Political News

వివాదాల్లో జ‌న‌సేన నేత‌లు.. ఇలా అయితే క‌ష్ట‌మే.. !

జనసేన నాయకులు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్న అంశాలు కూడా తెలిసిందే. నిజానికి జనసేన పార్టీ అంటే నిబద్ధతకు, ప్రజా సేవకు, ప్రశ్నించే తత్వానికి కీలకమని ఆ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తాను కూడా అదే విధానాన్ని అవలంబిస్తానని ఆయన అన్నారు. అయితే అనూహ్యంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు పార్టీని, పార్టీ అధినేతను కూడా ఇరుకున పడేస్తున్నాయి.

అయితే ఎప్పటికప్పుడు ఉపేక్షించకుండా ఆయన చర్యలు అయితే తీసుకుంటున్నారు. కానీ, నాయకులలో మాత్రం మార్పు పెద్దగా కనిపించడం లేదు. గతంలో పార్టీకి బలమైన వాయిస్ గా ఉండి ఎన్నికల సమయంలో జనసేన తరఫున ప్రచార గీతాలను కూడా ఆలపించినటువంటి జానీ మాస్టర్ తర్వాత కాలంలో లైంగిక వేధింపుల కేసులు ఎదుర్కొన్నారు. దీంతో అప్పటివరకు ఆయనను పార్టీ ప్రచారకర్తగా.. పార్టీ అధికార ప్రతినిధిగా నియమించిన.. పవన్ కళ్యాణ్ ఆయనను పార్టీ నుంచి తప్పించాల్సి వచ్చింది.

ఆ తర్వాత ఆయన కేసులో బైల్ పొంది బయటకు వచ్చినా జనసేన పార్టీకి దూరంగానే ఉంటున్నారు. జనసేన కూడా ఆయనను పెద్ద‌గా పట్టించుకోవడం లేదు. ఇక తర్వాత పిఠాపురంలోనే ఓ బాలికపై జనసేన కార్యకర్త ఒక‌రు లైంగిక దాడికి పాల్పడడం, కేసులు పెట్టడం వంటివి జరిగాయి. దీంతో అప్పుడు కూడా సదర కార్యకర్తను పార్టీకి దూరంగా ఉంచారు. ఇక తాజాగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జి వినుత‌ వ్యవహారం మరింతగా పార్టీని ఇబ్బందుల్లో వేసింది. వినుత బలమైన గ‌ళం ఉన్న నాయకురాలు. స్థానికం గా కూడా మంచి పేరు సంపాదించుకుంది.

కానీ, ఆమె వ్యక్తిగత వ్యవహారాలు వివాదాస్పదం కావడం, పార్టీ వ్యవ్యవహారాలకు సంబంధించి పనులు చేసి పెడతానని కొంతమంది సొంత పార్టీ కార్యకర్తల దగ్గర డబ్బులు వసూలు చేశారనేది వినుతి పై ఉన్న ప్రధాన ఆరోప‌ణ‌. అదే సమయంలో ఇతర పార్టీ నాయకులతో కలిసి కాంట్రాక్టులు చేస్తున్నారనేది కూడా ఆమెపై ఉన్న ఆరోపణలు. ఈ క్రమంలోనే కొన్నాళ్ల‌ కిందట ఆమెపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. అయినా తాజా పరిణామాల రీత్యా ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు.

ఇవి పైకి కనిపిస్తున్న వ్యవహారాలు మాత్రమే కాదు. ఎమ్మెల్యేలు కూడా కొంతమంది గాడి తప్పుతున్నారు. కాబట్టి ఇలాంటి పరిణామాలను జనసేన అధినేత ఒకటికి రెండుసార్లు పరిశీలించి ఇలాంటి వారిపై తగిన విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే వచ్చే నాలుగేళ్లలో పార్టీ పరిస్థితి ఇబ్బందుల్లో పడుతుందనేది పరిశీలకులు వేస్తున్న అంచనా. మరి ఏం చేస్తారనేది చూడాలి. ఇక్కడ చిత్రం ఏంటంటే పనిచేస్తామన్న నాయకుల కంటే కూడా వీరికి పార్టీలో ప్రాధాన్యం దక్కుతోంద‌న్న‌ది మరో ప్రధాన విమర్శ.

This post was last modified on July 14, 2025 8:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

30 minutes ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago