Political News

మాజీ మంత్రి మాట.. ఎవ‌రూ విన‌డం లేద‌ట‌!

ఆయ‌న మాజీ మంత్రి. ఒక‌ప్పుడు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఆయ‌న‌కు రెడ్ కార్పెట్ స్వాగతాలు ల‌భించాయి. అంతేకాదు, పార్టీలోనూ కొన్నాళ్లపాటు ఆయ‌న షార్ప్ షూట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ప్రాధాన్యం కూడా ఇచ్చారు.

కానీ ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న‌కు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింద‌నే ఆవేద‌న‌లో ఉన్నారు. ఆయ‌నే విశాఖ‌ప‌ట్నం జిల్లా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు. తాజాగా ఆయ‌న అంత‌ర్గ‌త స‌మావేశంలో ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌స్తుతం సీఎం చంద్ర‌బాబు “సుప‌రిపాల‌నలో తొలి అడుగు” కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన విష‌యం తెలిసిందే. ఎమ్మెల్యేలు, మంత్రులు స‌హా పార్టీ నాయ‌కుల‌ను దీనిలో భాగ‌స్వామ్యం చేశారు. ఈ క్ర‌మంలో భీమిలిలోనూ ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించేందుకు ఎమ్మెల్యే గంటా ఇటీవ‌ల ప్ర‌య‌త్నించారు. కానీ అధికారులు ఎవ‌రూ కూడా రాలేదన్న‌ది ఆయ‌న ఆవేద‌న. అంతేకాదు, తాను చెప్పిన త‌ర్వాత కూడా ప‌నులు చేయ‌డం లేద‌న్నది ఎమ్మెల్యే ఆవేద‌న.

అందుకే ఆయ‌న ఇటీవ‌ల కాలంలో పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కూడా దూరంగా ఉన్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోనూ పెద్ద‌గా జోక్యం చేసుకోవ‌డం లేదు. ముఖ్యంగా కూట‌మిలోని పార్టీల్లో ఉన్న కొంద‌రు నాయ‌కులు వ్య‌వ‌హరిస్తున్న తీరుతో మాజీ మంత్రి హ‌ర్టవుతున్నార‌న్న‌ది స‌త్యం.

బీజేపీ నాయ‌కుడు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నేరుగా ఫిర్యాదులు చేయ‌డం, విమ‌ర్శ‌లు చేయ‌డం వంటివాటిని గంటా జీర్ణించుకోలేక‌పోతున్నారు. కొన్నాళ్ల కింద‌ట కూడా ఇరువురి మ‌ధ్య క్రికెట్ అసోసియేష‌న్ స‌హా భూముల‌కు సంబంధించిన వివాదాలు తెర‌మీద‌కు వ‌చ్చాయి. అప్ప‌ట్లో న‌డిరోడ్డుపైనే ఇరువురు నాయ‌కులు వాదించుకున్నారు.

ఆ త‌ర్వాత ఈ విష‌యంలో సీఎం చంద్ర‌బాబు జోక్యం చేసుకుంటార‌ని గంటా శ్రీనివాస‌రావు భావించారు. కానీ ఈ వ్య‌వ‌హారంపై ప్ర‌భుత్వ ప‌క్షాన ఎవ‌రూ జోక్యం చేసుకోలేదు. అప్ప‌టి నుంచి గంటా సీరియ‌స్ పాలిటిక్స్‌ను ప‌క్క‌న పెట్టారు.

ఇక ఇప్పుడు అధికారులు కూడా త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, తాను చెప్పిన ప‌నులు కూడా కావ‌డం లేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న మౌనంగా ఉండిపోతున్నార‌ని విశాఖ రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది.

This post was last modified on July 22, 2025 4:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago