వైసీపీ హయాంలో జగన్ ప్రభుత్వానికి చుక్కలు చూపించి… చట్టాన్ని పరిచయం చేసి.. మొట్టికాయలు వేసిన న్యాయమూర్తి.. జస్టిస్ బట్టు దేవానంద్. 2020 జనవరి 13 నుంచి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన ఆయన 2023 ఏప్రిల్ 10న మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. వాస్తవానికి బట్టును బదిలీ చేయించింది కూడా.. జగనే అనే ప్రచారం ఉంది. అప్పట్లో బట్టు బదిలీని వ్యతిరేకిస్తూ.. న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించారు. అయితే.. ఇప్పుడు ఆయన తిరిగి ఏపీకి వస్తున్నారు.
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా తిరిగి బట్టును నియమిస్తూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో మద్రాస్ హైకోర్టులో జస్టిస్ బట్టు రిలీవ్ కావడంతోనే ఏపీలో బాధ్యతలు తీసుకుంటారు. ఈ పరిణామం.. వైసీపీ నాయకులకు మింగుడుపడడం లేదు. ఎందుకంటే.. చట్టం, న్యాయం ప్రకారం.. ముక్కుసూటిగా వ్యవహరించే న్యాయమూర్తుల్లో జస్టిస్ బట్టు ముందుంటారని న్యాయ వర్గాలు చెబుతాయి. ఆయన పనితీరు, ఇచ్చిన తీర్పులు కూడా అలానే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో వైసీపీ చేస్తున్న దూకుడు ప్రవర్తనకు, యాగీకి.. ఇక పై చెక్ పడనుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. అయితే… కేసులు ఆయన సమక్షానికి వెళ్తేనే చట్టం ప్రకారం ఏదైనా చేయగలరని అంటున్నారు. ఈ సందర్భంగా గతంలో జస్టిస్ బట్టు ఇచ్చిన తీర్పులు, వైసీపీ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలను వారు గుర్తు చేసుకుంటున్నారు. పక్కా నిఖార్సుగా వ్యవహరించే న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ పేరు తెచ్చుకోవడం గమనార్హం.
గతంలో ఇచ్చిన తీర్పులు, చేసిన వ్యాఖ్యల్లో కొన్ని..
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…