ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని ఎంతమంది విజయవంతం చేశారు? ఎంత మంది ఇంటికే పరిమితమయ్యారు? అంటే.. చాలా మంది ఫెయిలయ్యారన్నది చంద్ర బాబుకే అందిన నివేదిక తేల్చి చెబుతోంది. తాజాగా ఐవీఆర్ఎస్ సర్వే సహా.. ఇతర మాధ్యమాల్లో ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని ఏవిధంగా విజయవంతం చేశారన్న విషయాన్ని సీఎం చంద్రబాబు తెలుసుకున్నా రు. దీని పై ఒకటి రెండు నివేదికలు కూడా తెప్పించుకున్నారు.
ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన తొలి తరం ఎమ్మెల్యేల నుంచి సీనియర్ల వరకు కూడా ఈ కార్యక్రమంలో ఏమేరకు భాగస్వామ్యం అయ్యారన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించారు. దీనిలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఇప్పటికి ఈ కార్యక్రమం చేపట్టి 20 రోజులు అవుతున్నాయి. సుపరిపాలన కార్యక్రమం ద్వారా ప్రజల మధ్యకు వెళ్లి.. ఏడాది కాలంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించాలన్న సీఎం చంద్రబాబు ఉద్దేశం. వైసీపీ వ్యతిరేకత ప్రచారాన్ని తగ్గించాలన్నది కూడా బాబు వ్యూహం.
అయితే.. ఈ ఉద్దేశాన్ని కొత్తతరం నాయకులు చాలా వరకు నెరవేర్చలేకపోయారన్నది తాజాగా వచ్చిన నివేదిక తేటతెల్లం చేసింది. కొందరు ఒకటి రెండు మాత్రమే మొక్కబడిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరికొందరు.. తమకు ఇతర వ్యాపకాలు ఉన్నాయన్నట్టుగా వ్యవహరించారు. దీంతో ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేల్లో 15 మంది వరకు వెనుకబడ్డారని సమాచారం. మరో 20 మంది అసలు ఈ రేసులో పాల్గొనలేదని.. కార్యక్రమాలను లైట్ తీసుకున్నారని పార్టీకి సమాచారం వచ్చింది.
అయితే..వారెవరు? అనే విషయాన్ని పార్టీ అధిష్టానం నుంచి నాయకుల వరకు కూడా అందరూ గోప్యంగా ఉంచారు. ఎవరూ బయటకు వెల్లడించడం లేదు. దీనికి కారణం.. వీరిని చూసి మిగిలిన వారు కూడా నేర్చుకుంటారన్న భావన ఉండి ఉంటుందన్న చర్చ కూడా ఉంది. ఏదేమైనా.. చంద్రబాబు ఏ స్పూర్తితో అయితే.. ఈ కార్యక్రమాన్ని చేపట్టారో.. దానిని నెరవేర్చడంలో నాయకులు విఫలమవుతున్నారన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో మరోసారి ఈ నెల చివరిలో చంద్రబాబు పార్టీ నాయకులతో భేటీ అయి.. సీరియస్గానే వారికి విషయాన్ని చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది.
This post was last modified on July 21, 2025 1:19 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…