‌ర్ నాయ‌క్‌, అదేవిధంగా ఈ కేసులో కీల‌క నిందితుడు మొయినుద్దీన్ స‌హా.. ప‌లువురి ఇళ్లు.. వారి బంధువుల నివాసాల్లోనూ బుధ‌వారం ఉద‌యం నుంచి ఈడీ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. వాస్త‌వానికి ఏసీబీ గుర్తించింది 700 కోట్ల కుంభ‌కోణ‌మే అయినా.. దీని వెనుక‌.. చాలానే ఉంద‌ని భావిస్తున్నారు.

బీఆర్ ఎస్ హ‌యాంలో అప్ప‌టి సీఎం కేసీఆర్‌.. 2015 ప్రారంభంలోనే గోర్రెల పంపిణీ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించి అమ‌లు చేశారు. సుమారు 4 వేల కోట్ల‌ను ఈ ప‌థ‌కానికి కేటాయించారు. ఖ‌ర్చు కూడా చూపించారు. అయితే.. ఆ మేర‌కు.. గొర్రెలు.. ల‌బ్ధిదారుల‌కు చేరలేదు. పైగా ఏపీ, బీహార్‌, యూపీ వంటి రాష్ట్రాల నుంచి త‌క్కువ ధ‌ర‌లకు గొర్రెలు తీసుకువ‌చ్చి.. వాటిని ఎక్కువ మొత్తంలో బిల్లులు చేసుకున్నార‌ని.. అప్ప‌ట్లో కాంగ్రెస్ నాయ‌కులు కూడా విమ‌ర్శించారు. ఇది రాజ‌కీయ దుమారంగా కూడా మారింది.

అయితే.. అప్ప‌ట్లో కేసీఆర్ ఈ విమ‌ర్శ‌ల‌ను తోసిపుచ్చారు. ప‌శువుల కాప‌రులు బాగుప‌డితే కూడా.. కాంగ్రెస్ నాయ‌కులు చూడలేక పోతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. అయితే ఈ స్కీంలో ఆది నుంచి అధికారులు, దళారులు కుమ్మక్కై నిధులు స్వాహా చేసినట్లు ఆరోప‌ణ‌లు వున్నాయి. అంతేకాదు.. అధికార పార్టీ నాయ‌కులు కూడా చేతులు క‌లిపార‌న్న‌ది అప్ప‌ట్లో వెలుగు చూశాయి. గొర్రెల పేరుతో బొక్కిన నిధుల‌ను బినామీ ఖాతాల్లోకి మళ్లించి ఆ త‌ర్వాత‌.. వివిధ మార్గాల్లో అంద‌రూ పంచుకున్నార‌ని ఏసీబీ గుర్తించింది. ఈ నేప‌థ్యంలోనే మ‌నీ లాండ‌రింగ్ నిగ్గు తేల్చేందుకు ఈడీ రంగంలోకి దిగింది. చివ‌ర‌కు ఏం జ‌రుగుతుందో చూడాలి.

Kumar

Recent Posts

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

1 hour ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

2 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

2 hours ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

4 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

7 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

13 hours ago