Political News

బ‌ట్టు తిరిగి వస్తున్నారు జగన్!

వైసీపీ హ‌యాంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి చుక్క‌లు చూపించి… చ‌ట్టాన్ని ప‌రిచ‌యం చేసి.. మొట్టికాయ‌లు వేసిన న్యాయ‌మూర్తి.. జ‌స్టిస్ బ‌ట్టు దేవానంద్‌. 2020 జనవరి 13 నుంచి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ప‌ని చేసిన ఆయ‌న 2023 ఏప్రిల్‌ 10న మద్రాస్‌ హైకోర్టుకు బ‌దిలీ అయ్యారు. వాస్త‌వానికి బ‌ట్టును బ‌దిలీ చేయించింది కూడా.. జ‌గ‌నే అనే ప్ర‌చారం ఉంది. అప్ప‌ట్లో బ‌ట్టు బ‌దిలీని వ్య‌తిరేకిస్తూ.. న్యాయ‌వాదులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య‌మించారు. అయితే.. ఇప్పుడు ఆయ‌న తిరిగి ఏపీకి వ‌స్తున్నారు.

ఏపీ హైకోర్టు న్యాయ‌మూర్తిగా తిరిగి బ‌ట్టును నియ‌మిస్తూ.. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ క్ర‌మంలో మ‌ద్రాస్ హైకోర్టులో జ‌స్టిస్ బ‌ట్టు రిలీవ్ కావ‌డంతోనే ఏపీలో బాధ్య‌త‌లు తీసుకుంటారు. ఈ ప‌రిణామం.. వైసీపీ నాయ‌కుల‌కు మింగుడుప‌డ‌డం లేదు. ఎందుకంటే.. చ‌ట్టం, న్యాయం ప్ర‌కారం.. ముక్కుసూటిగా వ్య‌వ‌హ‌రించే న్యాయ‌మూర్తుల్లో జ‌స్టిస్‌ బ‌ట్టు ముందుంటార‌ని న్యాయ వ‌ర్గాలు చెబుతాయి. ఆయ‌న పనితీరు, ఇచ్చిన తీర్పులు కూడా అలానే ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో వైసీపీ చేస్తున్న దూకుడు ప్ర‌వ‌ర్త‌న‌కు, యాగీకి.. ఇక‌ పై చెక్ ప‌డ‌నుంద‌ని న్యాయ‌నిపుణులు చెబుతున్నారు. అయితే… కేసులు ఆయ‌న స‌మ‌క్షానికి వెళ్తేనే చ‌ట్టం ప్ర‌కారం ఏదైనా చేయ‌గ‌ల‌ర‌ని అంటున్నారు. ఈ సంద‌ర్భంగా గ‌తంలో జ‌స్టిస్ బ‌ట్టు ఇచ్చిన తీర్పులు, వైసీపీ ప్ర‌భుత్వం పై చేసిన వ్యాఖ్య‌ల‌ను వారు గుర్తు చేసుకుంటున్నారు. ప‌క్కా నిఖార్సుగా వ్య‌వ‌హ‌రించే న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ బ‌ట్టు దేవానంద్ పేరు తెచ్చుకోవ‌డం గ‌మ‌నార్హం.

గ‌తంలో ఇచ్చిన తీర్పులు, చేసిన వ్యాఖ్య‌ల్లో కొన్ని..

  • సచివాల‌యాల‌కు వైసీపీ జెండా రంగులు వేయ‌డాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించారు. చ‌ట్ట ప్ర‌కారం.. ప్ర‌భు త్వ నిధుల‌ను దుర్వినియోగం చేసేందుకు స‌హ‌క‌రించిన అధికారుల‌పై ఫైన్లు వేశారు.
  • డాక్ట‌ర్ సుధాక‌ర్‌ను న‌డిరోడ్డు పై రెక్క‌లు విరిచి క‌ట్టి పోలీసులు అరెస్టు చేయ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. ఈ కేసును తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్న‌ట్టు తెలిపారు. పోలీసుల‌కు వారెంట్లు జారీ చేశారు.
  • అమ‌రావ‌తి రాజ‌ధాని రైతులు తీవ్ర క‌ష్టాలు ప‌డుతున్నార‌ని ప్రైవేటుగా ఆయ‌న సంభాషించారు.
  • మూడు రాజ‌ధానుల బిల్లు అమ‌లును తొలుత నిలిపివేశారు.
  • ఎక్క‌డ ఏ వేదిక దొరికినా.. వైసీపీ స‌ర్కారు లోపాల‌ను ప‌రోక్షంగా ఎత్తి చూపించేవారు.
  • “మా అమ్మాయి ఢిల్లీలో చ‌దువుతోంది. మీ రాజ‌ధాని ఏది? అని అక్క‌డివారు అడిగితే చెప్పుకోలేక పోయింది. ఇదీ.. దుస్థితి” అని ఢిల్లీలోని ఓ కార్య‌క్ర‌మంలోనే ఆయ‌న వ్యాఖ్యానించారు.

This post was last modified on July 15, 2025 2:38 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

కాంట్రావర్సీ ముదురుతున్న కేరళ స్టోరీ 2

వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…

8 minutes ago

సుప్రీం వ్యాఖ్యలను రాష్ట్రాలు ఎలా తీసుకుంటాయి?

రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…

45 minutes ago

శంకర్‌ డ్రీమ్ ప్రాజెక్టులో ధనుష్?

ఒకప్పుడు శంకర్‌తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…

2 hours ago

క్రికెట్ మ్యాచ్ గురించి ఎందుకు జగన్?

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…

2 hours ago

రక్తపాతం కోరుకుంటున్న విశ్వక్

ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…

2 hours ago

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…

3 hours ago