గోవా గవర్నర్గా నియమితులైన.. టీడీపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి భవన్ నుంచి తనకు ముందుగానే సమాచారం అందిందన్న ఆయన.. నోటిఫికేషన్ వచ్చే వరకు వేచి చూశానని చెప్పారు. సీఎం చంద్రబాబు కృషి, ఆయన సిఫారసు తోనే తనకు ఈ అత్యున్నత పదవి దక్కిందని భావిస్తున్నట్టు చెప్పారు. మరోసారి దేశానికి సేవ చేసుకునే భాగ్యం కలిగిందని గజపతి రాజు తెలిపారు.
అవకాశం రావడం ఒక చిన్న విషయమేనన్న ఆయన.. దాని ద్వారా ఎంత మేరకు సేవ చేశామన్నది మాత్రం పెద్ద విషయమని గజపతి రాజు తెలిపారు. గోవాతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పారు. గోవా ముఖ్యమంత్రిగా, కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన దివంగత మనోహర్ పారికర్తో తనకు స్నేహం ఉందన్నారు. కేంద్రంలో ఒకే సారి మంత్రులుగా తాము పనిచేశామన్నారు. ఆయనకు చేసిన సూచనల మేరకు కోరుకొండ సైనిక్ స్కూల్లో బాలికలకు ప్రవేశం కల్పించారని చెప్పారు.
ఓటమితో ఎవరూ నిరుత్సాహ పడనవసరం లేదని గజపతి రాజు చెప్పారు. దీని నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు. గోవా అనేక సంస్కృతులకు ఆలవాలని పేర్కొన్నారు. దేశంలో అత్యుత్తమ పర్యాటక రాష్ట్రంగా కూడా ఉందన్నారు. చంద్రబాబు తనను సిఫారసు చేయడం పట్ల సంతోషంగా ఉందన్న ఆయన.. గోవా ప్రజలకు సేవ చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు.
చంద్రబాబు శుభాకాంక్షలు..
గోవా గవర్నర్గా నియమితులైన గజపతి రాజుకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్గా ఆయన నియామకం.. తెలుగు వారికి అత్యంత గర్వకారణమని పేర్కొన్నారు. విజయవంతంగా ఆయన పదవీ కాలం పూర్తి చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. నిజాయితీ, నిబద్ధతలకు గజపతి రాజు నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…