ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమలు చేసిన మద్యం విధానం దేశంలోనే అతి పెద్ద కుంభకోణం అని దీనిని విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు చెబుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసును విచారణకు చేపట్టి 9 మాసాలకుపైగానే అవుతోంది. ఒకవైపు అరెస్టులు.. జరుగుతూనే ఉన్నాయి.. మరోవైపు కేసులో ఎంత విచారించినా.. రోజు రోజుకు కొత్త విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అక్రమాలు బయట పడుతూనే ఉన్నాయి.
తాజాగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. 12 అట్ట పెట్టెల్లో దాచిన రూ.11 కోట్ల ను ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు సీజ్ చేశారు. ఈ కేసులో ఏ-40 నిందితుడుగా ఉన్న వరుణ్ అనే వ్యక్తిని విచారించిన సిట్ అధికారులు.. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో.. 12 అట్టపెట్టెల్లో దాచిన 11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ నిధులను ఈ కేసులో ప్రథమ నిందితుడుగా ఉన్న ఏ-1 కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి ఉరఫ్ రాజ్ కసిరెడ్డి ఆదేశాలతోనే తాను దాచిపెట్టానని వరుణ్ అంగీకరించినట్టు తెలిసింది. ఇదే విషయాన్నిఈ కేసులో మరో నిందితుడు బూనేటి చాణక్య కూడా చెప్పారని సమాచారం. 2024 ఎన్నికల సమయంలో తరలిస్తుండగా.. నిఘా ఎక్కువ కావడంతో హైదరాబాద్లోని శంషాబాద్ మండలంలో ఉన్న కాచారం ఫామ్ హౌస్లో దీనిని దాచి పెట్టినట్టు వారు వెల్లడించారు. దీంతో సిట్ అధికారులు ఆ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
This post was last modified on July 30, 2025 1:59 pm
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…