ఏపీలో ప్రాంతాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. రాయలసీమ నుంచిఉత్తరాంధ్ర వరకు కూడా ప్రాంతాలను డెవలప్ చేసేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను కూడా అందిపుచ్చుకుని రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలంగా మార్గాలను సుగమం చేసుకుంటోంది. తాజాగా ఏపీ స్పేస్ పాలసీపేరిట ప్రభుత్వం ఓ నివేదికను విడుదల చేసింది. కేంద్రం అమలు చేస్తున్న స్పేస్ మిషన్ ప్రాజెక్టుకు అనుబంధంగా ఏపీలో పెట్టుబడులు పెట్టించేందుకు వీలుగా చంద్రబాబు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు.
దీనిలో భాగంగా ఏపీలోని రాయలసీమ జిల్లాలైన శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాలలో ఏపీ స్పేస్ పాలసీ కింద పెట్టుబడులు పెట్టే వారికి పెద్దపీట వేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించేందుకు, పెట్టుబడి దారులను ఆహ్వానిం చేందుకు, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం ఏపీ స్పేస్ కార్పొరేషన్ పేరుతో కొత్త కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్కు సంబంధించిన విధివిధానాలపై తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ స్పేస్ పాలసీని పక్కాగా అమలు చేసేందుకు వీలుగా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ కార్పొరేషన్ పని ఇదీ..
టార్గెట్ 2030…
అంతరిక్ష రంగంలో మానవ సహిత ప్రయోగాలకు.. కేంద్ర ప్రభుత్వం 2030ని టార్గెట్గా పెట్టుకున్న విషయం తెలిసిందే. గగన్ యాన్ -4లో మానవులను అంతరిక్షంలోకి పంపించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన మౌలిక అంశాలు… ప్రాజెక్టులను ఏపీలో రూపొందించేలా కూటమి ప్రభుత్వం ముఖ్యంగా సీఎం చంద్రబాబు.. ఏపీ స్పేస్ పాలసీని రూపొందించారు. ఇది దేశంలోనే తొలి సారి. ఒక రాష్ట్ర ప్రభుత్వం అంతరిక్ష రంగానికి సంబంధించి ఒక విధానం రూపొందించడం ఇదేతొలిసారి. ఈ క్రమంలో 2030 నాటికి దేశమే కాదు.. ప్రపంచం కూడా ఏపీవైపు చూసేలా చేయాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యం.
దేశంలో తెలుగు ప్రేక్షకులంత పెద్ద మనసు ఇంకెవరికీ ఉండదంటూ ఇతర భాషల ఫిలిం మేకర్స్ తెగ పొగిడేస్తుంటారు. ముఖ్యంగా తమిళ…
ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…
బేబీ సినిమాతో పెద్ద సంచలనమే రేపాడు దర్శక నిర్మాత సాయిరాజేష్. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణవి చైతన్య, ఆనంద్…
హైదరాబాద్ను డ్రగ్స్ మహమ్మారి వెంటాడుతోంది. ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు అనుక్షణం డ్రగ్స్ కట్టడికి ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఏదో ఒక…