Political News

పద‌వుల పందేరం.. లెక్క చూస్తున్న చంద్ర‌బాబు!

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం.. నామినేటెడ్ ప‌ద‌వుల‌ను నాయ‌కుల‌కు క‌ట్ట‌బెట్టేందుకు రంగం రెడీ చేసింది. మ‌రో 15-20 రోజుల్లోనే నామినేటెడ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఈ ద‌ఫా దాదాపు 3 వేల నామినేట‌డ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేయాల‌ని భావిస్తున్నారు. ఎన్నిక‌ల్లో బ‌లంగా ప‌ని చేసిన వారు, పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన వారు చాలా మంది ఉన్నారు. వీరిలో కొంద‌రికి ఇప్ప‌టికే చైర్మ‌న్‌లు ప‌ద వులు ఇచ్చారు. కానీ, మరింత మంది ఆయా ప‌ద‌వుల కోసం వేచి చూస్తున్నారు.

ఈ క్ర‌మంలో పార్టీని మ‌రింత పుంజుకునే చేయాలంటే.. నాయ‌కుల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను ఉత్సాహంగా ముందు కు న‌డిపించాలంటే.. ఖ‌చ్చితంగా ప‌ద‌వులు ఇవ్వాల్సిందేన‌న్న నిర్ణ‌యానికి చంద్ర‌బాబు వ‌చ్చారు. ప్ర‌స్తు తం నాయకులు క్షేత్ర‌స్థాయిలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరిని బుజ్జ‌గించేందుకు ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లు ప్ర‌య‌త్నాలు చేసినా.. ఫ‌లించ‌లేదు. ఈ నేప‌థ్యంలో ప‌ద‌వుల కొడితే త‌ప్ప‌.. ప‌ని జ‌ర‌గ‌ద‌ని చంద్ర‌బాబు డిసైడ్ అయ్యారు. ఈ నేప‌థ్యంలోనే 3 వేల పైచిలుకు పోస్టుల‌ను భ‌ర్తీ చేయాల‌ని నిర్ణ‌యించారు.

ఇవీ పోస్టులు.. 1) దేవాల‌యాల‌కు క‌మిటీలు. వీటిలో సుమారు 920 పోస్టులు ద‌క్కుతాయి. చిన్న చిత‌కా ఆల‌యాల‌తో పాటు.. ఇత‌ర ప్ర‌ధాన ఆల‌యాలు కూడా ఉన్నాయి. ఆల‌య బోర్డుల‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా.. 920 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. వీటిలో మిత్ర ప‌క్షాలుగా జ‌న‌సేన‌, బీజేపీల‌కు కూడా కేటాయించ‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. వారికి ఉన్న సంఖ్యాబ‌లం ఆధారంగా కేటాయింపులు జ‌రుగుతాయ‌ని తెలిపారు.

2) మార్కెట్ యార్డు చైర్మ‌న్ పోస్టులు. ఇవి ఏకంగా.. 2852 పోస్టులు ఉన్నాయి. వీటిలోనూ ప్ర‌ధాన న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లోని ప‌త్తి, మిర్చి, పొగాకు.. వంటి బోర్డులతో పాటు.. ఇత‌ర ప్రాంతాల్లోని వ్య‌వ‌సాయ బోర్డులు కూడా ఉన్నాయి. వీటిని కూడా టీడీపీతో పాటు..మిత్ర‌ప‌క్షాలైన జ‌నసేన‌, బీజేపీల‌కు కేటాయిస్తారు. మొత్తంగా ఈ ప‌ద‌వుల పంపిణీకి తాజాగా చంద్ర‌బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఎంపిక చేసే బాధ్య‌త‌ల‌ను పార్టీ రాష్ట్ర చీఫ్ ప‌ల్లా శ్రీనివాస‌రావుకు అప్ప‌గించారు.

Satya

Recent Posts

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

8 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

9 hours ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

10 hours ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

10 hours ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

10 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

11 hours ago