Political News

స్వ‌రం పెంచిన కవిత‌.. బీఆర్ఎస్ పై కీల‌క వ్యాఖ్య‌లు

బీఆర్ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌విత‌.. త‌న స్వ‌రాన్నిపెంచారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు డియ‌ర్ డాడీ ఉత్త‌రానికి.. కుటుంబ రాజ‌కీయాల‌కు ప‌రిమిత‌మైన ఆమె జాగృతి సంస్థ ద్వారా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చేందుకు రెడీ అయిన‌ట్టు చెప్పారు. అలానే ఒక‌టి రెండు సార్లు వ‌చ్చారు కూడా. ముఖ్యంగా బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల క‌ల్ప‌న విష‌యంపై క‌విత పోరాట‌మే చేస్తున్నారు. కానీ.. దీనికి బీఆర్ఎస్ నేత‌ల నుంచి ఎలాంటి మ‌ద్ద‌తు ల‌భించ‌లేదు పైగా బీఆర్ఎస్ ఈ విషయాన్ని ప‌క్క‌న పెట్టేసింది.

అదేస‌మ‌యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న క‌విత‌పై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌పై ఆమె ఒక్కరే పోరాటం చేశారు. ఈ విష‌యంలోనూ బీఆర్ఎస్ ఎక్క‌డా స్పందించ‌లేదు. క‌నీసం ఖండించ‌ను కూడా లేదు. ఆమెకు మ‌ద్ద‌తుగా నిలిచింది కూడా లేదు. దీనిపై ఒక‌వైపు రాజ‌కీయంగా చ‌ర్చ సాగుతోంది. ఇలాంటి స‌మ‌యంలో క‌విత అనూహ్యంగా బీఆర్ఎస్‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిగా మారింది. ఇప్పుడు కాక‌పోతే.. మ‌రో రెండు రోజుల‌కైనా బీఆర్ఎస్ నాయ‌కులు త‌న దారికి రావాల్సిందేన‌ని ఆమే తేల్చి చెప్పారు.

తాజాగా గురువారం మీడియాతో మాట్లాడిన క‌విత‌.. ప్ర‌జా పోరాటాల విష‌యంలో జాగృతి సూప‌ర్ క్రెడిట్ ద‌క్కించుకుంటోంద‌న్నారు. ఎప్ప‌టికైనా బీఆర్ఎస్ నాయ‌కులు త‌న దారిలోకి రావాల్సిందేన‌ని తేల్చి చెప్పారు. తెలంగాణ బిడ్డ‌పై తీన్మార్ మ‌ల్ల‌న్న తీవ్ర విమ‌ర్శ‌లు చేసి, ఆత్మ‌గౌర‌వానికి భంగం క‌లిగించినా.. బీఆర్ఎస్ నాయ‌కులు స్పందించలేద‌ని.. వాపోయారు.. అయితే.. ఈ విష‌యంపై తాను యాగీ చేయ‌డం లేద‌న్న ఆమె.. వారి విజ్ఞ‌తకే ఈ విష‌యాన్ని వ‌దిలేస్తున్నాన‌ని చెప్పారు.

రేవంత్‌పై విమ‌ర్శ‌లు..

ఈ సంద‌ర్భంగా క‌విత సీఎం రేవంత్ రెడ్డిపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఢిల్లీలో జ‌రిగిన స‌మావేశంలో బ‌న‌క‌చ‌ర్ల వ్య‌వ‌హారం.. చ‌ర్చ‌కు రాలేద‌న్న‌ది అబ‌ద్ధ‌మ‌ని.. గోదావ‌రి జ‌లాల‌ను త‌న గురువుకు గుత్త‌గా ముట్ట‌చెప్పి వ‌చ్చార‌ని విమ‌ర్శించారు. టెలీ మెట్రిక్ అంశం.. ఢిల్లీ వ‌ర‌కు వెళ్లాల్సిన విష‌యం కాద‌ని.. ఇది ఇక్క‌డ కూర్చునైనా చేయొచ్చ‌ని చెప్పారు. కానీ, కేంద్రాన్ని బూచిగా చూపించి.. ఏపీకి మేలు చేసేలా రేవంత్ రెడ్డి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. దీనిపై జాగృతి ప‌క్షాన పోరాటం ముమ్మ‌రం చేయ‌నున్న‌ట్టు క‌విత తెలిపారు.

This post was last modified on July 17, 2025 1:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

5 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

5 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

6 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

6 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

9 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

10 hours ago