ఏపీలో తొలిసారి మెట్రో రైలు ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇప్పటి వరకు కాయితాలకే పరిమితమైన ఈ రెండు ప్రాజెక్టులపై చంద్రబాబు నేతృత్వంలోని కేబినెట్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. తొలి దశ టెండర్లను పిలిచి.. పనులు ఖరారు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో శుక్రవారం.. తొలి విడత టెండర్లను ఆహ్వానించనున్నారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు రెడీ చేశారు. విశాఖ, విజయవాడల్లో ఈ మెట్రో రైళ్లు ప్రజలకు అందుబాటులో రానున్నాయి.
మొత్తం రెండు దశల్లో మెట్రో రైళ్ల ప్రాజెక్టులు పూర్తికానున్నాయి. వీటి నిర్మాణానికి సుమారు 21.600 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. గతంలోనూ ఇదే తరహా ప్రాజెక్టులకు టీడీపీ హయాంలో శ్రీకారం చుట్టినా.. అవి ముందుకు సాగలేదు. ఇంతలో వైసీపీ సర్కారు రావడంతో అవి పూర్తిగా వెనక్కి మళ్లాయి. ఈ సారివీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం వచ్చే మూడేళ్లలో వీటిని పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులను అందించనుం ది.
విశాఖపట్నంలో భీమిలి వరకు.. విజయవాడలో అమరావతి చుట్టూ ఉండే ప్రాంతాల్లోనూ.. ఈ మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం తొలి విడత కింద.. 40 శాతం పనులకు టెండర్లను పిలవనున్నారు. వీటిలో విశాఖ మెట్రో రైలుకు 11,498 కోట్ల రూపాయలతో, విజయవాడ మెట్రోకు 10,118 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవనున్నారు. అయితే.. తొలి దశకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను కేటాయించనుంది. మలిదశలో పూర్తిగా కేంద్రం తన వాటా ఇచ్చేలా నిర్ణయించింది.
తొలి దశలో ఇచ్చే సొమ్ము ఇదీ..
This post was last modified on July 25, 2025 9:59 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…