Political News

జ‌గ‌దీప్ విష‌యంలో ఏం జ‌రిగింది.. మోడీపై మ‌ర‌క‌లు!?

భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. అయితే హ‌ఠాత్తుగా ఆయ‌న నిర్ణ‌యం తీసుకోవ‌డం, ఆ రాజీనామాను అంతే వేగంగా ఆమోదించ‌డం వంటివి కేంద్రంపై అనుమానాలు పెంచేలా చేశాయి. నిజానికి జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ రాజీనామా చేసిన మూడు రోజులు అయింది. సోమ‌వారం సాయంత్రం ఆయ‌న నిర్ణ‌యం తీసుకోవ‌డం, రాత్రికి రాత్రి రాజీనామా చేయ‌డం, ఆ తెల్ల‌వారే రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము దానిని ఆమోదించ‌డం తెలిసిందే.

అయితే దీనిపై చ‌ర్చ మాత్రం ఎక్కడా ఆగ‌డం లేదు. అనేక కార‌ణాలు, అనుమానాలు తెర‌మీదికి వ‌స్తూనే ఉన్నాయి. ప్ర‌ధానంగా కేంద్రంలోని మోడీ స‌ర్కారుపైనే వేళ్ల‌న్నీ చూపుతుండ‌డం గ‌మ‌నార్హం. రాజ్యాంగబ‌ద్ధ‌మైన ప‌ద‌వుల విష‌యంలో కేంద్రం జోక్యం పెరిగిపోయింద‌న్న విమ‌ర్శ‌లు ఇప్పుడు మ‌రోసారి ముసురుకున్నాయి.

రాజ్య‌స‌భ‌లో అల‌హాబాద్ హైకోర్టు న్యాయ‌మూర్తులు జ‌స్టిస్‌ జ‌స్వంత్ వ‌ర్మ‌, జ‌స్టిస్ శేఖ‌ర్‌ల‌పై ఒకేసారి అభిసంశ‌న తీర్మానాలు తెర‌మీదికి వ‌చ్చాయి. జ‌స్టిస్ వ‌ర్మ ఇంట్లో వంద‌ల కోట్ల రూపాయ‌ల నోట్ల క‌ట్టలు కాలిపోయి ఉండ‌డం వెలుగు చూసిన త‌ర్వాత విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో అవినీతిపై చ‌ర్చ కూడా జ‌రిగింది.

దీంతో జ‌స్టిస్‌ వ‌ర్మ‌ను త‌ప్పించడం ద్వారా వ‌చ్చే క్రెడిట్‌ను త‌మ ఖాతాలో వేసుకునేందుకు బీజేపీ ప్ర‌య‌త్నం చేసింది. ఆగ‌మేఘాల‌పై సంత‌కాల సేక‌ర‌ణ కూడా చేసింది. ఇంత‌లోనే జ‌స్టిస్ శేఖ‌ర్ మ‌త‌ప‌ర‌మైన విద్వేషాలు రెచ్చ‌గొట్టార‌ని, ఆయ‌న‌ను కూడా అభిసంశించాల‌ని ప్ర‌తిప‌క్షం నోటీసులు ఇచ్చింది. అయితే ఈ విష‌యంలో బీజేపీ డిఫ‌ర్ అయింది. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఆర్‌ఎస్ఎస్ అనుకూలంగా ఉండ‌డంతో బీజేపీ విముఖ‌త చూపింది.

జ‌స్టిస్ శేఖ‌ర్‌పై ప్ర‌తిప‌క్షాలు ఇచ్చిన అవిశ్వాసాన్ని చైర్మ‌న్ హోదాలో జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ స్వీక‌రించారు. ఇది కేంద్రానికి మంట‌పుట్టించింద‌న్న చ‌ర్చ ఉంది. ఈ కార‌ణంగానే ఆయ‌న‌ను త‌ప్పించాల‌ని కోరిన‌ట్టు జాతీయ మీడియాలో వ‌ర్గాలు చెబుతున్నాయి.

మ‌రోవైపు, బీహార్‌లో ఎన్నిక‌లు ఉన్నందున అక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించుకుని ముఖ్య‌మంత్రి సీటును సొంతం చేసుకోవాల‌న్న వ్యూహంతో, మిత్ర‌ప‌క్షం జేడీయూ నేత ప్ర‌స్తుత సీఎం నితీష్ కుమార్‌ను నేరుగా తీసుకువ‌చ్చి ఉప‌రాష్ట్ర‌ప‌తి పీఠంపై కూర్చోబెట్టాల‌న్న వ్యూహం ఉంద‌న్న‌ది మ‌రో చ‌ర్చ‌.

అందుకే ధ‌న్‌ఖ‌డ్‌ను త‌ప్పించార‌న్న‌ది పెద్ద ఎత్తున సాగుతున్న విశ్లేష‌ణ‌. అయితే దీనిలో ఏది నిజ‌మైనా, అది ప్ర‌ధాని మోడీకే మ‌చ్చ‌లు, మ‌ర‌క‌లు తెచ్చేలా ఉంటుంద‌న్న‌ది మ‌రో మాట‌. రాజ్యాంగబ‌ద్ధ‌మైన ప‌ద‌వుల‌ను కూడా రాజ‌కీయాల కోసం శాసిస్తున్నారా? అనేది జాతీయ మీడియాలో వ‌స్తున్న విశ్లేష‌ణ‌. మ‌రి చివ‌ర‌కు ఏం తేలుతుందో చూడాలి.

This post was last modified on July 24, 2025 2:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్యారడైజ్ గుమ్మడికాయ… రోమియో కొబ్బరికాయ

మార్చి నుంచి ఆగస్టుకి విడుదల తేదీ వాయిదా వేసుకున్న నాని ది ప్యారడైజ్ ఖచ్చితంగా చెప్పిన డేట్ కి విడుదలవుతుందా…

39 minutes ago

లీకులు సరే… నెక్స్ట్ ఏంటి నాయకా

జన నాయకుడు పైరసీని పూర్తి స్థాయిలో కాకపోయినా గరిష్ట స్థాయిలో కట్టడి చేయడంలో నిర్మాణ సంస్థ సక్సెస్ అయ్యింది. వీడియో…

4 hours ago

అదేంటో… మోడీ స‌ర్‌కి ఎన్నిక‌ల‌ప్పుడే అన్నీ గుర్తుకొస్తాయి!

అదేంటో కానీ.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీకి ప‌లు కీల‌క విష‌యాలు సాధార‌ణ రోజుల్లో ఎక్క‌డా గుర్తుకు ఉండ‌వు... రావు. ఎన్నిక‌ల…

4 hours ago

మృణాల్ పాటించాల్సిన సలహానే ఇది

సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…

7 hours ago

స్టాండ‌ప్ క‌మెడియన్ సారీ… అంద‌రికీ ఓ పాఠం

జ‌నాల‌ను న‌వ్వించ‌డం కోసం సెల‌బ్రెటీల వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి వెళ్లిపోతే ప‌రిణామాలు ఎలా ఉంటాయో మ‌రోసారి రుజువైంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్, రామ్…

8 hours ago

మళ్లీ ‘టీఆర్ఎస్’ గా గులాబీ సేన?

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…

9 hours ago