Political News

ఆ రెండు జిల్లాల‌కు మ‌హ‌ర్ద‌శ‌..

ఏపీలో ప్రాంతాల వారీగా అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు కూట‌మి ప్ర‌భుత్వం పెద్ద‌పీట వేస్తోంది. రాయ‌ల‌సీమ నుంచిఉత్త‌రాంధ్ర వ‌ర‌కు కూడా ప్రాంతాల‌ను డెవ‌ల‌ప్ చేసేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను కూడా అందిపుచ్చుకుని రాష్ట్రంలో పెట్టుబ‌డులకు అనుకూలంగా మార్గాల‌ను సుగ‌మం చేసుకుంటోంది. తాజాగా ఏపీ స్పేస్ పాల‌సీపేరిట ప్ర‌భుత్వం ఓ నివేదిక‌ను విడుద‌ల చేసింది. కేంద్రం అమ‌లు చేస్తున్న స్పేస్ మిష‌న్ ప్రాజెక్టుకు అనుబంధంగా ఏపీలో పెట్టుబ‌డులు పెట్టించేందుకు వీలుగా చంద్ర‌బాబు వ్యూహాత్మ‌క అడుగులు వేస్తున్నారు.

దీనిలో భాగంగా ఏపీలోని రాయ‌ల‌సీమ జిల్లాలైన శ్రీస‌త్య‌సాయి, తిరుప‌తి జిల్లాల‌లో ఏపీ స్పేస్ పాల‌సీ కింద పెట్టుబ‌డులు పెట్టే వారికి పెద్ద‌పీట వేయాల‌ని నిర్ణ‌యించారు. దీనికి సంబంధించిన కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకు, పెట్టుబ‌డి దారుల‌ను ఆహ్వానిం చేందుకు, వారికి మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు వీలుగా ప్ర‌భుత్వం ఏపీ స్పేస్ కార్పొరేష‌న్ పేరుతో కొత్త కార్పొరేష‌న్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేష‌న్‌కు సంబంధించిన విధివిధానాల‌పై తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఏపీ స్పేస్‌ పాలసీని ప‌క్కాగా అమ‌లు చేసేందుకు వీలుగా ఈ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం ఆదివారం విడుద‌ల చేసిన ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.

ఈ కార్పొరేష‌న్ ప‌ని ఇదీ..

  • అంతరిక్ష రంగానికి చెందిన ప్రాజెక్టుల విషయంలో పెట్టుబడిదారులను ఆహ్వానించాలి.
  • పెట్టుబ‌డి దారుల‌కు అవ‌స‌ర‌మైన మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించాలి.
  • నిధుల‌తో వ‌చ్చే పెట్టుబ‌డి దారుల‌కు స‌క‌ల సౌక‌ర్యాల‌ను ఏపీలో క‌ల్పించేలా ఈ కార్పొరేషన్‌ సాయం చేయాలి.
  • మౌలిక వసతుల అభివృద్ధి, స్టార్టప్‌ నిధులు, పెట్టుబడులను ఆకర్షించాలి.
  • దేశీయ, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలి
  • సంస్థ‌ల‌కు భూ కేటాయింపు, దరఖాస్తుల పరిశీలన కూడా ఈ కార్పొరేష‌న్ ప‌రిదిలోనే జ‌ర‌గ‌నున్నాయి.
  • రాయ‌ల‌సీమ‌లోని శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో స్పేస్‌ సిటీలు ఏర్పాటు చేయ‌డ‌మే ఈ కార్పొరేష‌న్ ల‌క్ష్యం.

టార్గెట్ 2030…

అంత‌రిక్ష రంగంలో మాన‌వ స‌హిత ప్ర‌యోగాల‌కు.. కేంద్ర ప్ర‌భుత్వం 2030ని టార్గెట్‌గా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. గ‌గ‌న్ యాన్ -4లో మాన‌వుల‌ను అంత‌రిక్షంలోకి పంపించాల‌ని నిర్ణ‌యించింది. దీనికి సంబంధించిన మౌలిక అంశాలు… ప్రాజెక్టుల‌ను ఏపీలో రూపొందించేలా కూట‌మి ప్ర‌భుత్వం ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబు.. ఏపీ స్పేస్ పాల‌సీని రూపొందించారు. ఇది దేశంలోనే తొలి సారి. ఒక రాష్ట్ర ప్ర‌భుత్వం అంత‌రిక్ష రంగానికి సంబంధించి ఒక విధానం రూపొందించ‌డం ఇదేతొలిసారి. ఈ క్ర‌మంలో 2030 నాటికి దేశ‌మే కాదు.. ప్రపంచం కూడా ఏపీవైపు చూసేలా చేయాల‌న్న‌ది సీఎం చంద్ర‌బాబు ల‌క్ష్యం.

This post was last modified on July 15, 2025 6:26 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

5 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

8 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

10 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

11 hours ago