ఏపీ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులపై మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చేశారు. ఒకేసారి రైతులకు 20 వేల రూపాయలను అందిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే తదుపరి విడత నిధులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఇవ్వాల్సిన బకాయిని కూడా కలిపి ఇస్తామన్నారు. దీంతో రైతుల ఖాతాల్లో రూ.20 వేల చొప్పున పడతాయని.. వారు ఈ విషయంలో ఎలాంటి అపోహలకు పోవద్దని తేల్చి చెప్పారు. అంతేకాదు.. కొందరు ఈ విషయంలో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు.
తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలోని జనసేన నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ‘డోర్ టూ డోర్’ వెళ్లి పింఛన్లు, రేషన్, ఉచిత సిలిండర్లు, తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్ మెంటు(ఇప్పటికే ఇచ్చినవి) వంటి వాటిపై ఆరా తీశారు.
ఈ క్రమంలోనే మంత్రి నారాయణ రైతులకు సంబంధించిన విషయంపై స్పందించారు. రైతులకు ధాన్యం తాలూకు ఇవ్వాల్సిన బకాయిలను కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్టు చెప్పారు. రైతు భరోసా పై వైసీపీ నాయకులు తెలిసీ తెలియని విషయాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వారి హయాంలో ఎప్పుడు ఇచ్చారో గుర్తు చేసుకోవాలని.. లేకపోతే.. ఆవివరాలను ప్రజల ముందే పెట్టి పరువు తీస్తామని హెచ్చరించారు. త్వరలోనే రైతులకు మేలు చేసేలా.. రూ.20 వేలను ఇస్తామని మంత్రి తెలిపారు.
వైసీపీ నేతలు జైలుకెళ్లక తప్పదని మంత్రి నారాయణ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా సహా.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీఆర్ బాండ్ల అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోందన్నారు. అక్రమాలు చేసిన వారిని వదిలేస్తే.. ప్రజా తీర్పునకు అర్ధం ఉండదని వ్యాఖ్యానించారు. వారిని ఖచ్చితంగా జైలుకు పంపిస్తామని నారాయణ తెలిపారు.
This post was last modified on July 15, 2025 3:41 pm
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…