తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్పై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకు డు కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ అపరిచితుడిగా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బనకచర్ల ప్రాజెక్టు(ఇంకా రూపు దిద్దుకోలేదు) సహా ఇతర నదీ జలాల విషయం వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కిషన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఏ రాష్ట్రానికీ అనుకూలంగా కేంద్రం తీర్పు ఇవ్వదని తెలిపారు.
ఏ రాష్ట్రాల జలాల విషయంలో అయినా.. కేంద్రం కేవలం ఫెసిలిటేటర్ మాత్రమేనని కిషన్రెడ్డి చెప్పారు. తాజాగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య కేంద్రం చేపట్టిన చర్చలను ఇప్పుడు బీఆర్ఎస్ తప్పుబడుతోందని, కానీ, బీఆర్ఎస్ హయాంలో ఏపీ సీఎంగా ఉన్న జగన్తో కలిసి కేంద్రం మధ్యవర్తిగా చర్చలు జరపలేదా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. గోదావరి జలాలకు మళ్లిస్తామని చెప్పలేదా? అన్నారు. కేసీఆర్ అప్పుడు ఒక మాట.. ఇప్పుడు ఒక మాట చెబుతూ.. అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారని కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు.
జల వివాదాల పై రెండు రాష్ట్రాలు మాట్లాడుకుని పరిష్కారం చేసుకోవాలనేది కేంద్రం చెబుతున్న మాటగా కేంద్ర మంత్రి వెల్లడించారు. నీటి వివాదాలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులుపడాలనేదే కేంద్రం ఆలోచనగా చెప్పారు. ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని కిషన్ రెడ్డి సూచించారు. కేసీఆర్కు కిషన్రెడ్డి సహకరిస్తున్నారనడం సరికాదని మరో వైపు కాంగ్రెస్ నాయకులకు కూడా చురకలు అంటించారు.
తెలంగాణ హక్కులను కాపాడటంలో.. బీజేపీ సహా కేంద్రం వెనకడుగు వేయదని కిషన్రెడ్డి చెప్పారు. ఒక రాష్ట్రానికి అన్యాయం..మరో రాష్ట్రానికి మేలు చేయబోదని.. రెండు రాష్ట్రాలకు న్యాయం జరగాలని కోరుకుంటామని కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. ఏదైనా ఉంటే కూర్చుని చర్చించుకోవడంలో తప్పులేదన్నారు. ప్రస్తు తం బీఆర్ఎస్ నాయకులకు పనిలేకుండాపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. అందుకే ప్రతి విషయాన్నీ రాజకీయం చేస్తున్నారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…