Political News

రండి మాట్లాడుకుందాం.. రేవంత్‌, బాబుల‌కు ఆహ్వానం!

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల వివాదాల‌కు సంబంధించి ప‌రిష్కారం చూపించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్ర‌భుత్వం రెడీ అయింది. ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఢిల్లీకి రావాల‌ని.. త‌మ స‌మ‌క్షంలోనే కూర్చుని చ‌ర్చించుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఈ నెల 16న ఢిల్లీకి వ‌చ్చేందుకు వీలు అవు తుందో లేదో చెప్పాల‌ని.. ఆ రోజు కూర్చుని మాట్లాడుకుందామ‌ని కేంద్రం పేర్కొంది. ఈ మేర‌కు రెండు తెలుగు రాష్ట్రాల‌కు కేంద్రం తాజాగా లేఖ‌లు రాసింది.

బ‌న‌క‌చ‌ర్ల‌పైనే!

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య క‌ర్నూలు జిల్లాలో సీఎం చంద్ర‌బాబు నిర్మించ త‌ల‌పెట్టిన బ‌న‌క‌చ‌ర్ల ప్రాజె క్టు వ్య‌వ‌హారం వివాదంగా మారిన విష‌యం తెలిసిందే. దీనిని ఇప్ప‌టికే కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ విభాగం అధి కారులు తొక్కిపెట్టారు. గోదావరిలో మిగులు జ‌లాలు ఎన్ని? అవి ఎలా లెక్కించారు? దీనికి సంబంధించి న అధికారిక నిర్ణ‌యం ఏంటి? అనే కీల‌క విష‌యాల‌పై కేంద్రం రాష్ట్రాన్ని ప్ర‌శ్నిస్తూ.. లేఖ కూడా రాసింది. దీనిపై ఏపీ స‌మాధానం చెప్పేందుకు సిద్ధ‌మైంది.

మ‌రోవైపు.. తెలంగాణ ప్ర‌భుత్వం బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టును పూర్తిగా వ్య‌తిరేకిస్తున్న విష‌యం తెలిసిందే. దీనిని ఎట్టి ప‌రిస్థితిలోనూ నిర్మించ‌కుండా చూస్తామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. ప్ర‌తిప‌క్షాల నుంచి రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ ప‌రిణామాల క్ర‌మంలోనే బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు వ్య‌వ‌హారం ఇబ్బందు ల్లో ప‌డింది. ఈ క్ర‌మంలోనే ఏపీ నుంచి కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. బ‌న‌క‌చ‌ర్ల‌ను గేమ్ ఛేంజ‌ర్‌గా భావిస్తున్న సీఎం చంద్ర‌బాబు.. దీనికి అనుమ‌తులు ఇవ్వాల‌ని కోరుతున్నారు.

ఇదిలావుంటే.. రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు.. కృష్ణాన‌ది జ‌లాల‌ను కేటాయించారని.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాదిస్తున్నారు. దీంతో తెలంగాణ‌కు అన్యాయం జ‌రిగింద‌ని.. ఇప్పుడు తాజాగా రాష్ట్రాల వారిగా జ‌లాల ను కేటాయించాల‌ని ఆయ‌న కోరుతున్నారు. ఈ క్ర‌మంలో రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తోనూ ఉమ్మ‌డి గా కూర్చుని చ‌ర్చించి ప‌రిష్క‌రించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. అయితే.. తెలంగాణ‌లో ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యం, ఇక్క‌డ బీజేపీ బ‌లంగా ఉన్న క్ర‌మంలో కేంద్రం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్న‌ది ఆస‌క్తిగా మారింది.

This post was last modified on July 14, 2025 9:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్ర‌బాబు నిర్ణ‌యమే.. తెలంగాణ‌కు ఊపిరా?!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కేంద్రం చేసిన ప్ర‌తిపాద‌న తీవ్ర సంక‌ట స్థితిలోకి నెట్టేసింది. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమ‌తి ఇవ్వాలంటూ.. కేంద్ర…

4 hours ago

ఏపీలో ఎన్నికల కోలాహ‌లం.. ఎప్పుడైనా?!

దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌.. ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయ‌తీ స‌హా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు…

6 hours ago

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

13 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

14 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

14 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

16 hours ago