Political News

మాధవ్ రాజకీయం.. బీజేపీకి ఆ వర్గాలు దూరం..!

బీజేపీ ఏపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన పీవీఎన్ మాధవ్ వ్య‌వ‌హార శైలి కాపురానికి వచ్చిన కొత్తలోనే అన్న సామెతను గుర్తు చేస్తోందని అంటున్నారు పరిశీలకులు. గతంలో పనిచేసిన ఇద్దరు కీలక నాయకులు అంద‌రినీ కలుపుకొని పోయారు. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా, సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు.

వాస్తవానికి ఆర్‌ఎస్ఎస్‌, బీజేపీతో పెద్దగా సంబంధం లేదని ద‌గ్గుబాటి పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణలకు పార్టీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించింది. దీంతో వారు కొందరికే పరిమితం అయ్యారన్న వాదన ఉంది. ఇది ఎన్నికల్లోనూ ప్రభావం చూపించింది. అలాగే, వ్యక్తిగతంగా కూడా వారిపై ప్రభావం పడేలా చేసింది. అయినా కూడా వారిపై పెద్దగా వ్యతిరేకత రాలేదు.

కానీ తాజాగా, పీవీఎన్ మాధవ్ మాత్రం ఆర్‌ఎస్ఎస్ మూలాలు ఉన్న వారినే తనను కలిసేందుకు అవకాశం ఇస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. అంతేకాదు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని పెద్దగా పట్టించుకోవడం లేదని, తనను కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని అంటున్నారు.

నిజానికి మాధవ్ రాష్ట్ర పార్టీ బాధ్యతలు చేపట్టి పది రోజులు మాత్రమే అయ్యింది. మరి ఇంతలోనే అంత విమర్శలు వస్తాయా? అంటే వస్తున్నాయి. మాధవ్‌ను కలుసుకునేందుకు చాలా మంది కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారు. వీరిలో ఎంపిక చేసుకున్న వారికే ఆయన దర్శనం లభిస్తున్నదన్న టాక్ వినిపిస్తోంది.

ఇక బీజేపీ నాయకుల్లోనూ కొందరికి మాత్రమే ఆయన చేరువ అవుతున్నారన్నది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు, కడప జిల్లాలో చేపట్టనున్న కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాల‌ని నిర్ణయించుకున్న మాధవ్, కేవలం మోదీకి మాత్రమే ఈ క్రెడిట్ ఇచ్చేలా చేస్తున్నారు.

అంటే కేంద్రంలోని మోదీ సర్కారుకు మాత్రమే తన ప్రచారం పరిమితం అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడా కూడా రాష్ట్రంలోని కూటమి సర్కారు తరఫున ఆయన వాయిస్ వినిపించే వ్యూహం కానీ, ప్రయత్నం కానీ చేయడం లేదు. ఇది కూడా బీజేపీలోని ఓ వర్గం నాయకులకు నచ్చడం లేదు.

దీంతో మాధవ్‌పై అప్పుడే కొందరు పెదవి విరుస్తున్నారు. “మేము ఆర్‌ఎస్ఎస్‌ నుంచి రాలేదు. అంత మాత్రాన బీజేపీ నాయకులం కాదా?” అని ఓ కీలక ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఈయన టీడీపీ నుంచి బీజేపీలోకి చేరి టికెట్ తెచ్చుకుని విజయం దక్కించుకున్నారు. ఇలా చాలా మంది నాయకులు ఇలాంటి వ్యాఖ్యలే చేస్తుండటం గమనార్హం.

This post was last modified on July 28, 2025 10:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈ సంక్రాంతికైనా జనంలోకి జగన్ వస్తారా?

రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే దిశ‌గా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స‌హ‌జంగా అధికారంలో ఉన్న‌పార్టీలు…

43 minutes ago

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

8 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

8 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

10 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

10 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

12 hours ago