Political News

ఏపీ రైతుల‌కు పండ‌గే.. ఒకే సారి 20 వేలు

ఏపీ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భ‌రోసా నిధుల‌పై మంత్రి నారాయ‌ణ క్లారిటీ ఇచ్చేశారు. ఒకేసారి రైతుల‌కు 20 వేల రూపాయ‌ల‌ను అందిస్తామ‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే త‌దుప‌రి విడ‌త నిధుల‌తో క‌లిపి రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ ఏడాది ఇవ్వాల్సిన బ‌కాయిని కూడా క‌లిపి ఇస్తామ‌న్నారు. దీంతో రైతుల ఖాతాల్లో రూ.20 వేల చొప్పున ప‌డ‌తాయ‌ని.. వారు ఈ విష‌యంలో ఎలాంటి అపోహ‌ల‌కు పోవ‌ద్దని తేల్చి చెప్పారు. అంతేకాదు.. కొంద‌రు ఈ విష‌యంలో రైతులను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలోని జ‌న‌సేన నాయ‌కుడు బొలిశెట్టి స‌త్య‌నారాయ‌ణ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ తాడేపల్లిగూడెం నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి నారాయ‌ణ ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం నిర్వ‌హించారు. మంత్రి నేరుగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ‘డోర్ టూ డోర్’ వెళ్లి పింఛ‌న్లు, రేష‌న్‌, ఉచిత సిలిండ‌ర్లు, త‌ల్లికి వంద‌నం, ఫీజు రీయింబ‌ర్స్ మెంటు(ఇప్ప‌టికే ఇచ్చిన‌వి) వంటి వాటిపై ఆరా తీశారు.

ఈ క్ర‌మంలోనే మంత్రి నారాయ‌ణ రైతుల‌కు సంబంధించిన విష‌యంపై స్పందించారు. రైతుల‌కు ధాన్యం తాలూకు ఇవ్వాల్సిన బ‌కాయిల‌ను కూడా త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్న‌ట్టు చెప్పారు. రైతు భ‌రోసా పై వైసీపీ నాయ‌కులు తెలిసీ తెలియ‌ని విష‌యాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని తెలిపారు. వారి హ‌యాంలో ఎప్పుడు ఇచ్చారో గుర్తు చేసుకోవాల‌ని.. లేక‌పోతే.. ఆవివ‌రాల‌ను ప్ర‌జ‌ల ముందే పెట్టి ప‌రువు తీస్తామ‌ని హెచ్చ‌రించారు. త్వ‌ర‌లోనే రైతుల‌కు మేలు చేసేలా.. రూ.20 వేల‌ను ఇస్తామ‌ని మంత్రి తెలిపారు.

వైసీపీ నేత‌లు జైలుకెళ్లక త‌ప్ప‌ద‌ని మంత్రి నారాయ‌ణ చెప్పారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా స‌హా.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీఆర్ బాండ్ల అక్రమాలు చోటు చేసుకున్నాయ‌ని చెప్పారు. ఈ వ్య‌వ‌హారంపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంద‌న్నారు. అక్ర‌మాలు చేసిన వారిని వ‌దిలేస్తే.. ప్ర‌జా తీర్పున‌కు అర్ధం ఉండ‌ద‌ని వ్యాఖ్యానించారు. వారిని ఖ‌చ్చితంగా జైలుకు పంపిస్తామ‌ని నారాయ‌ణ తెలిపారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

6 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

9 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

11 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

11 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

11 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

12 hours ago