అధికార పార్టీ బలాన్ని ఎలా అంచనా వేస్తారనేది ప్రశ్న. దీనికి సమాధానం.. నాయకుల పనితీరు… జిల్లాల్లో ఆయా పార్టీలపై జరుగుతున్న చర్చ వంటివి ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారు. ఇలా చూసుకునే జిల్లాల్లో ఆయా పార్టీల పనితీరుపై అంచనా వేసుకునే.. అధికార పార్టీలపై ఒక అంచనాకు వస్తారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా.. జిల్లాల వారీగా సమీక్షలు.. అంచనాలు పెద్ద ఎత్తున వచ్చేవి. జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరును.. లెక్కలోకి తీసుకునేవారు.
అంతేకాదు.. ఎమ్మెల్యేలు.. మంత్రులు ప్రజలకు ఏమేరకు చేరువ అవుతున్నారన్న లెక్కలు వేసుకుని వైసీపీ వ్యవహారాలను తేల్చేవారు. అయితే.. అప్పట్లో ఈ తరహా రిజల్ట్ను వైసీపీ అధినేత, అప్పటి సీఎం జగన్ లెక్కలోకి తీసుకోలేదు. ఫలితంగా పార్టీ పరిస్థితి ఎలా తయారైందో అందరికీ తెలిసిందే. ఇక, కూటమి విషయానికి వస్తే… కొన్ని జిల్లాల్లో పరిస్థితి బాగానే ఉన్నా.. మెజారిటీ జిల్లాల్లో మాత్రం పరిస్థితి భిన్నంగానే ఉంది. ఉదాహరణకు కృష్ణాజిల్లాను తీసుకుంటే.. ఇక్కడి మంత్రి కొల్లు రవీంద్ర నుంచి ఎమ్మెల్యేల వరకు తేడా కొడుతోంది.
నిజానికి ఈజిల్లా పరిధిలో ఇద్దరు బీసీ మంత్రులు ఉన్నారు. కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి. కానీ.. వారి వల్ల.. జిల్లాలో రాజకీయాలు బలోపేతం కావడం లేదన్న చర్చ ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదు. ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారన్న నివేదికలు కూడా చంద్రబాబుకు చేరుతున్నాయి. అవనిగడ్డలో జనసేన విజయం దక్కించుకుంది. ఇది.. పక్కన పెడితే.. ఇతర నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. కృష్ణా తీరంలో ఉండడంతో ఇసుక వ్యవహారం ఎమ్మెల్యేలకు పంట పండిస్తోంది.
ప్రజలకు ఏమేరకు చేరువ అవుతున్నారన్న విషయాన్ని పక్కన పెడితే.. ఇతర వ్యవహారాల్లో మాత్రం ఒకరినొకరు పోటీ పడుతున్నారు. ఓ నియోజకవర్గంలో అయితే.. మండలాలను.. పోలీసులు-ఎమ్మెల్యే కలిసి పంచుకుని.. వాటాలు వేసుకున్న వీడియోలు కూడా హల్చల్ చేశాయి. మరోచోట ఏకంగా సీఎం చంద్రబాబు పేరు చెప్పి.. మట్టి అక్రమాలు, ఇసుక అక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ పరిస్థితిని మెరుగు పరుచుకుని.. తప్పులు సరిచేసుకోకపోతే.. జిల్లాలో పార్టీ కూసాలు కదిలినా ఆశ్చర్యంలేదన్న వాదన వినిపిస్తోంది.
This post was last modified on July 16, 2025 2:15 pm
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…
కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…