ఏపీలో ప్రాంతాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. రాయలసీమ నుంచిఉత్తరాంధ్ర వరకు కూడా ప్రాంతాలను డెవలప్ చేసేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను కూడా అందిపుచ్చుకుని రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలంగా మార్గాలను సుగమం చేసుకుంటోంది. తాజాగా ఏపీ స్పేస్ పాలసీపేరిట ప్రభుత్వం ఓ నివేదికను విడుదల చేసింది. కేంద్రం అమలు చేస్తున్న స్పేస్ మిషన్ ప్రాజెక్టుకు అనుబంధంగా ఏపీలో పెట్టుబడులు పెట్టించేందుకు వీలుగా చంద్రబాబు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు.
దీనిలో భాగంగా ఏపీలోని రాయలసీమ జిల్లాలైన శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాలలో ఏపీ స్పేస్ పాలసీ కింద పెట్టుబడులు పెట్టే వారికి పెద్దపీట వేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించేందుకు, పెట్టుబడి దారులను ఆహ్వానిం చేందుకు, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం ఏపీ స్పేస్ కార్పొరేషన్ పేరుతో కొత్త కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్కు సంబంధించిన విధివిధానాలపై తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ స్పేస్ పాలసీని పక్కాగా అమలు చేసేందుకు వీలుగా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ కార్పొరేషన్ పని ఇదీ..
టార్గెట్ 2030…
అంతరిక్ష రంగంలో మానవ సహిత ప్రయోగాలకు.. కేంద్ర ప్రభుత్వం 2030ని టార్గెట్గా పెట్టుకున్న విషయం తెలిసిందే. గగన్ యాన్ -4లో మానవులను అంతరిక్షంలోకి పంపించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన మౌలిక అంశాలు… ప్రాజెక్టులను ఏపీలో రూపొందించేలా కూటమి ప్రభుత్వం ముఖ్యంగా సీఎం చంద్రబాబు.. ఏపీ స్పేస్ పాలసీని రూపొందించారు. ఇది దేశంలోనే తొలి సారి. ఒక రాష్ట్ర ప్రభుత్వం అంతరిక్ష రంగానికి సంబంధించి ఒక విధానం రూపొందించడం ఇదేతొలిసారి. ఈ క్రమంలో 2030 నాటికి దేశమే కాదు.. ప్రపంచం కూడా ఏపీవైపు చూసేలా చేయాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యం.
This post was last modified on July 15, 2025 6:26 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…