Political News

జీహెచ్ఎంసీ ఎన్నికలకు పవన్ సై

తెలంగాణలో ఇప్పటిదాకా ఏ ఎన్నికల్లోనూ జనసేన పార్టీ పోటీ చేయలేదు. తొలిసారిగా ఇక్కడ ఆ పార్టీ అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన బరిలోకి దిగబోతున్నట్లు కొన్ని రోజుల కిందటే సంకేతాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ విషయమై అధికారిక ప్రకటన వచ్చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్ధమంటూ ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటన విడుదల చేశారు.

ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని యువ కార్యకర్తల విజ్ఞప్తి మేరకు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో, అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీలో క్రియాశీలకంగా ఉన్న కార్యకర్తలు, యువ జనసైనికుల నుంచి ఈ అంశంపై పలు విజ్ఞప్తులు వచ్చాయని.. వారి వినతి మేరకు ఎన్నికల్లో పోటీకి సన్నద్ధం కావాలని పార్టీ నాయకులకు, నగర పరిధిలోని కమిటీలకు స్పష్టం చేసినట్లు పవన్ వెల్లడించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై కార్యకర్తలు, కమిటీల ప్రతినిధులు ఇప్పటికే పలు దఫాలు సమావేశమై చర్చించుకున్నట్లు చెప్పిన పవన్.. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు డివిజన్లలో జనసేన కమిటీ క్షేత్ర స్థాయిలో పని చేస్తూ ప్రజల పక్షాన నిలబడటం, తమ కార్యకలాపాలపై సమగ్రంగా చర్చించుకోవడం జరిగిందని.. ఎన్నికల్లో పోటీ చేయాలని కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారని తెలిపాడు.

ఐతే భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్న నేపథ్యంలో జనసేన ఆ పార్టీతోనే కలిసి పోటీ చేస్తుందా లేదా అన్నది మాత్రం ఈ ప్రకటనలో పేర్కొనలేదు. మరి ఈ విషయంలో పవన్ ఏం నిర్ణయిస్తారో చూడాలి. 2014 ఎన్నికల తర్వాత పవన్ ఎప్పుడూ ఇక్కడి అధికార టీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేసింది లేదు. ఇప్పుడు బీజేపీతో కలిస్తే కచ్చితంగా కేసీఆర్‌ను టార్గెట్ చేయాలి. ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంలా మారిన బీజేపీ టీఆర్ఎస్‌ను ఎలా ఢీకొడుతోందో తెలిసిందే. మరి ఆ పార్టీతో కలిసి జనసేన టీఆర్ఎస్‌ను టార్గెట్ చేయగలదా అన్నది సందేహం.

Satya

Recent Posts

రామాయణ ఇంకెప్పుడు మేలుకుంటుంది

ఇండియా చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాగా చెప్పుకుంటున్న రామాయణ విడుదలకు జూన్ మినహాయిస్తే ఇంకో నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది.…

5 hours ago

పెద్దోళ్ల కమిటీ… జగన్ కు నచ్చట్లేదా?

వైసీపీలో పొలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల్లో ప‌రాజయం త‌ర్వాత‌.. జ‌గ‌న్‌.. పీఏసీకి…

9 hours ago

రణ్వీర్ నిషేధం… హీరోలకు ఒక పాఠం

రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…

11 hours ago

భార‌త్ బంగారం అమ్మేసిందా?

ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న ఉద్రిక్త‌తల నేప‌థ్యంలో ఇంధ‌నం, బంగారం దిగుమ‌తుల‌పై కేంద్ర ప్ర‌భుత్వం భారీ స్థాయిలో విదేశీ మార‌క‌ద్ర‌వ్యాన్ని వెచ్చిస్తున్న విష‌యం…

12 hours ago

అమ్మ సెంటిమెంట్ జాన్వీకి కలిసొస్తుందా

అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…

13 hours ago

ఆంధ్రాలో కుల భావన ఉంది… ‘నా ఆంధ్రా’ భావన లేదు: పవన్

అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…

14 hours ago