తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం, ఒకప్పటి అధికార పార్టీ బీఆర్ ఎస్ చుట్టూ.. గొర్రెల కుంభకోణం చుట్టు కుంటోంది. గొర్రెల పేరుతో రూ.700 కోట్ల రూపాయల మేరకు కుంభకోణం జరిగినట్టు.. ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అంతేకాదు.. దీనికి మించిన సొమ్ము అక్రమ దారుల్లో `పెద్దలకు` చేరిందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మనీలాండరింగ్ వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు ఈడీ అధికారులు రంగంలోకి దిగారు.
తాజాగా ఈడీ అధికారులు ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. బీఆర్ ఎస్ హయాంలో యానిమల్ హజ్బెండరీ విభాగం డైరెక్టర్గా పనిచేసిన రామచందర్ నాయక్, అదేవిధంగా ఈ కేసులో కీలక నిందితుడు మొయినుద్దీన్ సహా.. పలువురి ఇళ్లు.. వారి బంధువుల నివాసాల్లోనూ బుధవారం ఉదయం నుంచి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఏసీబీ గుర్తించింది 700 కోట్ల కుంభకోణమే అయినా.. దీని వెనుక.. చాలానే ఉందని భావిస్తున్నారు.
బీఆర్ ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్.. 2015 ప్రారంభంలోనే గోర్రెల పంపిణీ పథకాన్ని ప్రకటించి అమలు చేశారు. సుమారు 4 వేల కోట్లను ఈ పథకానికి కేటాయించారు. ఖర్చు కూడా చూపించారు. అయితే.. ఆ మేరకు.. గొర్రెలు.. లబ్ధిదారులకు చేరలేదు. పైగా ఏపీ, బీహార్, యూపీ వంటి రాష్ట్రాల నుంచి తక్కువ ధరలకు గొర్రెలు తీసుకువచ్చి.. వాటిని ఎక్కువ మొత్తంలో బిల్లులు చేసుకున్నారని.. అప్పట్లో కాంగ్రెస్ నాయకులు కూడా విమర్శించారు. ఇది రాజకీయ దుమారంగా కూడా మారింది.
అయితే.. అప్పట్లో కేసీఆర్ ఈ విమర్శలను తోసిపుచ్చారు. పశువుల కాపరులు బాగుపడితే కూడా.. కాంగ్రెస్ నాయకులు చూడలేక పోతున్నారని దుయ్యబట్టారు. అయితే ఈ స్కీంలో ఆది నుంచి అధికారులు, దళారులు కుమ్మక్కై నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వున్నాయి. అంతేకాదు.. అధికార పార్టీ నాయకులు కూడా చేతులు కలిపారన్నది అప్పట్లో వెలుగు చూశాయి. గొర్రెల పేరుతో బొక్కిన నిధులను బినామీ ఖాతాల్లోకి మళ్లించి ఆ తర్వాత.. వివిధ మార్గాల్లో అందరూ పంచుకున్నారని ఏసీబీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే మనీ లాండరింగ్ నిగ్గు తేల్చేందుకు ఈడీ రంగంలోకి దిగింది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on July 30, 2025 2:07 pm
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…
మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే…
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంతకుముందులా ఉదారంగా కొత్త సినిమాలను కొనట్లేదన్న సంగతి తెలిసిందే. నిర్మాతలు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫర్…
కొందరు దర్శకులు టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…