ఏపీ సీఎం చంద్రబాబు తన కేబినెట్ను ప్రక్షాళన చేసుకోవాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ముహూర్తం కూడా పెట్టేశారని అంటున్నారు. దీంతో ఇదే కనుక నిజమైతే.. ఎవరికి అవకాశం చిక్కుతుందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే సీనియర్లు చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు. పైగా.. దీనిపై పెద్దగా ఆశలు పెట్టుకున్నవారు కూడా కనిపిస్తున్నారు. దీంతో చంద్రబాబు చేతికి చాంతాడంత లిస్ట్ చేరిందని సమాచారం.
ఇదిలావుంటే.. మంత్రివర్గంలోకి స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. లేదా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు..ను తీసుకునే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిళ్లలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వీరిలోనూ స్పీకర్ కంటే కూడా.. డిప్యూటీ స్పీకర్ వైపు మొగ్గు ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకు చంద్రబాబు తన కేబినెట్లో ముగ్గురిపై వేటు వేయనున్నట్లు తెలుస్తోం ది. ఆ ముగ్గురి ప్లేస్తో పాటు మరోకరికి కూడా అవకాశం కల్పించనున్నారు.
ఈ క్రమంలో జనసేనకు మరో సీటును కేటాయించడం ఖాయమని తెలుస్తోంది. మిగిలిన వాటిలో టీడీపీ నుంచి సీనియర్లకు అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. పైగా.. బలమైన వాయిస్ వినిపించే వారు.. ప్రభుత్వ పక్షాన మాట్లాడుతూ.. విపక్షాన్ని ఇరుకున పెట్టే మంత్రులు కావాల్సి ఉందని చంద్రబాబు యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ అయ్యన్నపాత్రుడిని.. లేదా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రఘురామకే మొగ్గు?
ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో చాలా మంది వైసీపీని టార్గెట్ చేయడంలో వెనుక బడ్డారని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామ కృష్ణరాజు అయితే బెటర్గా ఉంటుందన్న భావన ఉంది. గత ఎన్నికలకు ముందే టీడీపీలోకి వచ్చినప్పటికీ జగన్ ను నాడు అదే పార్టీలో రెబల్ ఎంపీగా ఏకేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పుడు కూడా రఘురామ అదే తీరుగా విమర్శలు గుప్పించి వైసీపీని లక్ష్యంగా చేసుకునేందుకు రఘురామ అయితే బెటర్ అన్న భావన వ్యక్తమవుతోందని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on July 26, 2025 4:20 pm
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…