తొలిసారి విజయం దక్కించుకున్న వారిలో పార్లమెంటు సభ్యులు కూడా ఉన్నారు. వీరిలో ఒకరికి కేంద్ర మంత్రి పదవి కూడా దక్కింది. అయితే.. పదవులతో పనిలేకుండా.. ప్రజలకు చేరువ అవుతున్న యువ ఎంపీగా.. తొలిసారి విజయం దక్కించుకున్నా.. తండ్రి బాటలో నడుస్తూ.. ప్రజలకు చేరువ అవుతున్న నాయకుడిగా.. పేరు తెచ్చుకుంటున్నారు అమలాపురం ఎంపీ గంటి హరీష్. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కూటమి హవాకు తోడు.. యువ నేతగా ఆయన ప్రజలకు చేరువయ్యారు. ఫలితంగా గెలుపు గుర్రం ఎక్కారు.
ఢిల్లీ పాలిటిక్స్లోనూ ఆయన అనుభవం గడిస్తున్నారు. నియోజకవర్గం సమస్యలపై ఆకళింపు చేసుకున్న హరీష్.. గతంలో తన తండ్రి మోహన్చంద్ర బాలయోగి.. ఏవిధంగా ప్రజలకు చేరువయ్యారో.. ఇప్పుడు ఆయన కూడా అదే తరహాలో ప్రజలకు చేరువ అవుతున్నారు. ఎస్సీ నియోజకవర్గం అయిన అమలాపు రంలో భిన్నమైన రాజకీయాలు ఉన్నాయి. ముఖ్యంగా మాజీ ఎంపీల నుంచి రాజకీయ విమర్శలు వస్తుం టాయి. అయితే.. వాటిపై ఎంత మేరకు స్పందించాలో.. అంత వరకే స్పందించి.. మిగిలిన విషయాలను పక్కన పెడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలోనూ.. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలతో కలిసి పనులు, ప్రణాళికలు నిర్మించడంలోనూ.. హరీష్ మాధుర్ ముందున్నారు. నారా లోకేష్ టీంలో సభ్యుడిగా ఉన్నారన్న ప్రచారం ఉన్నా.. వ్యక్తిగతంగా ఆయన ప్రజలకు చేరువ అవుతు న్నారు. నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదేసమయంలో కూటమి పార్టీల నాయకులతోనూ మంచి సత్సంబంధాలను నెలకొల్పారు.
కేంద్రంలోనూ.. రాష్ట్రంలోనూ మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఒకానొక దశలోపార్లమెంటు డిప్యూటీ స్పీకర్ పదవిలోనూ ఆయన పేరు వినిపించడం గమనార్హం. అయితే.. కొన్ని కారణాలతో ఈ పదవిని భర్తీ చేయలేక పోయారు. ఇప్పుడు కాకపోతే.. భవిష్యత్తులో అయినా.. ఆయనకు పార్లమెంటు స్పీకర్ పదవి దక్కే అవకాశం ఉంటుందన్న చర్చ ఉంది. దీనికి కారణం.. అందరినీ కలుపుకొని పోవడం.. ఇతర భాషల్లోనూ పట్టు, ముఖ్యంగా పార్టీ పట్ల అంకిత భావం వంటివి హరీష్ మాధుర్ను తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు సాగేలా చేస్తున్నాయి. వివాదాలకు కడుదూరంగా కూడా ఉంటున్నారు.
This post was last modified on July 16, 2025 2:15 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…