Political News

మిథున్ రెడ్డికి జైలు.. తీవ్ర ఉత్కంఠ న‌డుమ తీర్పు!

వైసీపీ నాయ‌కుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి విజ‌య‌వాడ‌లోని ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఆగ‌స్టు 1వ తేదీ వ‌రకు ఆయ‌న‌కు రిమాండ్ విధిస్తూ.. న్యాయాధికారి తీర్పు వెలువ‌రించారు. దీంతో మిథున్ రెడ్డిని అత్యంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త న‌డుమ రాజ‌మండ్రి కేంద్ర కారాగారానికి త‌ర‌లించారు. అయితే.. దీనికి ముందు సుమారు 4 గంట‌లకు పైగానే హైడ్రామా న‌డిచిం ది. త‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని.. మిథున్ రెడ్డికోర్టుకు తెలిపారు. అయితే.. అదంతా ఉత్తిదేన‌ని.. ఆయ‌న ఆరోగ్యం బాగానే ఉంద‌ని ద‌ర్యాప్తు బృందం త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టుకు వివ‌రించారు. ఇలా.. ఇరు ప‌క్షాలు కూడా గంట‌ల కొద్దీ వాద‌న‌లు వినిపించ‌డంతో తీర్పుపై ఉత్కంఠ నెల‌కొంది.

మిథున్‌రెడ్డి త‌ర‌ఫున సీనియ‌ర్‌ న్యాయ‌వాది నాగార్జున రెడ్డి వాద‌న‌లు వినిపించారు. మిథున్‌రెడ్డికి రక్తం గడ్డకట్టే వ్యాధి(బ్లడ్ క్లాట్స్) ఉన్న దృష్ట్యా.. ఆసుపత్రిలో చికిత్స అందించాలని కోర్టును కోరారు. అంతేకాదు.. మిథున్ రెడ్డి ‘వై’ కేట‌గిరీ భ‌ద్ర‌త‌లో ఉన్నార‌ని.. ఆయ‌న ప్యాన‌ల్ స్పీక‌ర్‌గా కూడా ప‌నిచేశార‌ని చెప్పారు. ఒక‌వేళ రిమాండ్ విధించాల్సి వ‌స్తే.. నెల్లూరు జైలుకు త‌రలించాల‌ని.. త‌ద్వారా వైద్య సేవలు పొందేందుకు వీలుగా ఉంటుంద‌న్నారు. అయితే..కోర్టు దీనిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. మ‌రోవైపు సిట్ అధికారుల త‌ర‌ఫునన్యాయ‌వాది కోటేశ్వ‌ర‌రావు వాద‌న‌లు వినిపించారు.

మిథున్ రెడ్డినిసంపూర్ణంగా విచారించ‌లేద‌ని, ఆయ‌న‌ను మ‌రోసారి అదుపులోకి తీసుకుని విచారించాల్సి ఉంద‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో ఆయ‌నను గుంటూరు స‌బ్ జైలుకు త‌ర‌లించాల‌ని కోరారు. అయితే.. ఇరు ప‌క్షాల వాద‌న‌ల‌ను కూడా.. కోర్టు ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోలేదు. సుదీర్ఘ వాద‌న‌ల అనంత‌రం.. మిథున్ రెడ్డిని రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించాల‌ని ఆదేశించింది. ఆగ‌స్టు 1వ తేదీ వ‌ర‌కు రిమాండ్ విధించింది. ఇదిలావుంటే.. శ‌నివారం రాత్రి విజ‌య‌వాడ పోలీసు క‌మిష‌న‌ర్ బంగ‌ళాలోని ప్ర‌త్యేక గ‌దిలో నే ఉన్న మిథున్ రెడ్డి.. ఆహారం తీసుకోలేద‌ని.. చెప్ప‌డంతో ఆయ‌న‌కు ఆహారం అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించింది. ఇక‌, చార్జిషీట్ దాఖ‌లైన త‌ర్వాత‌.. అరెస్టు చేయ‌డం ఎందుక‌న్న వాద‌న‌ల‌ను కూడా కోర్టు తోసిపుచ్చింది.

This post was last modified on July 21, 2025 6:41 am

Share
Show comments
Published by
Satya
Tags: Mithun Reddy

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

17 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

20 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago