వైసీపీ హయాంలో జగన్ ప్రభుత్వానికి చుక్కలు చూపించి… చట్టాన్ని పరిచయం చేసి.. మొట్టికాయలు వేసిన న్యాయమూర్తి.. జస్టిస్ బట్టు దేవానంద్. 2020 జనవరి 13 నుంచి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన ఆయన 2023 ఏప్రిల్ 10న మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. వాస్తవానికి బట్టును బదిలీ చేయించింది కూడా.. జగనే అనే ప్రచారం ఉంది. అప్పట్లో బట్టు బదిలీని వ్యతిరేకిస్తూ.. న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించారు. అయితే.. ఇప్పుడు ఆయన తిరిగి ఏపీకి వస్తున్నారు.
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా తిరిగి బట్టును నియమిస్తూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో మద్రాస్ హైకోర్టులో జస్టిస్ బట్టు రిలీవ్ కావడంతోనే ఏపీలో బాధ్యతలు తీసుకుంటారు. ఈ పరిణామం.. వైసీపీ నాయకులకు మింగుడుపడడం లేదు. ఎందుకంటే.. చట్టం, న్యాయం ప్రకారం.. ముక్కుసూటిగా వ్యవహరించే న్యాయమూర్తుల్లో జస్టిస్ బట్టు ముందుంటారని న్యాయ వర్గాలు చెబుతాయి. ఆయన పనితీరు, ఇచ్చిన తీర్పులు కూడా అలానే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో వైసీపీ చేస్తున్న దూకుడు ప్రవర్తనకు, యాగీకి.. ఇక పై చెక్ పడనుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. అయితే… కేసులు ఆయన సమక్షానికి వెళ్తేనే చట్టం ప్రకారం ఏదైనా చేయగలరని అంటున్నారు. ఈ సందర్భంగా గతంలో జస్టిస్ బట్టు ఇచ్చిన తీర్పులు, వైసీపీ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలను వారు గుర్తు చేసుకుంటున్నారు. పక్కా నిఖార్సుగా వ్యవహరించే న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ పేరు తెచ్చుకోవడం గమనార్హం.
గతంలో ఇచ్చిన తీర్పులు, చేసిన వ్యాఖ్యల్లో కొన్ని..
This post was last modified on July 15, 2025 2:38 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…