Political News

`స‌రస్వ‌తి` షేర్ల బ‌దిలీ నిలిపివేత‌: జ‌గ‌న్‌కు ఊర‌ట‌, షర్మిలకు షాక్

వైసీపీ అధినేత జ‌గ‌న్ ఫ్యామిలీ ప్యాక్ వివాదంలో కీల‌క‌మైన స‌రస్వ‌తి ప‌వ‌ర్ అండ్ ఇండ‌స్ట్రీస్ షేర్ల వ్య‌వ‌హారంలో హైద‌రాబాద్‌లోని కంపెనీ లా  ట్రైబ్యున‌ల్ కీల‌క తీర్పు వెలువ‌రించింది. ఈ కంపెనీలోని షేర్ల‌ను ట్రాన్స్ ఫ‌ర్ చేయ‌డానికి వీల్లేద‌ని స్ప‌ష్టం చేస్తూ.. గ‌తంలో తీసుకున్న నిర్ణ‌యాన్ని నిలిపివేసింది. ఈ మేర‌కు తాజాగా తీర్పు ఇచ్చింది. ఈ ప‌రిణామం.. జ‌గ‌న్‌కు ఊర‌ట‌నివ్వ‌గా.. ష‌ర్మిల‌, విజ‌య‌మ్మ‌ల‌కు ఒకింత షాక్ అనే చెబుతున్నారు న్యాయ‌నిపుణులు.

ఏంటీ వివాదం?

స‌రస్వ‌తీ ప‌వ‌ర్‌లో జ‌గ‌న్.. త‌న‌కు ఉన్న వాటాల‌ను.. విజ‌య‌మ్మ‌కు బ‌ద‌లాయించారు. వాటినే.. గిఫ్టుగా త‌న సోద‌రి ష‌ర్మిల‌కు కూడా ఇచ్చారు. అయితే.. అక్ర‌మ ఆస్తుల కేసులో ఈ కంపెనీ కూడా ఉండ‌డంతో స‌ద‌రు షేర్ల‌పై ఈడీ సీజ్ విధించింది. అంటే.. వీటిని బ‌దలాయించేందుకు.. విక్ర‌యించేందుకు అవ‌కాశం లేదు. ఏదైనా జ‌రిగితే.. అది జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దుకు దారితీసే ప‌రిణామంగా మారుతుంది. కానీ.. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు.. విజ‌య‌మ్మ .. వాటాగా ఇచ్చిన షేర్ల‌ను ష‌ర్మిల‌కు బ‌ద‌లాయించారు.

ఈ బ‌దలాయింపు జ‌రిగితే.. త‌న‌కు ఇబ్బంది అవుతుంది. ఈ నేప‌థ్యానికి తోడు.. ష‌ర్మిల‌కు అస‌లు షేర్లు ఇచ్చే ఉద్దేశం కూడా త‌న‌కు లేద‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. రాజ‌కీయాల్లో త‌న‌కు వ్య‌తిరేకంగా ఉన్న ప్ర‌త్య‌ర్థుల‌తో ఆమె చేతులు క‌లిపి.. ఇబ్బందికి గురిచేశార‌ని.. కాబ‌ట్టి.. ఇప్పుడు ఆమెపై త‌న‌కు ప్రేమ‌లేద‌ని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో త‌న త‌ల్లి, చెల్లి చేసిన బ‌ద‌లాయింపును నిలుపుద‌ల చేయాల‌ని కోరుతూ.. గ‌త ఏడాది సెప్టెంబ‌రులో కంపెనీ లాట్రైబ్యున‌ల్‌లో కేసు వేశారు.

ఇక‌, ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయ రంగు కూడా పులుముకున్న విష‌యం తెలిసిందే. త‌ల్లిని , చెల్లిని కోర్టుకు లాగారంటూ.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇటీవ‌ల విజ‌య‌మ్మ కూడా.. కంపెనీలో వాటాల‌న్నీ త‌న‌వేన‌ని.. జ‌గ‌న్‌కు ఎలాంటి సంబంధం లేద‌ని వాద‌న‌లు వినిపించారు. ఇక‌, స‌ర‌స్వ‌తి ప‌వ‌ర్ కంపెనీ బోర్డు కూడా.. జ‌గ‌న్ ఎప్పుడో ఈ బోర్డు నుంచి వైదొలిగిన నేప‌థ్యంలో ఆయ‌న‌కు కూడా దీంతో సంబంధం లేద‌ని పేర్కొంది. మొత్తంగా తీవ్ర ఉత్కంఠ‌కు దారితీసిన ఈ వ్య‌వ‌హారంపై తాజాగా మంగ‌ళ‌వారం తీర్పు వ‌చ్చింది.  సీబీఐ, ఈడీ కేసులు విచారణలో ఉండగా బదిలీలు సాధ్యం కాదంటూ తీర్పులో వెల్లడించారు.

This post was last modified on July 29, 2025 2:58 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

48 minutes ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

2 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago