జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటల మనిషి కాదు చేతల మనిషి అని మరోసారి నిరూపించారు. పార్టీలో క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడ్డ నేతలపై వేటు తప్పదని పవన్ గతంలో చాలాసార్లు హెచ్చరించారు. జనసేన నేతలు నిబద్ధతగా ఉంటూ జనసైనికులు, ప్రజలకు ఆదర్శప్రాయంగా వ్యవహరించాలని..లేని పక్షంలో పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి వెనుకాడనని పవన్ ఎన్నోసార్లు స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు జనసేన ఇన్చార్జి టీవీ రామారావును సస్పెండ్ చేసిన పవన్..తాజాగా మరో జనసేన మహిళా నేతపై వేటు వేశారు.
శ్రీకాళహస్తి జనసేనే ఇన్చార్జి వినుత కోటను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జనసేన అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఆమె వ్యవహార శైలి పార్టీ విధివిధానాలకు భిన్నంగా ఉన్నందున కొంతకాలంగా ఆమెను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతున్నామని జనసేన కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్ ఓ లేఖ విడుదల చేశారు. ఇటీవల ఆమెపై చెన్నైలో ఓ హత్య కేసులో ఆరోపణలు రావడంతో తాజాగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే పవన్ కు, జగన్ కు ఉన్న తేడా ఇదీ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. శవాన్ని డోర్ డెలివరీ చేసి జైలుకు వెళ్లి వచ్చిన ఎమ్మెల్సీ అనంత బాబు వంటి నేతలను జగన్ ఎంకరేజ్ చేస్తున్న వైనాన్ని నెటిజన్లు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. హత్య కేసులో వినుత కోటపై ఆరోపణలు వచ్చిన వెంటనే పవన్ పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేసిన వైనంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తనలా జైలుకు వెళ్లి వచ్చినా పర్వలేదు అన్న నేతలను జగన్ పార్టీలో కొనసాగిస్తుంటే…పవన్ మాత్రం తనలా నిజాయితీగా ఉండే నాయకులు మాత్రమే పార్టీలో ఉండాలని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని నెటిజన్లు అంటున్నారు.
This post was last modified on July 12, 2025 3:05 pm
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…