Political News

విప‌క్ష‌ల డిమాండ్‌కు కేంద్రం ఓకే.. వ్యూహమేంటి?

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం తొలిసారి విప‌క్షాలు పెట్టిన డిమాండ్‌కు ఓకే చెప్పింది. 11 సంవ‌త్స‌రాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తిప‌క్షాలు పెట్టిన ఏడిమాండ్‌ను ఓకే చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో తొలిసారి ప్ర‌తిప‌క్షాలు లేవ‌నెత్తిన డిమాండ్‌పై ఓకే చెప్ప‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. మ‌రి దీని వెనుక వ్యూహం ఏంటి? కేంద్రం ఎందుకు దిగి వ‌చ్చింది? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి.

అస‌లు విష‌యం ఏంటి?

సోమ‌వారం నుంచి పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో 12కు పైగా కీల‌క బిల్లుల‌ను ఆమోదించుకునేందుకు మోడీ ప్ర‌భుత్వం రెడీ అయింది. ఈ క్ర‌మంలో ఆదివారం మ‌ధ్యాహ్నం.. అఖిల ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించింది. పార్ల‌మెంటులో అనుస‌రించాల్సిన వ్యూహంపై ఇప్ప‌టికే కేంద్రం ఒక క్లారిటీతో ఉంది. ఈ క్ర‌మంలో స‌మావేశాల‌కు స‌హ‌కరించాల‌ని ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు విన్న‌వించింది. అయితే.. కేంద్రంపై గ‌త నాలుగు మాసాలుగా గుర్రుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ స‌హా.. ఇత‌ర ప్ర‌తిప‌క్షాలు.. త‌మ డిమాండ్ల‌ను తొలుత నెర‌వేర్చాల‌ని ప‌ట్టుబ‌ట్టాయి. వాటిపై హామీ ఇవ్వాల‌న్నాయి.

ముఖ్యంగా.. 1) ఆప‌రేష‌న్ సిందూర్ ను అర్ధంతరంగా ఎందుకు నిలిపివేయాల్సి వ‌చ్చింది. 2) ప‌హ‌ల్గాం దాడికి ఒక రోజు ముందు ప్ర‌ధాని మోడీ విదేశీ ప‌ర్య‌ట‌న‌ను అర్థంతరంగా ఎందుకు నిలుపుద‌ల చేసుకోవాల్సి వ‌చ్చింది. 3) ఆప‌రేష‌న్ సిందూర్‌పై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్ర‌క‌ట‌న‌లు.. అనంతరం జ‌రిగిన ప‌రిణామాలు. ఈ మూడు అంశాల‌పై పార్ల‌మెంటులో చ‌ర్చించాలని ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేశాయి. అయితే.. వాస్త‌వానికి వీటిని చ‌ర్చించేందుకు.. ఆది నుంచి కూడా కేంద్రం మొగ్గు చూప‌డం లేదు. అందుకే.. అనేక సంద‌ర్భాల్లో ప్ర‌ధాని మోడీ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కువ చ్చినా.. ఆయా విష‌యాల‌ను మాత్రం ప్ర‌స్తావించ‌లేదు.

కానీ.. ఇప్పుడు కీల‌క‌మైన 12 బిల్లుల‌ను ఆమోదించుకోవాల్సి రావ‌డం.. త‌మ‌కు మ‌ద్ద‌తుగా ఉన్న పార్టీల నుంచి కూడా ఇవే ప్ర‌శ్న‌లు వ‌స్తుండ‌డంతో పార్ల‌మెంటులో వీటిని చ‌ర్చించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలోనే విప‌క్షాలు చేసిన డిమాండ్ల‌కు.. కేంద్రం మొగ్గు చూపింది. “ఓకే మీరు చేసిన డిమాండ్ల‌పై చ‌ర్చించేందుకు మేం సిద్ధం” అంటూ.. కేంద్రం ప్ర‌తిప‌క్షాల‌కు తేల్చి చెప్పింది.

This post was last modified on July 21, 2025 6:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago