Political News

12 పెట్టెల్లో 11 కోట్లు… :  లిక్క‌ర్ స్కామ్‌లో `సిట్` సీజ్‌

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు అమ‌లు చేసిన మ‌ద్యం విధానం దేశంలోనే అతి పెద్ద కుంభ‌కోణం అని దీనిని విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు చెబుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఈ కేసును విచార‌ణ‌కు చేప‌ట్టి 9 మాసాల‌కుపైగానే అవుతోంది. ఒక‌వైపు అరెస్టులు.. జ‌రుగుతూనే ఉన్నాయి.. మ‌రోవైపు కేసులో ఎంత విచారించినా.. రోజు రోజుకు కొత్త విష‌యాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అక్ర‌మాలు బ‌య‌ట ప‌డుతూనే ఉన్నాయి.

తాజాగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. 12 అట్ట‌ పెట్టెల్లో దాచిన రూ.11 కోట్ల ను ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు సీజ్ చేశారు. ఈ కేసులో ఏ-40 నిందితుడుగా ఉన్న వ‌రుణ్ అనే వ్య‌క్తిని విచారించిన సిట్ అధికారులు.. అత‌ను ఇచ్చిన స‌మాచారం ఆధారంగా హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో సోదాలు నిర్వ‌హించారు. ఈ సోదాల్లో.. 12 అట్ట‌పెట్టెల్లో దాచిన  11 కోట్ల రూపాయ‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ నిధుల‌ను ఈ కేసులో ప్ర‌థ‌మ నిందితుడుగా ఉన్న ఏ-1 క‌సిరెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఉర‌ఫ్ రాజ్ క‌సిరెడ్డి ఆదేశాల‌తోనే తాను దాచిపెట్టాన‌ని వ‌రుణ్ అంగీక‌రించిన‌ట్టు తెలిసింది. ఇదే విష‌యాన్నిఈ కేసులో మ‌రో నిందితుడు బూనేటి చాణ‌క్య కూడా చెప్పార‌ని స‌మాచారం. 2024 ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌ర‌లిస్తుండ‌గా.. నిఘా ఎక్కువ కావ‌డంతో హైద‌రాబాద్‌లోని శంషాబాద్ మండ‌లంలో ఉన్న కాచారం ఫామ్ హౌస్‌లో దీనిని దాచి పెట్టిన‌ట్టు వారు వెల్ల‌డించారు.  దీంతో సిట్ అధికారులు ఆ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.

This post was last modified on July 30, 2025 1:59 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

6 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

7 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

7 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

8 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

9 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

10 hours ago