Political News

అసెంబ్లీలో మంత్రి రమ్మీ గేమ్‌

మహారాష్ట్రలో వ్యవసాయ మంత్రి మాణిక్రావ్ కోకాటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా రమ్మీ గేమ్ ఆడుతున్నట్లు వీడియో వైరల్ కావడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపింది. అధికారంలో ఉన్న బీజేపీ కూటమిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టాయి. రైతులు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే, వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం అసెంబ్లీలో గేమ్స్ ఆడుతున్నారని విపక్ష నేతలు మండిపడ్డారు.

వైరల్ అయిన ఈ వీడియోను ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) నేత రోహిత్ పవార్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రోజుకు సగటున ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అనేక వ్యవసాయ సమస్యలు పెండింగ్‌లో ఉన్నా మంత్రికి మాత్రం రమ్మీ గేమ్ ఆడేందుకు సమయం ఉందా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం రైతుల బాధలు పట్టించుకోకుండా అసెంబ్లీని ఇలా వినోదం చేసుకుంటోందని ఆరోపించారు.

ఈ ఆరోపణలపై మంత్రి కోకాటే స్పందిస్తూ తన చర్యలను సమర్థించుకున్నారు. తాను గేమ్ ఆడలేదని, అసలు ఆ గేమ్‌ను స్కిప్ చేయడానికి ప్రయత్నించానని అన్నారు. అసెంబ్లీ లోయర్ హౌస్‌లో చర్చ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకోవడానికి యూట్యూబ్ ఓపెన్ చేయగా, పొరపాటున రమ్మీ గేమ్ డౌన్‌లోడ్ అయిందని వివరించారు. గేమ్‌ను తొలగించేందుకు ప్రయత్నించగా అది వెంటనే పోలేదని, కానీ ఆ తర్వాత గేమ్‌ను స్కిప్ చేశానని తెలిపారు. విపక్షాలు సగం వీడియో చూపించి తనను టార్గెట్ చేస్తున్నాయని, ఒకసారి పూర్తి వీడియో చూడాలని ఆరోపించారు.

ఈ ఘటనతో పాటు రాష్ట్రంలో ఎన్సీపీ పార్టీ ఏకం కావడంపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నాయకుడు సునీల్ తట్కరే, ఎన్సీపీ రెండు వర్గాలు మళ్లీ కలవాలంటే బీజేపీ అగ్రనాయకత్వంతో సంప్రదింపులు తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. జూలై 2023లోనే అజిత్ పవార్ వర్గం బీజేపీతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఎన్సీపీ ఏకం కావడంపై సునీల్ తట్కరే వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీస్తున్నాయి.

ఇదిలా ఉండగా, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో ఇటీవల వచ్చిన వరదలతో వేలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ ఇస్తామని ప్రకటించారు. దీన్ని స్వాగతించినప్పటికీ, దీర్ఘకాలిక పరిష్కారాల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆయన ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి కోకాటే వీడియో వివాదం ప్రభుత్వానికి మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ అంశంపై మరింత వివాదం నడుస్తోంది.

This post was last modified on July 21, 2025 9:48 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అంబటి రాంబాబు కాపు టైగర్ – జగన్

అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ…

42 minutes ago

SRH: కమిన్స్ లేకుంటే కెప్టెన్ ఎవరు మరీ?

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…

1 hour ago

నెల రోజుల గ్యాపులో బాబాయ్ అబ్బాయ్

రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…

3 hours ago

లెజెండ్ పోయాడు… లీడర్ వస్తున్నాడు

నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ 'ది లెజెండ్'తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి…

3 hours ago

గేమ్ కోసం ఫోన్ ఇవ్వలేదని ముగ్గురు అక్కాచెల్లెళ్ళు…

​ఘజియాబాద్‌లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…

5 hours ago

అల్లరోడి ఆల్కహాల్ అడ్రస్ ఎక్కడ

అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…

6 hours ago