వైసీపీ అధినేత జగన్.. సీఎం చంద్రబాబుకు గట్టి వార్నింగే ఇచ్చారు. తప్పులు తెలుసుకోవాలని.. తక్షణ మే సరిదిద్దుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేతగా తనపైనైనా.. తన పార్టీ నాయకులపైనై నా కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని.. తప్పుడు సాక్ష్యాలతో కేసుల్లో ఇరికిస్తున్నారని అన్నారు. ఇదే సంప్రదాయం కొనసాగిస్తే.. రేపు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతైనా కూడా.. దెబ్బలు తిన్నవీళ్లు.. దెబ్బలు తగిలిన వీళ్లు.. ప్రతిచర్యగా ఇదే పనిచేయడం ప్రారంభిస్తే.. మీ పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు.
చంద్రబాబు వేసిన విత్తనం.. తప్పుడు విత్తనం. ఇది రేపు పెరిగి చెట్టవుతుంది. తప్పుడు సంప్రదాయం కనుక మానకపోతే.. ఎవరిచేతుల్లోనూ వ్యవస్థ ఉండదని జగన్ హెచ్చరించారు. చాలా అంటే చాలా తప్పు చేస్తున్నారని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. దెబ్బలు తిన్న ప్రతి ఒక్కరూ రేపు ఇలానే చేస్తే.. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. చంద్రబాబు పరిస్థితి ఏంటి? ఆ పార్టీ పరిస్థితి ఏంటి? అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని ఆయన సూచించారు.
ఎల్లకాలం.. ఇవే రోజులు ఉండవని జగన్ వ్యాఖ్యానించారు. ఈ రోజు పైన మీరున్నారు. మళ్లా నాలుగేండ్ల కు.. కిందకు మీరొస్తారు.. మేం పైకి వెళ్తాం. కానీ.. మీరు చేసే తప్పుడు పనులు, సంప్రదాయం.. విష వృక్షం అవుతుంది. నేను చెప్పినా.. రేపు మావాళ్లు వినేపరిస్థితి ఉండదు. దెబ్బతగిలిన వాడికి ఆ బాధ తెలుస్తుం ది. చంద్రబాబు ఇప్పటికైనా మేలుకో.. తప్పులు సరిదిద్దుకో.. తప్పుడు సంప్రదాయాలను సరిదిద్దుకో. అని జగన్ హెచ్చరించారు.
తాజాగా తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన జగన్ తమ పార్టీ నాయకులపైకేసులు పెడుతున్నారని.. స్టేషన్లలో పడేసి కొడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇదంతా పక్కా ప్రణాళికతోనే చంద్రబాబు, ఆయన కొడుకు నారా లోకేష్ చేస్తున్నారని చెప్పారు. ఈ విధానాన్ని మానుకోకపోతే.. రేపు ఇంతకు ఇంత వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.
This post was last modified on July 16, 2025 3:24 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…