మహారాష్ట్రలో వ్యవసాయ మంత్రి మాణిక్రావ్ కోకాటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా రమ్మీ గేమ్ ఆడుతున్నట్లు వీడియో వైరల్ కావడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపింది. అధికారంలో ఉన్న బీజేపీ కూటమిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టాయి. రైతులు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే, వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం అసెంబ్లీలో గేమ్స్ ఆడుతున్నారని విపక్ష నేతలు మండిపడ్డారు.
వైరల్ అయిన ఈ వీడియోను ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) నేత రోహిత్ పవార్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రోజుకు సగటున ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అనేక వ్యవసాయ సమస్యలు పెండింగ్లో ఉన్నా మంత్రికి మాత్రం రమ్మీ గేమ్ ఆడేందుకు సమయం ఉందా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం రైతుల బాధలు పట్టించుకోకుండా అసెంబ్లీని ఇలా వినోదం చేసుకుంటోందని ఆరోపించారు.
ఈ ఆరోపణలపై మంత్రి కోకాటే స్పందిస్తూ తన చర్యలను సమర్థించుకున్నారు. తాను గేమ్ ఆడలేదని, అసలు ఆ గేమ్ను స్కిప్ చేయడానికి ప్రయత్నించానని అన్నారు. అసెంబ్లీ లోయర్ హౌస్లో చర్చ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకోవడానికి యూట్యూబ్ ఓపెన్ చేయగా, పొరపాటున రమ్మీ గేమ్ డౌన్లోడ్ అయిందని వివరించారు. గేమ్ను తొలగించేందుకు ప్రయత్నించగా అది వెంటనే పోలేదని, కానీ ఆ తర్వాత గేమ్ను స్కిప్ చేశానని తెలిపారు. విపక్షాలు సగం వీడియో చూపించి తనను టార్గెట్ చేస్తున్నాయని, ఒకసారి పూర్తి వీడియో చూడాలని ఆరోపించారు.
ఈ ఘటనతో పాటు రాష్ట్రంలో ఎన్సీపీ పార్టీ ఏకం కావడంపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నాయకుడు సునీల్ తట్కరే, ఎన్సీపీ రెండు వర్గాలు మళ్లీ కలవాలంటే బీజేపీ అగ్రనాయకత్వంతో సంప్రదింపులు తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. జూలై 2023లోనే అజిత్ పవార్ వర్గం బీజేపీతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఎన్సీపీ ఏకం కావడంపై సునీల్ తట్కరే వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీస్తున్నాయి.
ఇదిలా ఉండగా, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో ఇటీవల వచ్చిన వరదలతో వేలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ ఇస్తామని ప్రకటించారు. దీన్ని స్వాగతించినప్పటికీ, దీర్ఘకాలిక పరిష్కారాల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆయన ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి కోకాటే వీడియో వివాదం ప్రభుత్వానికి మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ అంశంపై మరింత వివాదం నడుస్తోంది.
This post was last modified on July 21, 2025 9:48 am
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…