ఏపీ సీఎం చంద్రబాబు తన కేబినెట్ను ప్రక్షాళన చేసుకోవాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ముహూర్తం కూడా పెట్టేశారని అంటున్నారు. దీంతో ఇదే కనుక నిజమైతే.. ఎవరికి అవకాశం చిక్కుతుందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే సీనియర్లు చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు. పైగా.. దీనిపై పెద్దగా ఆశలు పెట్టుకున్నవారు కూడా కనిపిస్తున్నారు. దీంతో చంద్రబాబు చేతికి చాంతాడంత లిస్ట్ చేరిందని సమాచారం.
ఇదిలావుంటే.. మంత్రివర్గంలోకి స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. లేదా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు..ను తీసుకునే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిళ్లలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వీరిలోనూ స్పీకర్ కంటే కూడా.. డిప్యూటీ స్పీకర్ వైపు మొగ్గు ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకు చంద్రబాబు తన కేబినెట్లో ముగ్గురిపై వేటు వేయనున్నట్లు తెలుస్తోం ది. ఆ ముగ్గురి ప్లేస్తో పాటు మరోకరికి కూడా అవకాశం కల్పించనున్నారు.
ఈ క్రమంలో జనసేనకు మరో సీటును కేటాయించడం ఖాయమని తెలుస్తోంది. మిగిలిన వాటిలో టీడీపీ నుంచి సీనియర్లకు అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. పైగా.. బలమైన వాయిస్ వినిపించే వారు.. ప్రభుత్వ పక్షాన మాట్లాడుతూ.. విపక్షాన్ని ఇరుకున పెట్టే మంత్రులు కావాల్సి ఉందని చంద్రబాబు యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ అయ్యన్నపాత్రుడిని.. లేదా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రఘురామకే మొగ్గు?
ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో చాలా మంది వైసీపీని టార్గెట్ చేయడంలో వెనుక బడ్డారని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామ కృష్ణరాజు అయితే బెటర్గా ఉంటుందన్న భావన ఉంది. గత ఎన్నికలకు ముందే టీడీపీలోకి వచ్చినప్పటికీ జగన్ ను నాడు అదే పార్టీలో రెబల్ ఎంపీగా ఏకేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పుడు కూడా రఘురామ అదే తీరుగా విమర్శలు గుప్పించి వైసీపీని లక్ష్యంగా చేసుకునేందుకు రఘురామ అయితే బెటర్ అన్న భావన వ్యక్తమవుతోందని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on July 26, 2025 4:20 pm
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…