Political News

మ‌ళ్లీ బాబే.. తేల్చేసి మ‌హిళా లోకం!

టిడిపి అధినేత చంద్రబాబు తాజాగా పార్టీ నాయకులకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్దేశించిన విషయం తెలిసిందే. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న చర్యలు, చేస్తున్న అభివృద్ధి, సాధిస్తున్న పెట్టుబడులు వంటి వాటిపై ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని, ప్రచారం చేయాలని చంద్రబాబు చెప్పారు. ఇది జరిగి ఐదు రోజులు అయింది. ఈ ఐదు రోజుల్లో ఏ ఏ నాయకులు ఎలా పని చేస్తున్నారు? ఏ ఏ నాయకులు ఎలా ఉన్నారు? ఎంతమందిని కలుస్తున్నారు అనే విషయాలను క్షేత్రస్థాయిలో చంద్రబాబు పరిశీలన చేస్తున్నారు.

ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ ను తెప్పించుకుంటున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు కీలక విషయం తెలిసింది. సంక్షేమ పథకాలపై ప్రజలకు ఆశ ఉన్నప్పటికీ.. ఒకవేళ ఇవి అమలు చేయకపోతే తాము ఇబ్బంది పడతమేమో అనే ఆవేదన, కొంతవరకు బెరుకు కూడా టిడిపిలో కనిపించింది. కొంతమంది మంత్రులు కూడా ఇదే వ్యాఖ్యలు కొన్నాళ్ల కిందట చేశారు. పథకాల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని కూడా ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు.

కానీ, తాజాగా గడిచిన ఐదు రోజుల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజల వద్దకు వెళుతుండడం, వారి నుంచి ఫీడ్ బ్యాక్‌ వస్తున్న నేపథ్యంలో చంద్రబాబుకు తెలిసిన కీలక విషయం ఏమంటే.. పథకాలు వచ్చినా రాకపోయినా మళ్లీ చంద్రబాబు రావాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నట్టు నాయకులకు అర్థమైంది. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా గ్రహించారు. దీనికి ప్రధాన కారణం.. వైసీపీలో నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరించడంతో పాటు ముఖ్యంగా అమరావతి మహిళలపై సాక్షి మీడియాలో వచ్చిన వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.

గుండు గుత్తుగా అందరిని వేశ్యలుగా సంబోధిస్తూ.. అమరావతి రాజధాని వేశ్యల రాజధానిగా పేర్కొంటూ చేసిన వ్యాఖ్యల పట్ల జగన్ స్పందించకపోవడం, కనీసం క్షమాపణ చెప్పకపోవడాన్ని టిడిపి నాయకులు ప్రస్తావించినప్పుడు.. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు అవును కనీసం ఆయన స్పందించలేదు ఇది చాలా దారుణం అని వ్యాఖ్యానిస్తున్న‌ట్టు చంద్ర‌బాబుకు తెలిసింది. దీంతో పాటు తమకు పథకాలు అందినా అందకపోయినా మళ్లీ బాబు గారికే ఓటేస్తామని తేల్చి చెప్పినట్టు చంద్రబాబుకు సమాచారం అందింది.

సో దీనిని బట్టి రాష్ట్రంలో వైసిపి పరిస్థితి ఏంటి? వైసీపీ ఆశలు పెట్టుకున్నట్టుగా సంక్షేమ పథకాలను నమ్ముకుంటే వర్క్ అవుట్ అవుతుందా అనేది ఆ పార్టీ అధినేత ఆలోచన చేసుకోవాలి. ఏదైనా ఒక వివాదం వచ్చినప్పుడు అది ప్రమాదంగా మారకుండా చూసుకోవడం అనేది రాజకీయ నాయకులకు చాలా కీలక అంశం. ఒకప్పుడు చంద్రబాబు కూడా ఇలాంటి ఇబ్బందులే పడ్డారు. ఒకరిద్దరు నాయకులు చేసిన వివాదాల కారణంగా పార్టీపై చెడు ప్రభావం పడుతుందని భావించినప్పుడు వెంటనే వారిపై చర్యలు తీసుకున్నారు.

వెంటనే ఆయన స్వయంగా వివరణ కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వైసీపీలో కనిపించట్లేదు. తద్వారా ఉన్న ఓటు బ్యాంకును కూడా నాశనం చేసుకునే పరిస్థితిలో వైసిపి దిగజారిపోతోందా అనేది చర్చనీయాంశంగా మారింది. మరి భవిష్యత్తులో అయినా జగన్ ఇలాంటివి రాకుండా చూసుకుంటారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.

This post was last modified on July 15, 2025 5:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈటీవీ విన్… జాగ్రత్తపడాలి

ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…

3 hours ago

బన్నీపై 7th ఫెయిల్ ట్రోలింగ్

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్‌గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…

3 hours ago

కూటమి నాయకులు అలా నేతలేమో ఇలా

ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం…

3 hours ago

కల్ట్ సీక్వెల్… ఈసారి సెటప్ అక్కడ

థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఈ నగరానికి…

3 hours ago

హహ హాసిని… స్టేజ్ మీద ఏడ్చేసింది

జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…

5 hours ago

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

7 hours ago