మహారాష్ట్రలో వ్యవసాయ మంత్రి మాణిక్రావ్ కోకాటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా రమ్మీ గేమ్ ఆడుతున్నట్లు వీడియో వైరల్ కావడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపింది. అధికారంలో ఉన్న బీజేపీ కూటమిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టాయి. రైతులు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే, వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం అసెంబ్లీలో గేమ్స్ ఆడుతున్నారని విపక్ష నేతలు మండిపడ్డారు.
వైరల్ అయిన ఈ వీడియోను ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) నేత రోహిత్ పవార్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రోజుకు సగటున ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అనేక వ్యవసాయ సమస్యలు పెండింగ్లో ఉన్నా మంత్రికి మాత్రం రమ్మీ గేమ్ ఆడేందుకు సమయం ఉందా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం రైతుల బాధలు పట్టించుకోకుండా అసెంబ్లీని ఇలా వినోదం చేసుకుంటోందని ఆరోపించారు.
ఈ ఆరోపణలపై మంత్రి కోకాటే స్పందిస్తూ తన చర్యలను సమర్థించుకున్నారు. తాను గేమ్ ఆడలేదని, అసలు ఆ గేమ్ను స్కిప్ చేయడానికి ప్రయత్నించానని అన్నారు. అసెంబ్లీ లోయర్ హౌస్లో చర్చ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకోవడానికి యూట్యూబ్ ఓపెన్ చేయగా, పొరపాటున రమ్మీ గేమ్ డౌన్లోడ్ అయిందని వివరించారు. గేమ్ను తొలగించేందుకు ప్రయత్నించగా అది వెంటనే పోలేదని, కానీ ఆ తర్వాత గేమ్ను స్కిప్ చేశానని తెలిపారు. విపక్షాలు సగం వీడియో చూపించి తనను టార్గెట్ చేస్తున్నాయని, ఒకసారి పూర్తి వీడియో చూడాలని ఆరోపించారు.
ఈ ఘటనతో పాటు రాష్ట్రంలో ఎన్సీపీ పార్టీ ఏకం కావడంపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నాయకుడు సునీల్ తట్కరే, ఎన్సీపీ రెండు వర్గాలు మళ్లీ కలవాలంటే బీజేపీ అగ్రనాయకత్వంతో సంప్రదింపులు తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. జూలై 2023లోనే అజిత్ పవార్ వర్గం బీజేపీతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఎన్సీపీ ఏకం కావడంపై సునీల్ తట్కరే వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీస్తున్నాయి.
ఇదిలా ఉండగా, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో ఇటీవల వచ్చిన వరదలతో వేలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ ఇస్తామని ప్రకటించారు. దీన్ని స్వాగతించినప్పటికీ, దీర్ఘకాలిక పరిష్కారాల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆయన ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి కోకాటే వీడియో వివాదం ప్రభుత్వానికి మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ అంశంపై మరింత వివాదం నడుస్తోంది.
This post was last modified on July 21, 2025 9:48 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…