Political News

పహల్గాం దాడి వెనుక ఉన్న TRFపై అమెరికా సీరియస్?

ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన భయానక ఉగ్రదాడికి బాధ్యత వహించిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)’ను అమెరికా అధికారికంగా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో ఈ ప్రకటన చేయడంతో పాటు, TRF లష్కరే తోయిబా అనే పాక్ కేంద్రిత ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఇది ట్రంప్ ప్రభుత్వం జాతీయ భద్రతపై తీసుకున్న గట్టి నిశ్చయాన్ని ప్రతిబింబిస్తున్నదని రుబియో పేర్కొన్నారు.

పహల్గాం బైసరణ్ లోయలో ఆ రోజు ఉగ్రవాదులు తుపాకులతో టూరిస్టులపై కాల్పులు జరపడంతో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహం రేపగా, అమెరికా సహా అనేక దేశాలు భారత్‌కు మద్దతు ప్రకటించాయి. అదే సమయంలో అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోదీకి కాల్ చేసి సానుభూతి వ్యక్తం చేశారు. ఈ దాడిపై స్పందిస్తూ, “ఇది చాలా ఘోరమైన ఘటన” అని వ్యాఖ్యానించారు.

TRF ఇప్పటికే భారత్‌లో ఎన్నో దాడులకు పాల్పడిన చరిత్ర కలిగిన సంస్థ. జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌పై డ్రోన్ దాడి, ఆయుధాల సరఫరా, కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకోవడం లాంటి చర్యలు TRF ఖాతాలో ఉన్నాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ ఆర్మీ, ISI అనుచితంగా TRF పేరును లాంఛనప్రాయంగా ప్రవేశపెట్టిందని భారత ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడించాయి. FATF యొక్క ఆర్ధిక పర్యవేక్షణను తప్పించేందుకు ఇది ఒక వ్యూహంగా పరిగణించబడుతోంది.

భారత ప్రభుత్వం ఇప్పటికే TRFను ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. 2023లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ యూజీఏపీఏ చట్టం కింద TRFపై నిషేధం విధించింది. ఈ సంస్థ కమాండర్ సజ్జాద్ గుల్‌ను వ్యక్తిగత ఉగ్రవాదిగా ప్రకటించింది. టెర్రరిజం ప్రచారం, యువతను భయపెట్టి రిక్రూట్‌మెంట్ చేయడం, డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా వంటి కార్యకలాపాలలో TRF భాగస్వామిగా ఉన్నదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పుడు అమెరికా తీసుకున్న చర్యతో TRFపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగే అవకాశముంది. ఇది భారత్‌కు మద్దతుగా నిలిచే కీలకమైన దౌత్యపరమైన పరిణామంగా భావిస్తున్నారు.

Satya

Recent Posts

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

53 minutes ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

2 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

4 hours ago

నేను హోమ్ మినిస్టర్ కాకపోవడమే నేరస్తుల అదృష్టం: పవన్

ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…

5 hours ago

సెన్సార్ చిక్కులు చిన్న సినిమాలకేనా

వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…

6 hours ago

పింక్ శారీలో రాశి.. చూపు తిప్పుకోవడం కష్టమే!

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…

7 hours ago