Political News

నారా లోకేష్ చైర్మ‌న్‌గా క‌మిటీ.. విష‌యం ఏంటంటే!

టీడీపీ యువ నాయ‌కుడు.. మంత్రి నారా లోకేష్ చైర్మ‌న్‌గా `పెట్టుబ‌డుల భాగ‌స్వామ్య` క‌మిటీని ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. న‌వంబ‌రు 14, 15 తేదీల్లో.. విశాఖ‌ప‌ట్నం కేంద్రంగా పెట్టుబ‌డుల భాగ‌స్వామ్య స‌ద‌స్సుకు ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్ప‌టికే రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చిన ప‌రిశ్ర‌మ‌ల అధిప‌తులు, ఐటీ దిగ్గ‌జాల‌తోపాటు.. మ‌రింత మంది పెట్టుబ‌డి దారుల‌ను ఆక‌ర్షించాల‌నే ల‌క్ష్యంతో ఈ స‌ద‌స్సును నిర్వ‌హిస్తున్నారు. వ‌చ్చే నాలుగేళ్ల‌లో 50 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు సాధించాల‌నేది ప్ర‌భుత్వం పెట్టుకున్న ల‌క్ష్యం.

దీనిలో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు 12 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు సాధించారు. ఇలా.. వ‌చ్చే నాలుగేళ్ల‌లో ఏటా 10 ల‌క్ష‌ల కోట్ల రూపాయల పెట్టుబ‌డులు సాధించేందుకు ఈ స‌ద‌స్సును వేదిక‌గా చేసుకోనున్నారు. ఈ స‌ద‌స్సును నిర్వ‌హించేందుకు ప్ర‌త్యేకంగా మంత్రుల‌తో కూడిన క‌మిటీని ప్ర‌భుత్వం నియ‌మించింది. ఈ క‌మిటీకి చైర్మ‌న్‌గా మంత్రి నారా లోకేష్ వ్య‌వ‌హ‌రిస్తారు. స‌భ్యులుగా.. మంత్రులు గొట్టిపాటి ర‌వికుమార్‌, కందుల దుర్గేష్‌, పి. నారాయ‌ణ‌, టీజీ భ‌ర‌త్‌, కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ ఉంటారు. వీరంతా పెట్టుబ‌డి దారుల‌ను స‌మ‌న్వ‌యం చేయ‌డంతోపాటు.. రెండు రోజుల స‌ద‌స్సును విజ‌య‌వంతం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తారు.

ఇదేస‌మ‌యంలో ఈ స‌ద‌స్సుకు వ‌చ్చేవారికి ఏర్పాట్లు చేసేందుకు, భోజ‌న వ‌స‌తి స‌దుపాయం క‌ల్పించేందుకు ఉన్న‌తాధికారుల‌తో కూడిన క‌మిటీని కూడా ప్ర‌భుత్వం నియ‌మించింది. వీరు స‌ద‌స్సుకు వ‌చ్చేవారు.. తిరిగి వెళ్లే వ‌ర‌కు కూడా.. ఏర్పాట్లు చేస్తారు. వీరిలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. ప‌రిశ్ర‌మ‌ల శాఖ స‌హా.. ఇత‌ర శాఖల అధిప‌తులు ఇత‌ర స‌భ్యులుగా ఉంటారు. ఈ రెండు రోజుల స‌ద‌స్సుకు.. ప్ర‌పంచ దేశాల నుంచి సుమారు 230 మంది ప్ర‌తినిధులు, పారిశ్రామిక వేత్త‌లు, ఐటీ రంగానికి చెందిన వారు కూడా వ‌స్తార‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. 

This post was last modified on July 29, 2025 8:46 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Nara Lokesh

Recent Posts

నెల రోజుల గ్యాపులో బాబాయ్ అబ్బాయ్

రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…

47 minutes ago

లెజెండ్ పోయాడు… లీడర్ వస్తున్నాడు

నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ 'ది లెజెండ్'తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి…

51 minutes ago

గేమ్ కోసం ఫోన్ ఇవ్వలేదని ముగ్గురు అక్కాచెల్లెళ్ళు…

​ఘజియాబాద్‌లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…

3 hours ago

అల్లరోడి ఆల్కహాల్ అడ్రస్ ఎక్కడ

అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…

4 hours ago

మామతో దళపతి… మాజీ అల్లుడితో ఎమోషనల్ డ్రామా

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…

4 hours ago

దిల్ రాజుకు, నాగవంశీకి చెడిందా?

టాలీవుడ్లో మంచి అనుబంధం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు, నాగవంశీలది ఒకటి. ఇద్దరికి బిజినెస్ పరంగా గట్టి బంధమే…

5 hours ago