Political News

జ‌గ‌న్ ఆశించేది ఒక‌టి.. జ‌రుగుతోంది మ‌రొక‌టి.. !

వైసీపీ అధినేత జ‌గ‌న్ ఏం ఆశిస్తున్నారు? ఏం చేయాల‌ని భావిస్తున్నారు? అంటే.. ఖ‌చ్చితంగా కూట‌మి స‌ర్కారు పై వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌ని.. అది త‌మ‌కు మేలు చేస్తుంద‌ని.. కాబ‌ట్టి.. నాలుగేళ్ల త‌ర్వాత జ‌రిగే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవ‌డం ఖాయ‌మ‌ని పార్టీ నాయ‌కుల‌కు జ‌గ‌న్ తేల్చి చెబుతున్నారు. ఓకే.. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా జ‌గ‌న్‌కు ఆమేర‌కు ఆశ‌లు ఉండ‌డం త‌ప్పుకాదు. అయితే.. మారుతున్న ప‌రిణామాలు.. పెరుగుతున్న కూట‌మి దూకుడుతో ఈ ఆశ‌లు నెర‌వేర‌డం క‌ష్ట‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

దీనికి ప్ర‌ధానంగా మూడు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి.

1) నాలుగేళ్ల త‌ర్వాత‌.. మారే ప‌రిస్థితి: ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయాలు.. కూట‌మి వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును చూసి జ‌గ‌న్‌.. వ‌చ్చే ఎన్నికల్లో త‌మ‌దే విజ‌య‌మ‌ని అనుకుంటున్నారు. కానీ.. చంద్ర‌బాబు స‌హా ప‌వ‌న్ క‌ల్యాణ్ చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ప్ర‌స్తుతం ఎలా ఉన్నా.. వ‌చ్చే రెండేళ్ల త‌ర్వాత‌.. రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగాల‌కు పెద్ద‌పీట వేస్తారు. ఉచిత బ‌స్సు ప‌థ‌కం కూడా వ‌స్తుంది. రైతుల‌కు నిధులు అందుతాయి. దీంతో పూర్తిగా అన్నీ మారిపోతాయి.

2) త‌మ పార్టీ పుంజుకుంటుంద‌నేది జ‌గ‌న్ భావ‌న‌: కానీ.. ఈ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నూ బీజేపీ-జ‌న‌సేన‌-టీడీపీ కూట‌మిగానే ఎన్నిక‌ల‌కు వెళ్ల‌నున్నాయి. ఈ విష‌యాన్ని పార్టీల నాయ‌కులు కూడా చెబుతున్నారు. ఈసారికి క‌ష్ట‌మైనా.. న‌ష్ట‌మైనా..క‌లిసి ఉండాల‌ని బ‌ల‌మైన నాయ‌కులే చెబుతున్నా రు. ఈ ప్ర‌భావంతో కూట‌మి క‌లిసి ఉంటుంద‌న్న‌ది స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇది మ‌రోసారి వైసీపీకి పెను విప‌త్తుగా మార‌నుంది. అంటే.. ఆ పార్టీ పుంజుకునే అవ‌కాశం చాలా వ‌ర‌కు త‌క్కువ‌గా ఉంద‌ని అర్ధ‌మ‌వుతోంది.

3) క‌లిసి వ‌చ్చే అవ‌కాశం త‌క్కువ‌: ప్ర‌జ‌ల ప‌రంగా చూసుకున్నా.. వైసీపీకి క‌లిసి వ‌చ్చే ప‌రిణామాలు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. స‌మాజంలోని 40 శాతం ఓటు బ్యాంకు ద‌గ్గ‌రే వైసీపీ ఆగిపోయింది. పైగా గ‌త ఏడాదికాలంలో ఇది పెరిగింద‌ని ఆపార్టీ నాయ‌కులు కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. దీనిని పెంచుకునేందుకు కూడా ప్ర‌య‌త్నాలు ముందుకు సాగ‌డం లేదు. క‌లిసి వ‌చ్చే పార్టీలేదు. నాయ‌కులు కూడా క‌నిపించ‌డం లేదు. సో.. ఎలా చూసుకున్నా.. జ‌గ‌న్ ఆశిస్తున్న‌ట్గుగా అయితే.. ప‌రిణామాలు లేవ‌న్న‌ది .. విశ్లేష‌కులు చెబుతున్న మాట‌.

This post was last modified on July 21, 2025 1:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

9 minutes ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

18 minutes ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

2 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

4 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

4 hours ago