ఏపీలో తొలిసారి మెట్రో రైలు ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇప్పటి వరకు కాయితాలకే పరిమితమైన ఈ రెండు ప్రాజెక్టులపై చంద్రబాబు నేతృత్వంలోని కేబినెట్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. తొలి దశ టెండర్లను పిలిచి.. పనులు ఖరారు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో శుక్రవారం.. తొలి విడత టెండర్లను ఆహ్వానించనున్నారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు రెడీ చేశారు. విశాఖ, విజయవాడల్లో ఈ మెట్రో రైళ్లు ప్రజలకు అందుబాటులో రానున్నాయి.
మొత్తం రెండు దశల్లో మెట్రో రైళ్ల ప్రాజెక్టులు పూర్తికానున్నాయి. వీటి నిర్మాణానికి సుమారు 21.600 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. గతంలోనూ ఇదే తరహా ప్రాజెక్టులకు టీడీపీ హయాంలో శ్రీకారం చుట్టినా.. అవి ముందుకు సాగలేదు. ఇంతలో వైసీపీ సర్కారు రావడంతో అవి పూర్తిగా వెనక్కి మళ్లాయి. ఈ సారివీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం వచ్చే మూడేళ్లలో వీటిని పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులను అందించనుం ది.
విశాఖపట్నంలో భీమిలి వరకు.. విజయవాడలో అమరావతి చుట్టూ ఉండే ప్రాంతాల్లోనూ.. ఈ మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం తొలి విడత కింద.. 40 శాతం పనులకు టెండర్లను పిలవనున్నారు. వీటిలో విశాఖ మెట్రో రైలుకు 11,498 కోట్ల రూపాయలతో, విజయవాడ మెట్రోకు 10,118 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవనున్నారు. అయితే.. తొలి దశకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను కేటాయించనుంది. మలిదశలో పూర్తిగా కేంద్రం తన వాటా ఇచ్చేలా నిర్ణయించింది.
తొలి దశలో ఇచ్చే సొమ్ము ఇదీ..
This post was last modified on July 25, 2025 9:59 am
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…