Political News

జగన్ ను సమర్థించిన జేడీ లక్ష్మీనారాయణ

నిజాల్ని నిర్మోమాటంగా మాట్లాడినా.. తప్పు మాట్లాడినట్లుగా కామెడీ చేయటం చూస్తుంటాం. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా ఇదే తీరులో ఉంది. కరోనా విషయంలో ఆయన చేసిన ప్రతి వ్యాఖ్యపైనా విమర్శ వినిపిస్తోంది.

ఆయన మాటల్ని తప్పు పట్టేలా ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంగా కరోనా వైరస్ మీద ఆయన చేసిన వ్యాఖ్యలపై వ్యతిరేక ప్రచారం ఏ స్థాయిలో జరుగుతోందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

కరోనా కూడా జ్వరం లాంటిదేనని.. వైరస్ తో మరికొంత కాలం సహజీవనం చేయాల్సి ఉంటుందన్న మాటను ట్రోల్ చేయటం చూస్తున్నదే. అయితే.. ఈ వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. తాజాగా నిర్వహించిన ఒక చానల్ డిబేట్ లో ఆయన మాట్లాడుతూ.. ఏపీ సీఎం చేసిన వ్యాఖ్యల్ని సమర్థించారు.

కరోనా నిర్దారణ పరీక్షల సంఖ్య పెంచాలని.. ప్రజల్లో రోగనిరోధక శక్తి పెంచుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని.. కరోనా జ్వరం లాంటిదేనన్న వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదన్న మాజీ జేడీ.. ఇంట్లో కొడుక్కి జ్వరం వస్తే తగ్గిపోతుందిలే అంటూ తండ్రి ధైర్యం చెప్పిన రీతిలోనే జగన్ వ్యాఖ్యల్ని చూడాలన్నారు. రోగికి మానసిక బలం.. ధైర్యం చెప్పటం చాలా ముఖ్యమన్న ఆయన.. సీఎం హోదాలో భయపడాల్సిన అవసరం లేదని చెప్పటంలో తప్పేమీ లేదన్నారు.

జగన్ వ్యాఖ్యల్ని సమర్థించిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు.. నేతల తీరును మాత్రం తప్పు పట్టారు. ఏపీ అధికారపక్ష నేతలు ర్యాలీలు నిర్వహించటం.. సభలు పెట్టటం సరైనది కాదన్నారు. నేతలు బయటకు వచ్చి హడావుడి చేయటం వల్ల.. తాము సైతం బయటకు వస్తే ఏమవుతుందిలే అన్న భావనకు ప్రజలు వచ్చే అవకాశం ఉందన్నారు. దీనివల్ల నష్టం కలుగుతుందన్న ఆందోళనను వ్యక్తం చేశారు.

ఏపీలో పెరుగుతున్న కేసుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఆయన.. కరోనా నిర్దారణ పరీక్షల్ని మరింత పెంచాలని వ్యాఖ్యానించారు. మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాటల్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వింటున్నారా?

This post was last modified on May 1, 2020 3:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రఘురామ జైలులో ఉన్నప్పుడు ముసుగు వేసుకొని వచ్చిందెవరు?

నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…

38 minutes ago

అకీరాను లాంచ్ చేయమంటే… అంత‌కంటేనా?

తెలుగు సినీ ప్రేక్ష‌కులు అత్యంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నంద‌న్‌ది ఒక‌టి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

1 hour ago

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

2 hours ago

క్రింజ్ కామెంట్ల‌పై రావిపూడి ఏమ‌న్నాడంటే?

అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అంద‌రూ హిట్ మెషీన్ అంటారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…

2 hours ago

100 కోట్లు ఉన్నా ప్రశాంతత లేదా? ఎన్నారై స్టోరీ వైరల్!

అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…

3 hours ago

ట్రెండుకు భిన్నంగా వెళితే ఎలా జగన్?

బ‌లంగా మాట్లాడాలి. మాట‌కు మాట కౌంట‌ర్ ఇవ్వాలి. అది వింటే ప్ర‌త్య‌ర్థులు నోరు అప్ప‌గించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…

5 hours ago