తెలంగాణ జాగృతి సంస్థకు చెందిన కార్యకర్తలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అనుచరులు, ఆయన గన్ మెన్ సైతం విరుచు కుపడ్డారు. తుపాకీతో బెదిరించడమే కాకుండా.. భౌతికంగా కూడా వారిపై దాడి చేశారు. బీసీ రిజర్వేషన్ వి షయంపై బీఆర్ ఎస్ నాయకురాలు, తెలంగాణ జాగృతి చీఫ్.. కవిత ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రిజర్వేషన్ వ్యవహారం.. కాంగ్రెస్-కవితల మధ్య మాటల తూటాలు పేలుస్తోంది.
అయితే.. ఈ వ్యవహారంలో కవితను ఎండగడుతూ.. తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు రచ్చకు దారి తీశాయి. మంచం-కంచం అంటూ.. ఆయన చేసిన విమర్శలపై జాగృతి కార్యకర్తలు.. ఆదివారం హైదరాబాద్ సమీపంలోని మేడిపల్లిలో ఉన్న తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడికి యత్నించారు. లోపలికి చొచ్చుకుపోయి.. ఫర్నిచర్ను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఆఫీసు అద్దాలను పగులగొట్టే ప్రయత్నం కూడా చేశారు. దీంతో ఆఫీసు సిబ్బంది సహా మల్లన్న గన్ మెన్ రెచ్చిపోయారు.
తుపాకీతో జాగృతి కార్యకర్తలను బెదిరించడంతోపాటు.. వారిపై పిడిగుద్దులు గుద్దారు. ఈ క్రమంలో ఒకరిద్దరు జాగృతి కార్యకర్తలు.. తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఆఫీసు లోపల రక్తపు మడుగు కట్టడం.. రక్తం కారడం.. గచ్చంతా రక్తంతో తడిచి ఉన్న దృశ్యాలు.. వెలుగు చూశాయి. మొత్తంగా లోపల తీవ్రంగానే దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసినట్టు చెబుతు న్నారు. మరోవైపు.. కాంగ్రెస్ నుంచి దూరంగా ఉన్న తీన్మార్ మల్లన్నకు.. పార్టీ ఏమేరకు అండగా ఉంటుందో చూడాలి.
This post was last modified on July 13, 2025 5:58 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…