వైసీపీ హయాంలో జగన్ ప్రభుత్వానికి చుక్కలు చూపించి… చట్టాన్ని పరిచయం చేసి.. మొట్టికాయలు వేసిన న్యాయమూర్తి.. జస్టిస్ బట్టు దేవానంద్. 2020 జనవరి 13 నుంచి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన ఆయన 2023 ఏప్రిల్ 10న మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. వాస్తవానికి బట్టును బదిలీ చేయించింది కూడా.. జగనే అనే ప్రచారం ఉంది. అప్పట్లో బట్టు బదిలీని వ్యతిరేకిస్తూ.. న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించారు. అయితే.. ఇప్పుడు ఆయన తిరిగి ఏపీకి వస్తున్నారు.
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా తిరిగి బట్టును నియమిస్తూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో మద్రాస్ హైకోర్టులో జస్టిస్ బట్టు రిలీవ్ కావడంతోనే ఏపీలో బాధ్యతలు తీసుకుంటారు. ఈ పరిణామం.. వైసీపీ నాయకులకు మింగుడుపడడం లేదు. ఎందుకంటే.. చట్టం, న్యాయం ప్రకారం.. ముక్కుసూటిగా వ్యవహరించే న్యాయమూర్తుల్లో జస్టిస్ బట్టు ముందుంటారని న్యాయ వర్గాలు చెబుతాయి. ఆయన పనితీరు, ఇచ్చిన తీర్పులు కూడా అలానే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో వైసీపీ చేస్తున్న దూకుడు ప్రవర్తనకు, యాగీకి.. ఇక పై చెక్ పడనుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. అయితే… కేసులు ఆయన సమక్షానికి వెళ్తేనే చట్టం ప్రకారం ఏదైనా చేయగలరని అంటున్నారు. ఈ సందర్భంగా గతంలో జస్టిస్ బట్టు ఇచ్చిన తీర్పులు, వైసీపీ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలను వారు గుర్తు చేసుకుంటున్నారు. పక్కా నిఖార్సుగా వ్యవహరించే న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ పేరు తెచ్చుకోవడం గమనార్హం.
గతంలో ఇచ్చిన తీర్పులు, చేసిన వ్యాఖ్యల్లో కొన్ని..
This post was last modified on July 15, 2025 2:38 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…