ఏపీ సీఎం చంద్రబాబు తన కేబినెట్ను ప్రక్షాళన చేసుకోవాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ముహూర్తం కూడా పెట్టేశారని అంటున్నారు. దీంతో ఇదే కనుక నిజమైతే.. ఎవరికి అవకాశం చిక్కుతుందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే సీనియర్లు చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు. పైగా.. దీనిపై పెద్దగా ఆశలు పెట్టుకున్నవారు కూడా కనిపిస్తున్నారు. దీంతో చంద్రబాబు చేతికి చాంతాడంత లిస్ట్ చేరిందని సమాచారం.
ఇదిలావుంటే.. మంత్రివర్గంలోకి స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. లేదా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు..ను తీసుకునే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిళ్లలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వీరిలోనూ స్పీకర్ కంటే కూడా.. డిప్యూటీ స్పీకర్ వైపు మొగ్గు ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకు చంద్రబాబు తన కేబినెట్లో ముగ్గురిపై వేటు వేయనున్నట్లు తెలుస్తోం ది. ఆ ముగ్గురి ప్లేస్తో పాటు మరోకరికి కూడా అవకాశం కల్పించనున్నారు.
ఈ క్రమంలో జనసేనకు మరో సీటును కేటాయించడం ఖాయమని తెలుస్తోంది. మిగిలిన వాటిలో టీడీపీ నుంచి సీనియర్లకు అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. పైగా.. బలమైన వాయిస్ వినిపించే వారు.. ప్రభుత్వ పక్షాన మాట్లాడుతూ.. విపక్షాన్ని ఇరుకున పెట్టే మంత్రులు కావాల్సి ఉందని చంద్రబాబు యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ అయ్యన్నపాత్రుడిని.. లేదా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రఘురామకే మొగ్గు?
ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో చాలా మంది వైసీపీని టార్గెట్ చేయడంలో వెనుక బడ్డారని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామ కృష్ణరాజు అయితే బెటర్గా ఉంటుందన్న భావన ఉంది. గత ఎన్నికలకు ముందే టీడీపీలోకి వచ్చినప్పటికీ జగన్ ను నాడు అదే పార్టీలో రెబల్ ఎంపీగా ఏకేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పుడు కూడా రఘురామ అదే తీరుగా విమర్శలు గుప్పించి వైసీపీని లక్ష్యంగా చేసుకునేందుకు రఘురామ అయితే బెటర్ అన్న భావన వ్యక్తమవుతోందని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…
తమ సినిమాల మీద, దాని కోసం పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల మీద ఆయా చిత్ర బృందాలకు అపారమైన నమ్మకం ఉండొచ్చు.…
ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ పరిధిలో ప్రపంచ వాణిజ్య నౌకారవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసి వేస్తున్నట్టు…