Political News

రండి మాట్లాడుకుందాం.. రేవంత్‌, బాబుల‌కు ఆహ్వానం!

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల వివాదాల‌కు సంబంధించి ప‌రిష్కారం చూపించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్ర‌భుత్వం రెడీ అయింది. ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఢిల్లీకి రావాల‌ని.. త‌మ స‌మ‌క్షంలోనే కూర్చుని చ‌ర్చించుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఈ నెల 16న ఢిల్లీకి వ‌చ్చేందుకు వీలు అవు తుందో లేదో చెప్పాల‌ని.. ఆ రోజు కూర్చుని మాట్లాడుకుందామ‌ని కేంద్రం పేర్కొంది. ఈ మేర‌కు రెండు తెలుగు రాష్ట్రాల‌కు కేంద్రం తాజాగా లేఖ‌లు రాసింది.

బ‌న‌క‌చ‌ర్ల‌పైనే!

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య క‌ర్నూలు జిల్లాలో సీఎం చంద్ర‌బాబు నిర్మించ త‌ల‌పెట్టిన బ‌న‌క‌చ‌ర్ల ప్రాజె క్టు వ్య‌వ‌హారం వివాదంగా మారిన విష‌యం తెలిసిందే. దీనిని ఇప్ప‌టికే కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ విభాగం అధి కారులు తొక్కిపెట్టారు. గోదావరిలో మిగులు జ‌లాలు ఎన్ని? అవి ఎలా లెక్కించారు? దీనికి సంబంధించి న అధికారిక నిర్ణ‌యం ఏంటి? అనే కీల‌క విష‌యాల‌పై కేంద్రం రాష్ట్రాన్ని ప్ర‌శ్నిస్తూ.. లేఖ కూడా రాసింది. దీనిపై ఏపీ స‌మాధానం చెప్పేందుకు సిద్ధ‌మైంది.

మ‌రోవైపు.. తెలంగాణ ప్ర‌భుత్వం బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టును పూర్తిగా వ్య‌తిరేకిస్తున్న విష‌యం తెలిసిందే. దీనిని ఎట్టి ప‌రిస్థితిలోనూ నిర్మించ‌కుండా చూస్తామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. ప్ర‌తిప‌క్షాల నుంచి రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ ప‌రిణామాల క్ర‌మంలోనే బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు వ్య‌వ‌హారం ఇబ్బందు ల్లో ప‌డింది. ఈ క్ర‌మంలోనే ఏపీ నుంచి కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. బ‌న‌క‌చ‌ర్ల‌ను గేమ్ ఛేంజ‌ర్‌గా భావిస్తున్న సీఎం చంద్ర‌బాబు.. దీనికి అనుమ‌తులు ఇవ్వాల‌ని కోరుతున్నారు.

ఇదిలావుంటే.. రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు.. కృష్ణాన‌ది జ‌లాల‌ను కేటాయించారని.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాదిస్తున్నారు. దీంతో తెలంగాణ‌కు అన్యాయం జ‌రిగింద‌ని.. ఇప్పుడు తాజాగా రాష్ట్రాల వారిగా జ‌లాల ను కేటాయించాల‌ని ఆయ‌న కోరుతున్నారు. ఈ క్ర‌మంలో రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తోనూ ఉమ్మ‌డి గా కూర్చుని చ‌ర్చించి ప‌రిష్క‌రించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. అయితే.. తెలంగాణ‌లో ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యం, ఇక్క‌డ బీజేపీ బ‌లంగా ఉన్న క్ర‌మంలో కేంద్రం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్న‌ది ఆస‌క్తిగా మారింది.

This post was last modified on July 14, 2025 9:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

1 hour ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

3 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

3 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

4 hours ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

5 hours ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

6 hours ago