సింగపూర్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. పెట్టుబడులు.. అమరావతి నిర్మాణంపై అక్కడి పారిశ్రామిక వేత్తలకు అనేక విషయాలు వెల్లడించారు. సోమవారం రాత్రి `ఏపీ-సింగపూర్` బిజినెస్ ఫోరం, సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించారు. దీనిలో చంద్రబాబు పారిశ్రామిక వేత్తలకు ఏపీ అభివృద్ధి, అమరావతి రాజధాని నిర్మాణంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఏపీ, సింగపూర్ స్టార్టప్ ఫెస్టివల్ త్వరలోనే నిర్వహిస్తామని చెప్పారు. స్టార్టప్ల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలు సహకరించాలని పిలుపునిచ్చారు.
తొలుత ఆయన.. `ఏపీ, సింగపూర్ బిజినెస్ ఫోరం` ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్షోలో పాల్గొన్నారు. అనంతరం.. నిర్వహించిన కార్యక్రమంలో పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి 40 నిమిషాలకు పైగా ప్రసంగించారు. అనంతరం.. వారి సందేహాలకు సమాధానం చెప్పారు. అయితే.. ఇటీవల కాలంలో తరచుగా ఎదురవుతున్న రెండు మూడు ప్రశ్నలు తాజాగా కూడా సీఎం చంద్రబాబుకు ఎదురయ్యాయి. 2019-24 మధ్య రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎలాంటి అవకాశాలూ రాలేదని.. పలువురు వ్యాఖ్యానించారు.
మళ్లీ వచ్చే ఎన్నికల తర్వాత.. పరిస్థితి ఎలా ఉంటుందని చంద్రబాబును ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబు చాలా సమగ్రంగా వివరించారు. ప్రస్తుతం కూటమి పార్టీలుగా తాము కలిసి ఉన్నామని.. ప్రజలు కూడా విశ్వాసం చూపుతున్నారని.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నామని చెప్పారు. కాబట్టి.. వచ్చే ఎన్నికల తర్వాత.. ఏం జరుగుతుందన్నది ప్రశ్నే కాదన్నారు. మరోసారి తామే అధికారంలోకి వస్తామని.. ప్రజలనుంచి సేకరించిన సంతృప్తిస్థాయి నివేదికలను ఈ సందర్భంగా వివరించారు.
పెట్టుబడులు పెట్టేవారికి తాను హామీగాఉంటానని సీఎం చెప్పారు. ప్రస్తుతం అనేక కంపెనీలు ఏపీకి వస్తన్నాయని.. సుదీర్ఘకాలంగా సింగపూర్తో ఏపీకి అనుబంధం ఉందని వివరించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని తరలిరావాలని పిలుపునిచ్చారు. `ఒక కుటుంబం- ఒక వ్యాపారవేత్త` విజన్ తో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. ముఖ్యంగా మహిళల ప్రాధాన్యం పెంచుతున్నామన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పారిశ్రామిక వేత్తలు తమకు సహకరించాలని అనుమానాలు అవసరం లేదని వ్యాఖ్యానించారు.
This post was last modified on July 29, 2025 3:02 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…