వైసీపీ అధినేత జగన్.. సీఎం చంద్రబాబుకు గట్టి వార్నింగే ఇచ్చారు. తప్పులు తెలుసుకోవాలని.. తక్షణ మే సరిదిద్దుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేతగా తనపైనైనా.. తన పార్టీ నాయకులపైనై నా కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని.. తప్పుడు సాక్ష్యాలతో కేసుల్లో ఇరికిస్తున్నారని అన్నారు. ఇదే సంప్రదాయం కొనసాగిస్తే.. రేపు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతైనా కూడా.. దెబ్బలు తిన్నవీళ్లు.. దెబ్బలు తగిలిన వీళ్లు.. ప్రతిచర్యగా ఇదే పనిచేయడం ప్రారంభిస్తే.. మీ పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు.
చంద్రబాబు వేసిన విత్తనం.. తప్పుడు విత్తనం. ఇది రేపు పెరిగి చెట్టవుతుంది. తప్పుడు సంప్రదాయం కనుక మానకపోతే.. ఎవరిచేతుల్లోనూ వ్యవస్థ ఉండదని జగన్ హెచ్చరించారు. చాలా అంటే చాలా తప్పు చేస్తున్నారని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. దెబ్బలు తిన్న ప్రతి ఒక్కరూ రేపు ఇలానే చేస్తే.. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. చంద్రబాబు పరిస్థితి ఏంటి? ఆ పార్టీ పరిస్థితి ఏంటి? అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని ఆయన సూచించారు.
ఎల్లకాలం.. ఇవే రోజులు ఉండవని జగన్ వ్యాఖ్యానించారు. ఈ రోజు పైన మీరున్నారు. మళ్లా నాలుగేండ్ల కు.. కిందకు మీరొస్తారు.. మేం పైకి వెళ్తాం. కానీ.. మీరు చేసే తప్పుడు పనులు, సంప్రదాయం.. విష వృక్షం అవుతుంది. నేను చెప్పినా.. రేపు మావాళ్లు వినేపరిస్థితి ఉండదు. దెబ్బతగిలిన వాడికి ఆ బాధ తెలుస్తుం ది. చంద్రబాబు ఇప్పటికైనా మేలుకో.. తప్పులు సరిదిద్దుకో.. తప్పుడు సంప్రదాయాలను సరిదిద్దుకో. అని జగన్ హెచ్చరించారు.
తాజాగా తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన జగన్ తమ పార్టీ నాయకులపైకేసులు పెడుతున్నారని.. స్టేషన్లలో పడేసి కొడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇదంతా పక్కా ప్రణాళికతోనే చంద్రబాబు, ఆయన కొడుకు నారా లోకేష్ చేస్తున్నారని చెప్పారు. ఈ విధానాన్ని మానుకోకపోతే.. రేపు ఇంతకు ఇంత వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.
This post was last modified on July 16, 2025 3:24 pm
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…