Political News

పహల్గాం దాడి వెనుక ఉన్న TRFపై అమెరికా సీరియస్?

ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన భయానక ఉగ్రదాడికి బాధ్యత వహించిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)’ను అమెరికా అధికారికంగా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో ఈ ప్రకటన చేయడంతో పాటు, TRF లష్కరే తోయిబా అనే పాక్ కేంద్రిత ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఇది ట్రంప్ ప్రభుత్వం జాతీయ భద్రతపై తీసుకున్న గట్టి నిశ్చయాన్ని ప్రతిబింబిస్తున్నదని రుబియో పేర్కొన్నారు.

పహల్గాం బైసరణ్ లోయలో ఆ రోజు ఉగ్రవాదులు తుపాకులతో టూరిస్టులపై కాల్పులు జరపడంతో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహం రేపగా, అమెరికా సహా అనేక దేశాలు భారత్‌కు మద్దతు ప్రకటించాయి. అదే సమయంలో అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోదీకి కాల్ చేసి సానుభూతి వ్యక్తం చేశారు. ఈ దాడిపై స్పందిస్తూ, “ఇది చాలా ఘోరమైన ఘటన” అని వ్యాఖ్యానించారు.

TRF ఇప్పటికే భారత్‌లో ఎన్నో దాడులకు పాల్పడిన చరిత్ర కలిగిన సంస్థ. జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌పై డ్రోన్ దాడి, ఆయుధాల సరఫరా, కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకోవడం లాంటి చర్యలు TRF ఖాతాలో ఉన్నాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ ఆర్మీ, ISI అనుచితంగా TRF పేరును లాంఛనప్రాయంగా ప్రవేశపెట్టిందని భారత ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడించాయి. FATF యొక్క ఆర్ధిక పర్యవేక్షణను తప్పించేందుకు ఇది ఒక వ్యూహంగా పరిగణించబడుతోంది.

భారత ప్రభుత్వం ఇప్పటికే TRFను ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. 2023లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ యూజీఏపీఏ చట్టం కింద TRFపై నిషేధం విధించింది. ఈ సంస్థ కమాండర్ సజ్జాద్ గుల్‌ను వ్యక్తిగత ఉగ్రవాదిగా ప్రకటించింది. టెర్రరిజం ప్రచారం, యువతను భయపెట్టి రిక్రూట్‌మెంట్ చేయడం, డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా వంటి కార్యకలాపాలలో TRF భాగస్వామిగా ఉన్నదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పుడు అమెరికా తీసుకున్న చర్యతో TRFపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగే అవకాశముంది. ఇది భారత్‌కు మద్దతుగా నిలిచే కీలకమైన దౌత్యపరమైన పరిణామంగా భావిస్తున్నారు.

Satya

Recent Posts

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

3 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

4 hours ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

5 hours ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

5 hours ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

5 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

6 hours ago