ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గాం వద్ద జరిగిన భయానక ఉగ్రదాడికి బాధ్యత వహించిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)’ను అమెరికా అధికారికంగా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో ఈ ప్రకటన చేయడంతో పాటు, TRF లష్కరే తోయిబా అనే పాక్ కేంద్రిత ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఇది ట్రంప్ ప్రభుత్వం జాతీయ భద్రతపై తీసుకున్న గట్టి నిశ్చయాన్ని ప్రతిబింబిస్తున్నదని రుబియో పేర్కొన్నారు.
పహల్గాం బైసరణ్ లోయలో ఆ రోజు ఉగ్రవాదులు తుపాకులతో టూరిస్టులపై కాల్పులు జరపడంతో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహం రేపగా, అమెరికా సహా అనేక దేశాలు భారత్కు మద్దతు ప్రకటించాయి. అదే సమయంలో అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోదీకి కాల్ చేసి సానుభూతి వ్యక్తం చేశారు. ఈ దాడిపై స్పందిస్తూ, “ఇది చాలా ఘోరమైన ఘటన” అని వ్యాఖ్యానించారు.
TRF ఇప్పటికే భారత్లో ఎన్నో దాడులకు పాల్పడిన చరిత్ర కలిగిన సంస్థ. జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్పై డ్రోన్ దాడి, ఆయుధాల సరఫరా, కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకోవడం లాంటి చర్యలు TRF ఖాతాలో ఉన్నాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ ఆర్మీ, ISI అనుచితంగా TRF పేరును లాంఛనప్రాయంగా ప్రవేశపెట్టిందని భారత ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడించాయి. FATF యొక్క ఆర్ధిక పర్యవేక్షణను తప్పించేందుకు ఇది ఒక వ్యూహంగా పరిగణించబడుతోంది.
భారత ప్రభుత్వం ఇప్పటికే TRFను ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. 2023లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ యూజీఏపీఏ చట్టం కింద TRFపై నిషేధం విధించింది. ఈ సంస్థ కమాండర్ సజ్జాద్ గుల్ను వ్యక్తిగత ఉగ్రవాదిగా ప్రకటించింది. టెర్రరిజం ప్రచారం, యువతను భయపెట్టి రిక్రూట్మెంట్ చేయడం, డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా వంటి కార్యకలాపాలలో TRF భాగస్వామిగా ఉన్నదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పుడు అమెరికా తీసుకున్న చర్యతో TRFపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగే అవకాశముంది. ఇది భారత్కు మద్దతుగా నిలిచే కీలకమైన దౌత్యపరమైన పరిణామంగా భావిస్తున్నారు.
This post was last modified on July 18, 2025 3:10 pm
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…
ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…