Political News

వారంతా క‌లెక్ష‌న్ కింగ్‌లు: జ‌గ‌న్‌

రాష్ట్రంలోని పోలీసు వ్య‌వ‌స్థ‌పై త‌ర‌చుగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ తాజాగా మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. పోలీసులు క‌లెక్ష‌న్ కింగ్‌లుగా మారిపోయార‌ని వ్యాఖ్యానించారు. గ‌తంలో డీఐజీ స్థాయి అధికారులు క‌లెక్ష‌న్ కింగులుగా మారారన్న జ‌గ‌న్‌.. తాజాగా కానిస్టేబుల్ నుంచి హోం గార్డు వ‌ర‌కు కూడా అంద‌రూ క‌లెక్ష‌న్ ఏజెంట్లుగా, కింగులుగా మారార‌ని అన్నారు. ఈ సొమ్మును కీల‌క నాయ‌కుడు, ఆయ‌న కుమారుడికి చేర‌వేస్తున్నార‌ని చెప్పారు.

ఇక‌, మ‌ద్యం బెల్టు షాపుల కోసం టీడీపీ నాయ‌కులే వేలంపాట వేసుకుంటున్నార‌ని.. దీనికి పోలీసు స్టేషన్లే అడ్డాలుగా మారాయ‌ని విమ‌ర్శించారు. డీఐజీ స్థాయి అధికారులు ఈ వేలంలో పాల్గొని పంపిణీ చేస్తున్నారని విమ‌ర్శించారు. ఇసుక, మ‌ద్యం, ల్యాండు, మైన్స్‌.. ఇలా అన్నింటినీ కూట‌మి నాయ‌కులు దోచుకుంటున్నార‌ని.. వ్య‌వ‌స్థీకృత దోపిడీ పెరిగిపోయింద‌ని వ్యాఖ్యానించారు. దీనిపై పోరాటం చేస్తున్నామ‌నే.. వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను తీసుకువెళ్లి కొడుతున్నార‌ని అన్నారు. కేసులు పెడుతున్నార‌ని జ‌గ‌న్ చెప్పారు.

రాష్ట్రంలో రేష‌న్ బియ్యం మాఫియా విచ్చ‌ల‌విడిగా సాగుతోంద‌ని జ‌గ‌న్ ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న 50 నియోజ‌క‌వ‌ర్గాల్లో పేకాట క్ల‌బ్బులు నిరంత‌రాయంగా నిర్వ‌హిస్తున్నార‌ని.. క‌నీసం పోలీసులు వాటిపై క‌న్నేసే ధైర్యం కూడా చేయ‌లేక‌పోతున్నార‌ని అన్నారు. “సూప‌ర్ 6 అన్నాడు.. సూప‌ర్ 7 అన్నాడు. కానీ, ఒక్క‌టి కూడా ఇచ్చింది లేదు. త‌న వారికి ప‌ప్పుబెల్లాలు మాదిరిగా.. భూములు పంచుతున్నాడు. పేద‌ల‌కు గ‌జం భూమి కూడా ఇవ్వ‌లేదు. మ‌నం జ‌గ‌న‌న్న కాల‌నీలు క‌ట్టిస్తే.. వాటిని కూడా ఇప్పుడు ర‌ద్దు చేస్తున్నాడు“ అని చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

వ‌చ్చే ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా..చంద్ర‌బాబు ప‌త‌నం ఖాయ‌మ‌న్న జ‌గ‌న్‌.. వైసీపీ ఎప్పుడు వ‌స్తుందా? అని గ్రామీణ ప్రాంతాల నుంచి ప‌ట్ట‌ణ ప్రాతాల వ‌ర‌కు ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్న‌ట్టు చెప్పారు. ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునేందుకు నాయ‌కులు ప్రాధాన్యం ఇవ్వాల‌ని.. కేసుల‌కు భ‌య‌ప‌డ‌వ‌ద్ద‌ని చెప్పారు. “మీ క‌ష్టాలు నాకు తెలుసు. మీరు ప్ర‌జ‌ల్లోకి వెళ్లండి. ప్ర‌జ‌లకు మద్ద‌తుగా నిల‌వండి. ఈ  ప్ర‌భుత్వం పై ప్ర‌జ‌ల్లోనే వ్య‌తిరేక‌త ఉంది.“ అని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు.

This post was last modified on July 29, 2025 3:47 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

9 minutes ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

26 minutes ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

55 minutes ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

2 hours ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

2 hours ago

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

3 hours ago