Political News

అన్న‌పై మ‌రిన్ని క్లూలిచ్చిన ష‌ర్మిల‌

త‌న అన్న‌, వైసీపీ అధినేత జ‌గ‌న్ ఏపీ సీఎంగా వ్య‌వ‌హ‌రించిన స‌మ‌యంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణం కేసును కూట‌మి ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుని విచారించాల‌ని కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల స‌ర్కారును డిమాండ్ చేశారు. ఈ స‌మ‌యంలో ఆమె మ‌రికొన్న అంశాల‌ను కూడా ప్ర‌స్తావించారు. ఈ విష‌యాల‌పై దృష్టి పెట్టాలి.. అంటూ.. సీఎం చంద్ర‌బాబును కోరారు. కాగా.. ఈ కేసులో ఇప్ప‌టికే కీల‌క పాత్ర ధారులుగా ఉన్న నాయ‌కుల‌ను, వ్యాపార వేత్త‌ల‌ను, అధికారుల‌ను కూడా అరెస్టు చేసి.. జైలుకు త‌ర‌లించారు.

ఇక, ఇప్పుడు ఈ కేసులో భారీ ఎత్తున సొమ్ములు చివ‌ర‌కు ఎవ‌రికి చేరాయ‌న్న విష‌యంపై దృష్టి పెట్టారు. ఈ వ్య‌వ‌హారం ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై తాజాగా కాంగ్రెస్ చీఫ్ ష‌ర్మిల స్పందిస్తూ.. డిజిటల్ మాధ్య‌మంలో న‌గ‌దు లావాదేవీలు జ‌ర‌గాల్సిన చోట‌.. కేవ‌లం క్యాష్‌ను మాత్ర‌మే తీసుకున్నార‌ని.. అంటే.. న‌గ‌దు చేతులు మారి.. చివ‌ర‌కు ఎవ‌రికి చేరాలో వారికి చేరింద‌ని ఆరోపించారు. నాన్ డ్యూటీ లిక్క‌ర్‌ను ఎక్కువ‌గా అమ్మారని తెలిపారు. ప‌న్నులు కూడా ఎగ్గొట్టార‌ని తెలిపారు. వీట‌న్నింటిపైనా ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్) అధికారులు, ముఖ్య‌మంత్రి సైతం దృష్టి పెట్టాలి.

ష‌ర్మిల ఇచ్చిన క్లూలు ఇవీ..

  • బ్లాక్‌ మనీ కోసమే డిజిటల్‌ పేమెంట్‌ను నిలిపివేశారు.
  • డిజిటల్ పేమెంట్స్ కాకుండా.. క్యాష్ తీసుకున్నారు. పన్నులు ఎగ్గొట్టాలనే ఇలా చేశారు.
  • డిజిటల్ పేమెంట్ ఆపడం‌ వెనుక ఎంత మేర‌కు అవినీతి జ‌రిగింది?
  • నాన్‌ డ్యూటీ పేమెంట్‌లు మొత్తం ‘బ్లాక్‌’లో జరిగాయి.
  • నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత అమ్మారు?
  • బ్రాండెడ్ లిక్క‌ర్ అమ్మ‌కాలు పూర్తిగా ఆపేశారు. చీప్‌ లిక్కర్ ప్రోత్స‌హించారు. దీనికి కార‌ణం ఏంటి?
  • ఐదేళ్లలో 30 లక్షల మందికి కిడ్నీ సమస్యలు వచ్చాయి.
  • 30 వేల మందికి లివ‌ర్ స‌మ‌స్య కార‌ణంగా చనిపోయారు.
Satya

Recent Posts

బాక్సాఫీస్‌కు మంచి రోజులొచ్చాయి

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…

20 minutes ago

థియేట‌ర్లు, షోలు పెంచుకుంటున్న బంగారం

ఈ రోజుల్లో చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల‌కు రిలీజ్రోజు ఇచ్చిన థియేట‌ర్ల‌ను జ‌నంతో నింప‌డ‌మే క‌ష్టమైపోతోంది. జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం…

52 minutes ago

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

3 hours ago

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

8 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

9 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

11 hours ago