Political News

జిల్లాలే కాదు.. మండ‌లాల‌పైనా టీడీపీ ప‌ట్టు..!

రాష్ట్రంలో జిల్లాల పేర్లు అదేవిధంగా మండలాలకు కూడా కొత్తగా పేర్లు పెట్టాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అయితే దీని వెనుక అసలు ఉద్దేశం ఏంటి.. ఈ కార్యక్రమాన్ని ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.. అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఉదాహరణకు గత వైసిపి ప్రభుత్వం 13 ఉమ్మడి జిల్లాలను 26 జిల్లాలుగా మారుస్తూ వాటికి కొత్తగా పేర్లు కూడా పెట్టింది. అప్పట్లో కొన్ని జిల్లాల పేర్లు వివాదం కావడం, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర ఘర్షణలు, గృహ దహ‌నాలు కూడా చోటు చేసుకోవడం తెలిసిందే.

అదే విధంగా అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాజంపేటగా మార్చాలన్న డిమాండ్ కూడా అప్పట్లోనే వచ్చింది. ఇక సత్యసాయి జిల్లాకి హిందూపురం కేంద్రంగా మార్చాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. ఇక పల్నాడు జిల్లా పేరును గుర్రం జాషువా పేరు పెట్టాలనేది కూడా అప్పట్లో డిమాండ్ వినిపించింది. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఆయా జిల్లాల్లో పర్యటించినప్పుడు ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకుని జిల్లాల పేర్లు మారుస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆయా జిల్లాల వరకే పరిమితం కావాల్సిన ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలను మరోసారి విభజించాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా మంత్రుల కమిటీని నియమించింది.

ఐదుగురు మంత్రులతో కూడిన కమిటీ జిల్లాల్లో పర్యటించి ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకుని అదే విధంగా రాజకీయ నాయకులు నుంచి కూడా అభిప్రాయాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అంది స్తుంది. దీనికి నిర్దిష్టమైనటువంటి సమయం కానీ, కార్యాచరణ కానీ ప్రకటించ‌లేదు. మరోవైపు 26 జిల్లాలను 34 గా మారుస్తారని కొందరు, కాదు 38 జిల్లాలుగా మార్చే అవకాశం ఉందని మరికొందరు చెబుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాను ఇప్పటికే రెండు జిల్లాలుగా మారిస్తే దీన్ని మూడు జిల్లాలుగా మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

అలాగే కృష్ణా జిల్లాను రెండు జిల్లాలుగా మారిస్తే ఇప్పుడు దీన్ని మూడు జిల్లాలుగా మార్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 34 జిల్లాల వరకు విభజించే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే పెద్దపెద్ద మండలాలుగా ఉన్నటువంటి వాటిని కుదించి రెండు మండలాలుగా విభజిస్తారన్న చర్చ కూడా నడుస్తుంది. దీనివల్ల రాజకీయంగా ప్రయోజనం ఏంటి.. లేకపోతే దీనివల్ల వచ్చే లాభం ఏంటి.. అనేది ప్రస్తుతానికి అంతుపట్టకపోయినా ఎన్నికల సమయానికి ప్రభుత్వం తనకు మేలు జరిగే లాగా వ్యవహరిస్తోంది అన్న ఆలోచన అయితే రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

చిన్నపాటి మండలాలుగా విభజించడం ద్వారా కేంద్రం నుంచి వచ్చే నిధులను పెంచుకోవచ్చన్న ఆలోచన ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఉదాహరణకు జనాభా తక్కువ ఉన్న మండలాలకు జనాభా ఎక్కువగా ఉన్న మండలాలకు కూడా కేంద్రం నుంచి వస్తున్న నిధులు ఒక్కొక్కసారి సమానంగా ఉంటుంది. దీనివల్ల ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే మండలాలను కూడా విభజించే అవకాశం ఉందని.. జిల్లాలకు ఆయా ప్రాంతాల్లోని ప్రజల డిమాండ్లను బట్టి పేర్లు పెట్టే అవకాశం ఉందని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

This post was last modified on July 26, 2025 10:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

6 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

10 hours ago