ఏపీలో తొలిసారి మెట్రో రైలు ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇప్పటి వరకు కాయితాలకే పరిమితమైన ఈ రెండు ప్రాజెక్టులపై చంద్రబాబు నేతృత్వంలోని కేబినెట్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. తొలి దశ టెండర్లను పిలిచి.. పనులు ఖరారు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో శుక్రవారం.. తొలి విడత టెండర్లను ఆహ్వానించనున్నారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు రెడీ చేశారు. విశాఖ, విజయవాడల్లో ఈ మెట్రో రైళ్లు ప్రజలకు అందుబాటులో రానున్నాయి.
మొత్తం రెండు దశల్లో మెట్రో రైళ్ల ప్రాజెక్టులు పూర్తికానున్నాయి. వీటి నిర్మాణానికి సుమారు 21.600 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. గతంలోనూ ఇదే తరహా ప్రాజెక్టులకు టీడీపీ హయాంలో శ్రీకారం చుట్టినా.. అవి ముందుకు సాగలేదు. ఇంతలో వైసీపీ సర్కారు రావడంతో అవి పూర్తిగా వెనక్కి మళ్లాయి. ఈ సారివీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం వచ్చే మూడేళ్లలో వీటిని పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులను అందించనుం ది.
విశాఖపట్నంలో భీమిలి వరకు.. విజయవాడలో అమరావతి చుట్టూ ఉండే ప్రాంతాల్లోనూ.. ఈ మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం తొలి విడత కింద.. 40 శాతం పనులకు టెండర్లను పిలవనున్నారు. వీటిలో విశాఖ మెట్రో రైలుకు 11,498 కోట్ల రూపాయలతో, విజయవాడ మెట్రోకు 10,118 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవనున్నారు. అయితే.. తొలి దశకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను కేటాయించనుంది. మలిదశలో పూర్తిగా కేంద్రం తన వాటా ఇచ్చేలా నిర్ణయించింది.
తొలి దశలో ఇచ్చే సొమ్ము ఇదీ..
This post was last modified on July 25, 2025 9:59 am
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…