గోవా గవర్నర్గా నియమితులైన.. టీడీపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి భవన్ నుంచి తనకు ముందుగానే సమాచారం అందిందన్న ఆయన.. నోటిఫికేషన్ వచ్చే వరకు వేచి చూశానని చెప్పారు. సీఎం చంద్రబాబు కృషి, ఆయన సిఫారసు తోనే తనకు ఈ అత్యున్నత పదవి దక్కిందని భావిస్తున్నట్టు చెప్పారు. మరోసారి దేశానికి సేవ చేసుకునే భాగ్యం కలిగిందని గజపతి రాజు తెలిపారు.
అవకాశం రావడం ఒక చిన్న విషయమేనన్న ఆయన.. దాని ద్వారా ఎంత మేరకు సేవ చేశామన్నది మాత్రం పెద్ద విషయమని గజపతి రాజు తెలిపారు. గోవాతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పారు. గోవా ముఖ్యమంత్రిగా, కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన దివంగత మనోహర్ పారికర్తో తనకు స్నేహం ఉందన్నారు. కేంద్రంలో ఒకే సారి మంత్రులుగా తాము పనిచేశామన్నారు. ఆయనకు చేసిన సూచనల మేరకు కోరుకొండ సైనిక్ స్కూల్లో బాలికలకు ప్రవేశం కల్పించారని చెప్పారు.
ఓటమితో ఎవరూ నిరుత్సాహ పడనవసరం లేదని గజపతి రాజు చెప్పారు. దీని నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు. గోవా అనేక సంస్కృతులకు ఆలవాలని పేర్కొన్నారు. దేశంలో అత్యుత్తమ పర్యాటక రాష్ట్రంగా కూడా ఉందన్నారు. చంద్రబాబు తనను సిఫారసు చేయడం పట్ల సంతోషంగా ఉందన్న ఆయన.. గోవా ప్రజలకు సేవ చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు.
చంద్రబాబు శుభాకాంక్షలు..
గోవా గవర్నర్గా నియమితులైన గజపతి రాజుకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్గా ఆయన నియామకం.. తెలుగు వారికి అత్యంత గర్వకారణమని పేర్కొన్నారు. విజయవంతంగా ఆయన పదవీ కాలం పూర్తి చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. నిజాయితీ, నిబద్ధతలకు గజపతి రాజు నిదర్శనమని పేర్కొన్నారు.
This post was last modified on July 14, 2025 7:41 pm
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…
మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…