ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై తాను స్వయంగా పుస్తకం రాయనున్నట్టు వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన విషయాన్ని బయట పెట్టారు. వైసీపీ చేపట్టిన బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని ఆదివారం పెద్దిరెడ్డి తన సొంత నియోజకవర్గం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా తరలి వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
“చంద్రబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. నేను ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి కాలేదని మీలో చాలా మంది బాధపడుతున్నారు. కానీ, చంద్రబాబులాగా నేను ప్రజలను మోసం చేయలేను. వారికి హామీలు ఇచ్చి.. తప్పలేను. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే.. విలువ ఏముంటుంది. గత ఎన్నిక ల్లో మీరు చూశారు. రాష్ట్రంలో మన పార్టీ ఘోరంగా దెబ్బతింది. అయినా.. మన దగ్గర మాత్రం ఎంత పోటీ ఉన్నా.. ప్రజలు నన్ను గెలిపించారు. దీనికి కారణం విలువలు, విశ్వసనీయతే. చంద్రబాబుకు ఇవి రెండూ లేవు.” అని పెద్దిరెడ్డి అన్నారు.
ఇదే సమయంలో చంద్రబాబు ఇన్నేళ్లు కూడా ప్రజలను మోసం చేస్తూనే అధికారంలోకి వచ్చారన్న పెద్ది రెడ్డి.. త్వరలోనే ఆయన మోసాలపై.. పుస్తకం రాస్తానని చెప్పారు. ఎన్నికలకు ముందు అది చేస్తా.. ఇది చేస్తా అని చెప్పిన చంద్రబాబు ఇన్నాళ్లలో ఒక్కటి కూడా చేయలేదన్నారు. అమ్మ ఒడి మన సార్(జగన్) తెచ్చారు. కానీ, దీనిని ఆయన కుమారుడే(నారా లోకేష్) తెచ్చాడని ప్రచారం చేసుకుంటున్నారు. ఇది తప్పని తెలిసినా.. చంద్రబాబు రాజకీయాలు ఇలానే ఉంటాయన్నారు.
అందుకే చంద్రబాబు చేసిన తప్పులు.. చేస్తున్న తప్పులపై తాను పుస్తకం రాయాలని నిర్ణయించుకున్న ట్టు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. వచ్చే ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సును తీసుకు వస్తున్నట్టు చంద్రబాబు చెప్పారన్న ఆయన.. అయితే.. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. ఇది తాను కోరుకుంటున్న డిమాండ్ కాదని.. గత ఎన్నికల్లో చంద్రబాబు మహిళలకు ఇచ్చిన హామీనేనని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కుప్పంలో చంద్రబాబు ఎన్నికలకు ముందు చేసిన ప్రకటనను ఆయన ఫోన్లో చూపించారు. “కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ఉచితంగా మహిళలు ప్రయాణం చేసేలా ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తాం” అని చంద్రబాబు అన్నారని చెప్పారు.
This post was last modified on July 15, 2025 6:55 am
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…