ఏపీలో తొలిసారి మెట్రో రైలు ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇప్పటి వరకు కాయితాలకే పరిమితమైన ఈ రెండు ప్రాజెక్టులపై చంద్రబాబు నేతృత్వంలోని కేబినెట్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. తొలి దశ టెండర్లను పిలిచి.. పనులు ఖరారు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో శుక్రవారం.. తొలి విడత టెండర్లను ఆహ్వానించనున్నారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు రెడీ చేశారు. విశాఖ, విజయవాడల్లో ఈ మెట్రో రైళ్లు ప్రజలకు అందుబాటులో రానున్నాయి.
మొత్తం రెండు దశల్లో మెట్రో రైళ్ల ప్రాజెక్టులు పూర్తికానున్నాయి. వీటి నిర్మాణానికి సుమారు 21.600 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. గతంలోనూ ఇదే తరహా ప్రాజెక్టులకు టీడీపీ హయాంలో శ్రీకారం చుట్టినా.. అవి ముందుకు సాగలేదు. ఇంతలో వైసీపీ సర్కారు రావడంతో అవి పూర్తిగా వెనక్కి మళ్లాయి. ఈ సారివీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం వచ్చే మూడేళ్లలో వీటిని పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులను అందించనుం ది.
విశాఖపట్నంలో భీమిలి వరకు.. విజయవాడలో అమరావతి చుట్టూ ఉండే ప్రాంతాల్లోనూ.. ఈ మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం తొలి విడత కింద.. 40 శాతం పనులకు టెండర్లను పిలవనున్నారు. వీటిలో విశాఖ మెట్రో రైలుకు 11,498 కోట్ల రూపాయలతో, విజయవాడ మెట్రోకు 10,118 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవనున్నారు. అయితే.. తొలి దశకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను కేటాయించనుంది. మలిదశలో పూర్తిగా కేంద్రం తన వాటా ఇచ్చేలా నిర్ణయించింది.
తొలి దశలో ఇచ్చే సొమ్ము ఇదీ..
This post was last modified on July 25, 2025 9:59 am
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు.. ఈ వార్త నిజం కావడానికి దశాబ్దంన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అభిమానులు. వీరి…
రామ్ గోపాల్ వర్మ సత్యతో స్టార్ ఆర్టిస్టుగా మారిపోయిన మనోజ్ బాజ్ పాయ్ తెలుగులోనూ హ్యాపీ, ప్రేమకథ, కొమరం పులి…
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో భారీ విజయాన్నందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. దీని కంటే ముందు ఆయన మొదలుపెట్టిన…
తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరింత కాక రేపుతోంది. గత 2024 సెప్టెంబరు నుంచి ఇప్పటి…
గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు దర్శనం లేక డీలాపడిన అభిమానులకు ఊరట కలిగించేలా వారణాసి ఇంటర్వ్యూలు విడుదలయ్యాయి. మహేష్…
ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా మార్కెట్ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ఐతే భారీ చిత్రాల వీక్షణలో అద్భుతమైన అనుభూతిని…