Political News

పద‌వుల పందేరం.. లెక్క చూస్తున్న చంద్ర‌బాబు!

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం.. నామినేటెడ్ ప‌ద‌వుల‌ను నాయ‌కుల‌కు క‌ట్ట‌బెట్టేందుకు రంగం రెడీ చేసింది. మ‌రో 15-20 రోజుల్లోనే నామినేటెడ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఈ ద‌ఫా దాదాపు 3 వేల నామినేట‌డ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేయాల‌ని భావిస్తున్నారు. ఎన్నిక‌ల్లో బ‌లంగా ప‌ని చేసిన వారు, పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన వారు చాలా మంది ఉన్నారు. వీరిలో కొంద‌రికి ఇప్ప‌టికే చైర్మ‌న్‌లు ప‌ద వులు ఇచ్చారు. కానీ, మరింత మంది ఆయా ప‌ద‌వుల కోసం వేచి చూస్తున్నారు.

ఈ క్ర‌మంలో పార్టీని మ‌రింత పుంజుకునే చేయాలంటే.. నాయ‌కుల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను ఉత్సాహంగా ముందు కు న‌డిపించాలంటే.. ఖ‌చ్చితంగా ప‌ద‌వులు ఇవ్వాల్సిందేన‌న్న నిర్ణ‌యానికి చంద్ర‌బాబు వ‌చ్చారు. ప్ర‌స్తు తం నాయకులు క్షేత్ర‌స్థాయిలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరిని బుజ్జ‌గించేందుకు ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లు ప్ర‌య‌త్నాలు చేసినా.. ఫ‌లించ‌లేదు. ఈ నేప‌థ్యంలో ప‌ద‌వుల కొడితే త‌ప్ప‌.. ప‌ని జ‌ర‌గ‌ద‌ని చంద్ర‌బాబు డిసైడ్ అయ్యారు. ఈ నేప‌థ్యంలోనే 3 వేల పైచిలుకు పోస్టుల‌ను భ‌ర్తీ చేయాల‌ని నిర్ణ‌యించారు.

ఇవీ పోస్టులు.. 1) దేవాల‌యాల‌కు క‌మిటీలు. వీటిలో సుమారు 920 పోస్టులు ద‌క్కుతాయి. చిన్న చిత‌కా ఆల‌యాల‌తో పాటు.. ఇత‌ర ప్ర‌ధాన ఆల‌యాలు కూడా ఉన్నాయి. ఆల‌య బోర్డుల‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా.. 920 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. వీటిలో మిత్ర ప‌క్షాలుగా జ‌న‌సేన‌, బీజేపీల‌కు కూడా కేటాయించ‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. వారికి ఉన్న సంఖ్యాబ‌లం ఆధారంగా కేటాయింపులు జ‌రుగుతాయ‌ని తెలిపారు.

2) మార్కెట్ యార్డు చైర్మ‌న్ పోస్టులు. ఇవి ఏకంగా.. 2852 పోస్టులు ఉన్నాయి. వీటిలోనూ ప్ర‌ధాన న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లోని ప‌త్తి, మిర్చి, పొగాకు.. వంటి బోర్డులతో పాటు.. ఇత‌ర ప్రాంతాల్లోని వ్య‌వ‌సాయ బోర్డులు కూడా ఉన్నాయి. వీటిని కూడా టీడీపీతో పాటు..మిత్ర‌ప‌క్షాలైన జ‌నసేన‌, బీజేపీల‌కు కేటాయిస్తారు. మొత్తంగా ఈ ప‌ద‌వుల పంపిణీకి తాజాగా చంద్ర‌బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఎంపిక చేసే బాధ్య‌త‌ల‌ను పార్టీ రాష్ట్ర చీఫ్ ప‌ల్లా శ్రీనివాస‌రావుకు అప్ప‌గించారు.

This post was last modified on July 15, 2025 6:39 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

2 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

4 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

4 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

5 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

5 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

6 hours ago