ఏపీలోని కూటమి ప్రభుత్వం.. నామినేటెడ్ పదవులను నాయకులకు కట్టబెట్టేందుకు రంగం రెడీ చేసింది. మరో 15-20 రోజుల్లోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నట్టు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ దఫా దాదాపు 3 వేల నామినేటడ్ పదవులను భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఎన్నికల్లో బలంగా పని చేసిన వారు, పార్టీ కోసం కష్టపడిన వారు చాలా మంది ఉన్నారు. వీరిలో కొందరికి ఇప్పటికే చైర్మన్లు పద వులు ఇచ్చారు. కానీ, మరింత మంది ఆయా పదవుల కోసం వేచి చూస్తున్నారు.
ఈ క్రమంలో పార్టీని మరింత పుంజుకునే చేయాలంటే.. నాయకులను, కార్యకర్తలను ఉత్సాహంగా ముందు కు నడిపించాలంటే.. ఖచ్చితంగా పదవులు ఇవ్వాల్సిందేనన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు. ప్రస్తు తం నాయకులు క్షేత్రస్థాయిలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరిని బుజ్జగించేందుకు ఇప్పటి వరకు పలు ప్రయత్నాలు చేసినా.. ఫలించలేదు. ఈ నేపథ్యంలో పదవుల కొడితే తప్ప.. పని జరగదని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే 3 వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు.
ఇవీ పోస్టులు.. 1) దేవాలయాలకు కమిటీలు. వీటిలో సుమారు 920 పోస్టులు దక్కుతాయి. చిన్న చితకా ఆలయాలతో పాటు.. ఇతర ప్రధాన ఆలయాలు కూడా ఉన్నాయి. ఆలయ బోర్డులను ఏర్పాటు చేయడం ద్వారా.. 920 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో మిత్ర పక్షాలుగా జనసేన, బీజేపీలకు కూడా కేటాయించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారికి ఉన్న సంఖ్యాబలం ఆధారంగా కేటాయింపులు జరుగుతాయని తెలిపారు.
2) మార్కెట్ యార్డు చైర్మన్ పోస్టులు. ఇవి ఏకంగా.. 2852 పోస్టులు ఉన్నాయి. వీటిలోనూ ప్రధాన నగరాలు, పట్టణాల్లోని పత్తి, మిర్చి, పొగాకు.. వంటి బోర్డులతో పాటు.. ఇతర ప్రాంతాల్లోని వ్యవసాయ బోర్డులు కూడా ఉన్నాయి. వీటిని కూడా టీడీపీతో పాటు..మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలకు కేటాయిస్తారు. మొత్తంగా ఈ పదవుల పంపిణీకి తాజాగా చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎంపిక చేసే బాధ్యతలను పార్టీ రాష్ట్ర చీఫ్ పల్లా శ్రీనివాసరావుకు అప్పగించారు.
This post was last modified on July 15, 2025 6:39 am
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…