వైసీపీ హయాంలో జగన్ ప్రభుత్వానికి చుక్కలు చూపించి… చట్టాన్ని పరిచయం చేసి.. మొట్టికాయలు వేసిన న్యాయమూర్తి.. జస్టిస్ బట్టు దేవానంద్. 2020 జనవరి 13 నుంచి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన ఆయన 2023 ఏప్రిల్ 10న మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. వాస్తవానికి బట్టును బదిలీ చేయించింది కూడా.. జగనే అనే ప్రచారం ఉంది. అప్పట్లో బట్టు బదిలీని వ్యతిరేకిస్తూ.. న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించారు. అయితే.. ఇప్పుడు ఆయన తిరిగి ఏపీకి వస్తున్నారు.
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా తిరిగి బట్టును నియమిస్తూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో మద్రాస్ హైకోర్టులో జస్టిస్ బట్టు రిలీవ్ కావడంతోనే ఏపీలో బాధ్యతలు తీసుకుంటారు. ఈ పరిణామం.. వైసీపీ నాయకులకు మింగుడుపడడం లేదు. ఎందుకంటే.. చట్టం, న్యాయం ప్రకారం.. ముక్కుసూటిగా వ్యవహరించే న్యాయమూర్తుల్లో జస్టిస్ బట్టు ముందుంటారని న్యాయ వర్గాలు చెబుతాయి. ఆయన పనితీరు, ఇచ్చిన తీర్పులు కూడా అలానే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో వైసీపీ చేస్తున్న దూకుడు ప్రవర్తనకు, యాగీకి.. ఇక పై చెక్ పడనుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. అయితే… కేసులు ఆయన సమక్షానికి వెళ్తేనే చట్టం ప్రకారం ఏదైనా చేయగలరని అంటున్నారు. ఈ సందర్భంగా గతంలో జస్టిస్ బట్టు ఇచ్చిన తీర్పులు, వైసీపీ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలను వారు గుర్తు చేసుకుంటున్నారు. పక్కా నిఖార్సుగా వ్యవహరించే న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ పేరు తెచ్చుకోవడం గమనార్హం.
గతంలో ఇచ్చిన తీర్పులు, చేసిన వ్యాఖ్యల్లో కొన్ని..
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…