Political News

విప‌క్ష‌ల డిమాండ్‌కు కేంద్రం ఓకే.. వ్యూహమేంటి?

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం తొలిసారి విప‌క్షాలు పెట్టిన డిమాండ్‌కు ఓకే చెప్పింది. 11 సంవ‌త్స‌రాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తిప‌క్షాలు పెట్టిన ఏడిమాండ్‌ను ఓకే చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో తొలిసారి ప్ర‌తిప‌క్షాలు లేవ‌నెత్తిన డిమాండ్‌పై ఓకే చెప్ప‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. మ‌రి దీని వెనుక వ్యూహం ఏంటి? కేంద్రం ఎందుకు దిగి వ‌చ్చింది? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి.

అస‌లు విష‌యం ఏంటి?

సోమ‌వారం నుంచి పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో 12కు పైగా కీల‌క బిల్లుల‌ను ఆమోదించుకునేందుకు మోడీ ప్ర‌భుత్వం రెడీ అయింది. ఈ క్ర‌మంలో ఆదివారం మ‌ధ్యాహ్నం.. అఖిల ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించింది. పార్ల‌మెంటులో అనుస‌రించాల్సిన వ్యూహంపై ఇప్ప‌టికే కేంద్రం ఒక క్లారిటీతో ఉంది. ఈ క్ర‌మంలో స‌మావేశాల‌కు స‌హ‌కరించాల‌ని ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు విన్న‌వించింది. అయితే.. కేంద్రంపై గ‌త నాలుగు మాసాలుగా గుర్రుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ స‌హా.. ఇత‌ర ప్ర‌తిప‌క్షాలు.. త‌మ డిమాండ్ల‌ను తొలుత నెర‌వేర్చాల‌ని ప‌ట్టుబ‌ట్టాయి. వాటిపై హామీ ఇవ్వాల‌న్నాయి.

ముఖ్యంగా.. 1) ఆప‌రేష‌న్ సిందూర్ ను అర్ధంతరంగా ఎందుకు నిలిపివేయాల్సి వ‌చ్చింది. 2) ప‌హ‌ల్గాం దాడికి ఒక రోజు ముందు ప్ర‌ధాని మోడీ విదేశీ ప‌ర్య‌ట‌న‌ను అర్థంతరంగా ఎందుకు నిలుపుద‌ల చేసుకోవాల్సి వ‌చ్చింది. 3) ఆప‌రేష‌న్ సిందూర్‌పై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్ర‌క‌ట‌న‌లు.. అనంతరం జ‌రిగిన ప‌రిణామాలు. ఈ మూడు అంశాల‌పై పార్ల‌మెంటులో చ‌ర్చించాలని ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేశాయి. అయితే.. వాస్త‌వానికి వీటిని చ‌ర్చించేందుకు.. ఆది నుంచి కూడా కేంద్రం మొగ్గు చూప‌డం లేదు. అందుకే.. అనేక సంద‌ర్భాల్లో ప్ర‌ధాని మోడీ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కువ చ్చినా.. ఆయా విష‌యాల‌ను మాత్రం ప్ర‌స్తావించ‌లేదు.

కానీ.. ఇప్పుడు కీల‌క‌మైన 12 బిల్లుల‌ను ఆమోదించుకోవాల్సి రావ‌డం.. త‌మ‌కు మ‌ద్ద‌తుగా ఉన్న పార్టీల నుంచి కూడా ఇవే ప్ర‌శ్న‌లు వ‌స్తుండ‌డంతో పార్ల‌మెంటులో వీటిని చ‌ర్చించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలోనే విప‌క్షాలు చేసిన డిమాండ్ల‌కు.. కేంద్రం మొగ్గు చూపింది. “ఓకే మీరు చేసిన డిమాండ్ల‌పై చ‌ర్చించేందుకు మేం సిద్ధం” అంటూ.. కేంద్రం ప్ర‌తిప‌క్షాల‌కు తేల్చి చెప్పింది.

This post was last modified on July 21, 2025 6:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జైల్లో ఎంజాయ్ చేసిన అంబటి

ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…

3 hours ago

చేదుగా ఉన్నా నిజం చెప్పిన దిల్ రాజు

ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…

4 hours ago

బుర్ఖా వేసుకున్న యువకుడు.. ఫ్రీ బస్ కోసమేనా?

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్‌లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…

5 hours ago

‘ఆ రెండు’ సీట్లు కాంగ్రెస్‌వే.. ఎవ‌రికి ద‌క్కేనో!!

తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…

6 hours ago

పుష్ప స్టైల్ లో లోకేష్ కౌంటర్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను వీక్షించడం…

6 hours ago

డిల్లీ వేదికపై చైనా రోబో.. ఏంటి వివాదం?

ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్‌లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…

6 hours ago