Political News

‘సుప‌రిపాల‌న‌’పై.. జ‌నం ఏం చెబుతున్నారంటే..!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పరిపాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? సీఎం చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి, పెట్టుబడులు తీసుకురావడం వంటి వాటిపై ఆనందం వ్యక్తం చేస్తున్నారా? అనేది ప్రస్తుతం టిడిపి నాయకులు నిర్వహిస్తున్న ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం తెలుసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికి సుమారు 60 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని తొలి విడత పూర్తి చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి నివేదికలు కూడా అందాయి.

జిల్లా కలెక్టర్లు సుపరిపాలనలో తొలి అడుగు కార్య‌క్ర‌మానికి సంబంధించి నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేశారు. అయితే, ఈ నివేదికల ద్వారా ప్రభుత్వానికి కీలకమైన సమాచారం చేరినట్లు తెలిసింది. సుపరిపాలంలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రులు ఇంటింటికి వెళ్లినప్పుడు ప్రజల నుంచి అనేక సమస్యలు వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా కొత్తగా పింఛన్లు కోరుకుంటున్న వారు, గతంలో కొన్ని రాజకీయ కారణాల రీత్యా పింఛన్లు కోల్పోయిన వారు.. తమకు పింఛన్లు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించడం కనిపించింది. నిజానిగే వైసిపి హయాంలో కొంతమంది పింఛన్లు తొలగించిన మాట వాస్తవం.

అయితే కారణాలు ఏవైనా రాజకీయ కారణాలతోనే వారు పింఛన్లు తొలగించారన్న వాదన తెర మీదకు వచ్చింది. దీంతో ఇలాంటివారు సుమారు రాష్ట్రవ్యాప్తంగా 20 నుంచి 30 వేల మంది ఉన్నట్టు ప్రభుత్వానికి సమాచారం ఉంది. వీరందరికీ కొత్తగా పింఛన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీరికి తోడు 60 ఏళ్ళు దాటిన వారు మరి కొందరు కొత్తగా పింఛన్లు కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీరంతా ప్రభుత్వంపై చాలా ఆశలే పెట్టుకున్నారు. ఇప్పుడు వీరి విషయం కూడా ప్రభుత్వానికి సమస్యగా మారింది. మరోవైపు ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి రెండో విడత సుమారు రెండు లక్షల మందికి పైగా సొమ్ములు పడలేదని ప్ర‌జ‌లు చెబుతున్నారు.

సుపరిపాలనలో తొలి అడుగులు కార్యక్రమంలో మంత్రులకు అనేక విష‌యాలు నివేదిస్తున్నారు. తాము గ్యాస్ బండ తీసుకొని నెలలు గడిచిపోయినా ఇప్పటివరకు తమకు ప్రభుత్వం నుంచి రాయితీ డబ్బులు పడలేదని చాలామంది ఫిర్యాదు చేశారు. అదేవిధంగా రేషన్ కార్డు కోసం లక్షల మంది మంత్రులకు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పించారు. అంటే ఒక రకంగా చూసుకుంటే క్షేత్రస్థాయిలో ప్రజలు ఆశిస్తున్న దానికి ప్రభుత్వం పనితీరుకు మధ్య కొంత తేడా అయితే కనిపిస్తోంది అన్నది స్పష్టమైనది. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం దానికి తగ్గట్టుగా నిర్ణయాలు ఉంటాయా ఉండవా అనేది చూడాలి.

ప్రజలు కోరుకుంటున్న విధంగా పరిపాలన ముందుకు సాగితే బాగానే ఉంటుంది. లేకపోతే మాత్రం ఇబ్బందికర పరిస్తితి తప్పదు. ఎందుకంటే గతంలో కూడా ఇంటింటికి కార్యక్రమాన్ని వైసీపీ నిర్వహించింది. కానీ, ప్రజలు ఇచ్చిన వినతులు, సమస్యలపై మాత్రం పార్టీ ఎక్కడ పట్టించుకోలేదు. నాయకులు అసలే పట్టించుకోలేదు. దీంతో గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీని దూరం పెట్టారు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తొలి ఏడాదిలో జరిగిన పొరపాట్లు.. ప్రజల నుంచి వస్తున్న విన‌తులు, సమస్యలు వంటి వాటిని ప్రత్యేకంగా గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉంది. తద్వారా ప్రభుత్వంపై మరింత విశ్వాసాన్ని పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.

This post was last modified on July 15, 2025 6:24 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

6 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago