Political News

బాబు తో పోలికా పెద్దిరెడ్డీ!

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై తాను స్వ‌యంగా పుస్త‌కం రాయ‌నున్న‌ట్టు వైసీపీ సీనియ‌ర్ నాయకుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి సంచ‌ల‌న విష‌యాన్ని బ‌య‌ట పెట్టారు. వైసీపీ చేప‌ట్టిన బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ కార్య‌క్ర‌మాన్ని ఆదివారం పెద్దిరెడ్డి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని పుంగ‌నూరులో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా త‌ర‌లి వ‌చ్చిన కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించిన ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

“చంద్ర‌బాబు నాలుగు సార్లు ముఖ్య‌మంత్రి అయ్యారు. నేను ఒక్క‌సారి కూడా ముఖ్య‌మంత్రి కాలేద‌ని మీలో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. కానీ, చంద్ర‌బాబులాగా నేను ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌లేను. వారికి హామీలు ఇచ్చి.. త‌ప్ప‌లేను. ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌క‌పోతే.. విలువ ఏముంటుంది. గ‌త ఎన్నిక ల్లో మీరు చూశారు. రాష్ట్రంలో మ‌న పార్టీ ఘోరంగా దెబ్బ‌తింది. అయినా.. మ‌న ద‌గ్గ‌ర మాత్రం ఎంత పోటీ ఉన్నా.. ప్ర‌జ‌లు న‌న్ను గెలిపించారు. దీనికి కార‌ణం విలువ‌లు, విశ్వ‌సనీయ‌తే. చంద్ర‌బాబుకు ఇవి రెండూ లేవు.” అని పెద్దిరెడ్డి అన్నారు.

ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు ఇన్నేళ్లు కూడా ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తూనే అధికారంలోకి వ‌చ్చార‌న్న పెద్ది రెడ్డి.. త్వ‌ర‌లోనే ఆయ‌న మోసాల‌పై.. పుస్త‌కం రాస్తాన‌ని చెప్పారు. ఎన్నిక‌ల‌కు ముందు అది చేస్తా.. ఇది చేస్తా అని చెప్పిన చంద్ర‌బాబు ఇన్నాళ్ల‌లో ఒక్క‌టి కూడా చేయ‌లేద‌న్నారు. అమ్మ ఒడి మ‌న సార్‌(జ‌గ‌న్‌) తెచ్చారు. కానీ, దీనిని ఆయ‌న కుమారుడే(నారా లోకేష్‌) తెచ్చాడ‌ని ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఇది త‌ప్ప‌ని తెలిసినా.. చంద్ర‌బాబు రాజకీయాలు ఇలానే ఉంటాయన్నారు.

అందుకే చంద్ర‌బాబు చేసిన త‌ప్పులు.. చేస్తున్న త‌ప్పుల‌పై తాను పుస్తకం రాయాల‌ని నిర్ణ‌యించుకున్న ట్టు.. పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి తెలిపారు. వ‌చ్చే ఆగ‌స్టు 15 నుంచి ఉచిత బ‌స్సును తీసుకు వ‌స్తున్న‌ట్టు చంద్ర‌బాబు చెప్పార‌న్న ఆయ‌న‌.. అయితే.. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా అందించాల‌ని డిమాండ్ చేశారు. ఇది తాను కోరుకుంటున్న డిమాండ్ కాద‌ని.. గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌కు ఇచ్చిన హామీనేన‌ని గుర్తు చేశారు. ఈ సంద‌ర్భంగా కుప్పంలో చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌కు ముందు చేసిన ప్ర‌క‌ట‌న‌ను ఆయ‌న ఫోన్‌లో చూపించారు. “కుప్పం నుంచి శ్రీకాకుళం వ‌ర‌కు ఉచితంగా మ‌హిళ‌లు ప్ర‌యాణం చేసేలా ఉచిత బ‌స్సు స‌దుపాయం క‌ల్పిస్తాం” అని చంద్ర‌బాబు అన్నార‌ని చెప్పారు.

This post was last modified on July 15, 2025 6:55 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

18 minutes ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

2 hours ago

రాజమౌళి, మహేష్ కొట్టుకోవడమేంటయ్యా

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…

2 hours ago

మున్నా మంచి స్ట్రాటజీ వాడుతున్నాడు

మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…

2 hours ago

ఇలాంటిది వేరే మతంలో జరిగి ఉంటే?: పవన్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…

5 hours ago

చరణ్‌పై మచ్చ పడనివ్వని అల్లు శిరీష్

మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…

7 hours ago