ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమలు చేసిన మద్యం విధానం దేశంలోనే అతి పెద్ద కుంభకోణం అని దీనిని విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు చెబుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసును విచారణకు చేపట్టి 9 మాసాలకుపైగానే అవుతోంది. ఒకవైపు అరెస్టులు.. జరుగుతూనే ఉన్నాయి.. మరోవైపు కేసులో ఎంత విచారించినా.. రోజు రోజుకు కొత్త విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అక్రమాలు బయట పడుతూనే ఉన్నాయి.
తాజాగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. 12 అట్ట పెట్టెల్లో దాచిన రూ.11 కోట్ల ను ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు సీజ్ చేశారు. ఈ కేసులో ఏ-40 నిందితుడుగా ఉన్న వరుణ్ అనే వ్యక్తిని విచారించిన సిట్ అధికారులు.. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో.. 12 అట్టపెట్టెల్లో దాచిన 11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ నిధులను ఈ కేసులో ప్రథమ నిందితుడుగా ఉన్న ఏ-1 కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి ఉరఫ్ రాజ్ కసిరెడ్డి ఆదేశాలతోనే తాను దాచిపెట్టానని వరుణ్ అంగీకరించినట్టు తెలిసింది. ఇదే విషయాన్నిఈ కేసులో మరో నిందితుడు బూనేటి చాణక్య కూడా చెప్పారని సమాచారం. 2024 ఎన్నికల సమయంలో తరలిస్తుండగా.. నిఘా ఎక్కువ కావడంతో హైదరాబాద్లోని శంషాబాద్ మండలంలో ఉన్న కాచారం ఫామ్ హౌస్లో దీనిని దాచి పెట్టినట్టు వారు వెల్లడించారు. దీంతో సిట్ అధికారులు ఆ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
This post was last modified on July 30, 2025 1:59 pm
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…