తొలిసారి విజయం దక్కించుకున్న వారిలో పార్లమెంటు సభ్యులు కూడా ఉన్నారు. వీరిలో ఒకరికి కేంద్ర మంత్రి పదవి కూడా దక్కింది. అయితే.. పదవులతో పనిలేకుండా.. ప్రజలకు చేరువ అవుతున్న యువ ఎంపీగా.. తొలిసారి విజయం దక్కించుకున్నా.. తండ్రి బాటలో నడుస్తూ.. ప్రజలకు చేరువ అవుతున్న నాయకుడిగా.. పేరు తెచ్చుకుంటున్నారు అమలాపురం ఎంపీ గంటి హరీష్. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కూటమి హవాకు తోడు.. యువ నేతగా ఆయన ప్రజలకు చేరువయ్యారు. ఫలితంగా గెలుపు గుర్రం ఎక్కారు.
ఢిల్లీ పాలిటిక్స్లోనూ ఆయన అనుభవం గడిస్తున్నారు. నియోజకవర్గం సమస్యలపై ఆకళింపు చేసుకున్న హరీష్.. గతంలో తన తండ్రి మోహన్చంద్ర బాలయోగి.. ఏవిధంగా ప్రజలకు చేరువయ్యారో.. ఇప్పుడు ఆయన కూడా అదే తరహాలో ప్రజలకు చేరువ అవుతున్నారు. ఎస్సీ నియోజకవర్గం అయిన అమలాపు రంలో భిన్నమైన రాజకీయాలు ఉన్నాయి. ముఖ్యంగా మాజీ ఎంపీల నుంచి రాజకీయ విమర్శలు వస్తుం టాయి. అయితే.. వాటిపై ఎంత మేరకు స్పందించాలో.. అంత వరకే స్పందించి.. మిగిలిన విషయాలను పక్కన పెడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలోనూ.. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలతో కలిసి పనులు, ప్రణాళికలు నిర్మించడంలోనూ.. హరీష్ మాధుర్ ముందున్నారు. నారా లోకేష్ టీంలో సభ్యుడిగా ఉన్నారన్న ప్రచారం ఉన్నా.. వ్యక్తిగతంగా ఆయన ప్రజలకు చేరువ అవుతు న్నారు. నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదేసమయంలో కూటమి పార్టీల నాయకులతోనూ మంచి సత్సంబంధాలను నెలకొల్పారు.
కేంద్రంలోనూ.. రాష్ట్రంలోనూ మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఒకానొక దశలోపార్లమెంటు డిప్యూటీ స్పీకర్ పదవిలోనూ ఆయన పేరు వినిపించడం గమనార్హం. అయితే.. కొన్ని కారణాలతో ఈ పదవిని భర్తీ చేయలేక పోయారు. ఇప్పుడు కాకపోతే.. భవిష్యత్తులో అయినా.. ఆయనకు పార్లమెంటు స్పీకర్ పదవి దక్కే అవకాశం ఉంటుందన్న చర్చ ఉంది. దీనికి కారణం.. అందరినీ కలుపుకొని పోవడం.. ఇతర భాషల్లోనూ పట్టు, ముఖ్యంగా పార్టీ పట్ల అంకిత భావం వంటివి హరీష్ మాధుర్ను తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు సాగేలా చేస్తున్నాయి. వివాదాలకు కడుదూరంగా కూడా ఉంటున్నారు.
This post was last modified on July 16, 2025 2:15 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…