తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్పై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకు డు కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ అపరిచితుడిగా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బనకచర్ల ప్రాజెక్టు(ఇంకా రూపు దిద్దుకోలేదు) సహా ఇతర నదీ జలాల విషయం వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కిషన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఏ రాష్ట్రానికీ అనుకూలంగా కేంద్రం తీర్పు ఇవ్వదని తెలిపారు.
ఏ రాష్ట్రాల జలాల విషయంలో అయినా.. కేంద్రం కేవలం ఫెసిలిటేటర్ మాత్రమేనని కిషన్రెడ్డి చెప్పారు. తాజాగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య కేంద్రం చేపట్టిన చర్చలను ఇప్పుడు బీఆర్ఎస్ తప్పుబడుతోందని, కానీ, బీఆర్ఎస్ హయాంలో ఏపీ సీఎంగా ఉన్న జగన్తో కలిసి కేంద్రం మధ్యవర్తిగా చర్చలు జరపలేదా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. గోదావరి జలాలకు మళ్లిస్తామని చెప్పలేదా? అన్నారు. కేసీఆర్ అప్పుడు ఒక మాట.. ఇప్పుడు ఒక మాట చెబుతూ.. అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారని కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు.
జల వివాదాల పై రెండు రాష్ట్రాలు మాట్లాడుకుని పరిష్కారం చేసుకోవాలనేది కేంద్రం చెబుతున్న మాటగా కేంద్ర మంత్రి వెల్లడించారు. నీటి వివాదాలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులుపడాలనేదే కేంద్రం ఆలోచనగా చెప్పారు. ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని కిషన్ రెడ్డి సూచించారు. కేసీఆర్కు కిషన్రెడ్డి సహకరిస్తున్నారనడం సరికాదని మరో వైపు కాంగ్రెస్ నాయకులకు కూడా చురకలు అంటించారు.
తెలంగాణ హక్కులను కాపాడటంలో.. బీజేపీ సహా కేంద్రం వెనకడుగు వేయదని కిషన్రెడ్డి చెప్పారు. ఒక రాష్ట్రానికి అన్యాయం..మరో రాష్ట్రానికి మేలు చేయబోదని.. రెండు రాష్ట్రాలకు న్యాయం జరగాలని కోరుకుంటామని కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. ఏదైనా ఉంటే కూర్చుని చర్చించుకోవడంలో తప్పులేదన్నారు. ప్రస్తు తం బీఆర్ఎస్ నాయకులకు పనిలేకుండాపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. అందుకే ప్రతి విషయాన్నీ రాజకీయం చేస్తున్నారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.
This post was last modified on July 18, 2025 6:25 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…