Political News

జీహెచ్ఎంసీ ఎన్నికలకు పవన్ సై

తెలంగాణలో ఇప్పటిదాకా ఏ ఎన్నికల్లోనూ జనసేన పార్టీ పోటీ చేయలేదు. తొలిసారిగా ఇక్కడ ఆ పార్టీ అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన బరిలోకి దిగబోతున్నట్లు కొన్ని రోజుల కిందటే సంకేతాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ విషయమై అధికారిక ప్రకటన వచ్చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్ధమంటూ ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటన విడుదల చేశారు.

ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని యువ కార్యకర్తల విజ్ఞప్తి మేరకు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో, అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీలో క్రియాశీలకంగా ఉన్న కార్యకర్తలు, యువ జనసైనికుల నుంచి ఈ అంశంపై పలు విజ్ఞప్తులు వచ్చాయని.. వారి వినతి మేరకు ఎన్నికల్లో పోటీకి సన్నద్ధం కావాలని పార్టీ నాయకులకు, నగర పరిధిలోని కమిటీలకు స్పష్టం చేసినట్లు పవన్ వెల్లడించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై కార్యకర్తలు, కమిటీల ప్రతినిధులు ఇప్పటికే పలు దఫాలు సమావేశమై చర్చించుకున్నట్లు చెప్పిన పవన్.. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు డివిజన్లలో జనసేన కమిటీ క్షేత్ర స్థాయిలో పని చేస్తూ ప్రజల పక్షాన నిలబడటం, తమ కార్యకలాపాలపై సమగ్రంగా చర్చించుకోవడం జరిగిందని.. ఎన్నికల్లో పోటీ చేయాలని కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారని తెలిపాడు.

ఐతే భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్న నేపథ్యంలో జనసేన ఆ పార్టీతోనే కలిసి పోటీ చేస్తుందా లేదా అన్నది మాత్రం ఈ ప్రకటనలో పేర్కొనలేదు. మరి ఈ విషయంలో పవన్ ఏం నిర్ణయిస్తారో చూడాలి. 2014 ఎన్నికల తర్వాత పవన్ ఎప్పుడూ ఇక్కడి అధికార టీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేసింది లేదు. ఇప్పుడు బీజేపీతో కలిస్తే కచ్చితంగా కేసీఆర్‌ను టార్గెట్ చేయాలి. ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంలా మారిన బీజేపీ టీఆర్ఎస్‌ను ఎలా ఢీకొడుతోందో తెలిసిందే. మరి ఆ పార్టీతో కలిసి జనసేన టీఆర్ఎస్‌ను టార్గెట్ చేయగలదా అన్నది సందేహం.

This post was last modified on November 17, 2020 6:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

న్యూ ఏజ్ దర్శకులకు ప్రభాస్ ఛాన్స్

అదేంటి దర్శకుల్లో ఈ న్యూ ఏజ్ బ్యాచ్ ఎవరనుకుంటున్నారా. కమర్షియల్ ఎలిమెంట్స్ కి దూరంగా సహజమైన కథా కథనాలతో నిజ…

24 minutes ago

మల్లారెడ్డికి లైఫ్ ఇచ్చిన చంద్రబాబు

మాజీ ఎంపీ, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మళ్లీ పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. 50వ వివాహ వార్షికోత్సవం…

44 minutes ago

ఎంపికల్లో ఈ జాగ్రత్త ఉండాలి జగన్

నియోజ‌క‌వ‌ర్గాల‌కు నాయ‌కుల‌ను ఎంపిక చేస్తున్న జ‌గ‌న్‌పై అదే నాయ‌కుల నుంచి అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తమ ఒత్తిడితోనే జ‌గ‌న్ ఈ…

1 hour ago

శంకర్ మెడకు ఇండియన్ ఉచ్చు

తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ ఏ ముహూర్తాన ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్ తీయాలనుకున్నాడో కానీ.. అది ఆయనకు కెరీర్లో ఎన్నడూ…

2 hours ago

బాలీవుడ్ కొన్నేళ్లు తలెత్తుకోవచ్చు

సౌత్ సినిమాను దశాబ్దాలుగా తక్కువగా చూస్తుండేది బాలీవుడ్. అక్కడి నటులు, ఫిలిం మేకర్లు తమను తాము గొప్పగా ఫీలయ్యేవాళ్లన్నది స్పష్టం.…

3 hours ago

33 వేల రూపాయలతో సినిమా తీయొచ్చు

హెడ్డింగ్ చదవగానే కొందరికి నవ్వు వచ్చి ఉండొచ్చు లేదా విచిత్రంగా అనిపించవచ్చు. ఎందుకంటే ఇంత తక్కువ మొత్తంలో ఈ రోజుల్లో…

5 hours ago