Political News

జ‌గ‌దీప్ విష‌యంలో ఏం జ‌రిగింది.. మోడీపై మ‌ర‌క‌లు!?

భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. అయితే హ‌ఠాత్తుగా ఆయ‌న నిర్ణ‌యం తీసుకోవ‌డం, ఆ రాజీనామాను అంతే వేగంగా ఆమోదించ‌డం వంటివి కేంద్రంపై అనుమానాలు పెంచేలా చేశాయి. నిజానికి జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ రాజీనామా చేసిన మూడు రోజులు అయింది. సోమ‌వారం సాయంత్రం ఆయ‌న నిర్ణ‌యం తీసుకోవ‌డం, రాత్రికి రాత్రి రాజీనామా చేయ‌డం, ఆ తెల్ల‌వారే రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము దానిని ఆమోదించ‌డం తెలిసిందే.

అయితే దీనిపై చ‌ర్చ మాత్రం ఎక్కడా ఆగ‌డం లేదు. అనేక కార‌ణాలు, అనుమానాలు తెర‌మీదికి వ‌స్తూనే ఉన్నాయి. ప్ర‌ధానంగా కేంద్రంలోని మోడీ స‌ర్కారుపైనే వేళ్ల‌న్నీ చూపుతుండ‌డం గ‌మ‌నార్హం. రాజ్యాంగబ‌ద్ధ‌మైన ప‌ద‌వుల విష‌యంలో కేంద్రం జోక్యం పెరిగిపోయింద‌న్న విమ‌ర్శ‌లు ఇప్పుడు మ‌రోసారి ముసురుకున్నాయి.

రాజ్య‌స‌భ‌లో అల‌హాబాద్ హైకోర్టు న్యాయ‌మూర్తులు జ‌స్టిస్‌ జ‌స్వంత్ వ‌ర్మ‌, జ‌స్టిస్ శేఖ‌ర్‌ల‌పై ఒకేసారి అభిసంశ‌న తీర్మానాలు తెర‌మీదికి వ‌చ్చాయి. జ‌స్టిస్ వ‌ర్మ ఇంట్లో వంద‌ల కోట్ల రూపాయ‌ల నోట్ల క‌ట్టలు కాలిపోయి ఉండ‌డం వెలుగు చూసిన త‌ర్వాత విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో అవినీతిపై చ‌ర్చ కూడా జ‌రిగింది.

దీంతో జ‌స్టిస్‌ వ‌ర్మ‌ను త‌ప్పించడం ద్వారా వ‌చ్చే క్రెడిట్‌ను త‌మ ఖాతాలో వేసుకునేందుకు బీజేపీ ప్ర‌య‌త్నం చేసింది. ఆగ‌మేఘాల‌పై సంత‌కాల సేక‌ర‌ణ కూడా చేసింది. ఇంత‌లోనే జ‌స్టిస్ శేఖ‌ర్ మ‌త‌ప‌ర‌మైన విద్వేషాలు రెచ్చ‌గొట్టార‌ని, ఆయ‌న‌ను కూడా అభిసంశించాల‌ని ప్ర‌తిప‌క్షం నోటీసులు ఇచ్చింది. అయితే ఈ విష‌యంలో బీజేపీ డిఫ‌ర్ అయింది. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఆర్‌ఎస్ఎస్ అనుకూలంగా ఉండ‌డంతో బీజేపీ విముఖ‌త చూపింది.

జ‌స్టిస్ శేఖ‌ర్‌పై ప్ర‌తిప‌క్షాలు ఇచ్చిన అవిశ్వాసాన్ని చైర్మ‌న్ హోదాలో జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ స్వీక‌రించారు. ఇది కేంద్రానికి మంట‌పుట్టించింద‌న్న చ‌ర్చ ఉంది. ఈ కార‌ణంగానే ఆయ‌న‌ను త‌ప్పించాల‌ని కోరిన‌ట్టు జాతీయ మీడియాలో వ‌ర్గాలు చెబుతున్నాయి.

మ‌రోవైపు, బీహార్‌లో ఎన్నిక‌లు ఉన్నందున అక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించుకుని ముఖ్య‌మంత్రి సీటును సొంతం చేసుకోవాల‌న్న వ్యూహంతో, మిత్ర‌ప‌క్షం జేడీయూ నేత ప్ర‌స్తుత సీఎం నితీష్ కుమార్‌ను నేరుగా తీసుకువ‌చ్చి ఉప‌రాష్ట్ర‌ప‌తి పీఠంపై కూర్చోబెట్టాల‌న్న వ్యూహం ఉంద‌న్న‌ది మ‌రో చ‌ర్చ‌.

అందుకే ధ‌న్‌ఖ‌డ్‌ను త‌ప్పించార‌న్న‌ది పెద్ద ఎత్తున సాగుతున్న విశ్లేష‌ణ‌. అయితే దీనిలో ఏది నిజ‌మైనా, అది ప్ర‌ధాని మోడీకే మ‌చ్చ‌లు, మ‌ర‌క‌లు తెచ్చేలా ఉంటుంద‌న్న‌ది మ‌రో మాట‌. రాజ్యాంగబ‌ద్ధ‌మైన ప‌ద‌వుల‌ను కూడా రాజ‌కీయాల కోసం శాసిస్తున్నారా? అనేది జాతీయ మీడియాలో వ‌స్తున్న విశ్లేష‌ణ‌. మ‌రి చివ‌ర‌కు ఏం తేలుతుందో చూడాలి.

This post was last modified on July 24, 2025 2:58 pm

Share

Recent Posts

చెల్లెలిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

క‌లిసి రాజ‌కీయం చేయ‌క‌పోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య కొన్ని పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణ‌లో ఈ…

3 hours ago

చెన్నైలో చింటు మేనియా

సోష‌ల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. త‌న సినిమాల ఈవెంట్ల‌లో, ఇంట‌ర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్ర‌ముఖ తెలుగు…

3 hours ago

కనకరాజు లెక్కలు సేఫ్ గానే ఉన్నాయా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…

3 hours ago

బాగుంది ఆదివారం… థియేటర్లలో జన సందోహం

ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…

4 hours ago

కాలేజీలు కాదు… విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు రీయంబర్స్మెంట్ జమ?

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…

4 hours ago

పోలీసు యూనిఫాంలో ఉగ్ర‌వాదులు… ఢిల్లీ నిర‌స‌న‌ల్లో కుట్ర‌?

నీట్ ప్ర‌శ్న‌ప‌త్రం లీకేజీకి వ్య‌తిరేకంగా విద్యార్థులు చేప‌ట్టిన ఢిల్లీ నిర‌స‌న‌లో ఉగ్ర‌వాదుల కుట్ర కోణం బ‌య‌ట ప‌డింద‌ని ఢిల్లీ టాస్క్‌ఫోర్స్…

4 hours ago