Political News

పహల్గాం దాడి వెనుక ఉన్న TRFపై అమెరికా సీరియస్?

ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన భయానక ఉగ్రదాడికి బాధ్యత వహించిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)’ను అమెరికా అధికారికంగా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో ఈ ప్రకటన చేయడంతో పాటు, TRF లష్కరే తోయిబా అనే పాక్ కేంద్రిత ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఇది ట్రంప్ ప్రభుత్వం జాతీయ భద్రతపై తీసుకున్న గట్టి నిశ్చయాన్ని ప్రతిబింబిస్తున్నదని రుబియో పేర్కొన్నారు.

పహల్గాం బైసరణ్ లోయలో ఆ రోజు ఉగ్రవాదులు తుపాకులతో టూరిస్టులపై కాల్పులు జరపడంతో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహం రేపగా, అమెరికా సహా అనేక దేశాలు భారత్‌కు మద్దతు ప్రకటించాయి. అదే సమయంలో అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోదీకి కాల్ చేసి సానుభూతి వ్యక్తం చేశారు. ఈ దాడిపై స్పందిస్తూ, “ఇది చాలా ఘోరమైన ఘటన” అని వ్యాఖ్యానించారు.

TRF ఇప్పటికే భారత్‌లో ఎన్నో దాడులకు పాల్పడిన చరిత్ర కలిగిన సంస్థ. జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌పై డ్రోన్ దాడి, ఆయుధాల సరఫరా, కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకోవడం లాంటి చర్యలు TRF ఖాతాలో ఉన్నాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ ఆర్మీ, ISI అనుచితంగా TRF పేరును లాంఛనప్రాయంగా ప్రవేశపెట్టిందని భారత ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడించాయి. FATF యొక్క ఆర్ధిక పర్యవేక్షణను తప్పించేందుకు ఇది ఒక వ్యూహంగా పరిగణించబడుతోంది.

భారత ప్రభుత్వం ఇప్పటికే TRFను ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. 2023లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ యూజీఏపీఏ చట్టం కింద TRFపై నిషేధం విధించింది. ఈ సంస్థ కమాండర్ సజ్జాద్ గుల్‌ను వ్యక్తిగత ఉగ్రవాదిగా ప్రకటించింది. టెర్రరిజం ప్రచారం, యువతను భయపెట్టి రిక్రూట్‌మెంట్ చేయడం, డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా వంటి కార్యకలాపాలలో TRF భాగస్వామిగా ఉన్నదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పుడు అమెరికా తీసుకున్న చర్యతో TRFపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగే అవకాశముంది. ఇది భారత్‌కు మద్దతుగా నిలిచే కీలకమైన దౌత్యపరమైన పరిణామంగా భావిస్తున్నారు.

This post was last modified on July 18, 2025 3:10 pm

Share

Recent Posts

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

2 hours ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

6 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

10 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

10 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

11 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

11 hours ago