వచ్చే ఐదేళ్లలో 20 లక్షల మంది పేదలను పేదరికం నుంచి బయటకు తీసుకురావాలన్న లక్ష్యంతో ఏపీ సీఎం చంద్రబాబు పీ-4 మంత్రాన్ని జపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఎక్కడ ఏ వేదిక ఎక్కినా.. పేదలను దత్తత తీసుకునేందుకుముందుకు రావాలని పారిశ్రామిక, ధనిక వర్గాలకు విన్న విస్తున్నారు. తాజాగా ఈ లక్ష్య సాధనలో సీఎం చంద్రబాబు ఒక మైలురాయిని దాటారు. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల మంది పేద కుటుంబాలను పైకి తీసుకురావాలన్న సంకల్పంలో కీలక అడుగు పడింది.
అదే..ఏడాదిలో ఐదు లక్షల కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చేందుకు సంపన్న వర్గాలు ముందుకు వచ్చాయి. వాస్తవానికి పీ4 కార్యక్రమాన్ని ప్రకటించి 8 నెలలు అయింది. ఈ 8 మాసాల్లో దాదాపు ఎక్కడికి వెళ్లినా.. సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మార్గదర్శుల కోసం ఆయన నిరీక్షించారు. మొత్తానికి వారిని ఒప్పించి.. సుమారు 5 లక్షల మంది బంగారు కుటుంబాలను వారికి అప్పగించేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన పేదరిక కుటుంబాల్లోని 5 లక్షల మందిని ఆగస్టు 15న మార్గదర్శకులకు అందిస్తారు. అనంతరం.. ఆయా కుటుంబాల విద్య, ఉద్యోగ, ఉపాధి అంశాలను మార్గదర్శకులు చూసుకుంటారు. వీరిని వచ్చే మూడేళ్లలో పైకి తీసుకురావాలన్నది కీలక లక్ష్యం. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత.. మరో 5లక్షల కుటుంబాలను మార్గదర్శకులకు అందించే కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
దీనికి సంబంధించి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో బంగారు కుటుంబాలను గుర్తించేందుకు సచివాలయ వ్యవస్థను వినియోగించుకోనున్నారు. అలానే మార్గదర్శకులను గుర్తించే బాధ్యతను నేరుగా కలెక్టర్లకు అప్పగించారు. అందరూ సమన్వయం పనిచేయడం ద్వారా.. 2029 ఎన్నికలకు ముందే.. 20 లక్షల బంగారు కుటుంబాలకు.. మేలు చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.
This post was last modified on July 22, 2025 4:44 pm
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…