Political News

ఆర్టీసీ ఎఫెక్ట్‌: వైసీపీకి డ్యామేజీ.. టీడీపీకి క‌వ‌రేజీ!

ఏపీలో ఆగ‌స్టు 15 నుంచి ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం అందించేందుకు ప్ర‌భుత్వం రంగం రెడీ చేసింది. ఎట్టి ప‌రిస్థితిలోనూ దీనిని అమ‌లు చేసి తీరుతామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన సూప‌ర్ సిక్స్ హామీల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణంఒక‌టి. అయితే.. దీనిపై అనేక అధ్య‌య‌నాలు చేసిన త‌ర్వాత‌.. ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు దీనిని ప్రారంభించేందుకు రెడీ అయింది. దీనిపై మ‌హిళ‌లు హ‌ర్షం వ్య‌క్తంచేస్తున్నారు.

జిల్లాలో ఎక్క‌డ నుంచి ఎక్క‌డికైనా ప్ర‌యాణించే స‌దుపాయం క‌ల్పిస్తున్నారు. అయితే.. ప‌ల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ స‌ర్వీసుల‌కు మాత్ర‌మే దీనిని ప‌రిమితం చేస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం పేర్కొంది. అయినా.. కూడా నిత్యం ప్ర‌యాణించే మ‌హిళ‌లు, ఉద్యోగినుల‌కు నెల‌వారీ ఖ‌ర్చు దాదాపు 1000 వ‌ర‌కు క‌లిసివ‌స్తుంద‌ని ప్ర‌భుత్వం అంచ‌నా వేస్తోంది. ఇక‌, ఏడాదికి 12000 వ‌ర‌కు వారు ల‌బ్ధి పొంద‌నున్నారు. అదేవిధంగా గృహిణుల‌కు కూడా ఉచిత ఆర్టీస బ‌స్సు ప్ర‌యాణం మేలు చేస్తుంద‌ని లెక్క‌లు వేసుకున్నారు.

ఫ‌లితంగా టీడీపీ ఇచ్చిన హామీని నెర‌వేరుస్తున్న క్ర‌మంలో ఆ పార్టీకి ఈ ప్ర‌య‌త్నం మంచి ల‌బ్ధినే చేకూరు స్తుంద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో ఇలాంటి ప‌థ‌కం అమ‌లు కాలేదు. పైగా.. జిల్లాలో ఎక్క‌డి నుంచి ఎక్క‌డికైనా అంటే.. క‌నీసంలో క‌నీసం 150 కిలో మీట‌ర్ల రేడియ‌స్‌లో ఎక్క‌డైనా తిరిగే అవ‌కాశం ఏర్ప‌డుతుంది. ఒక‌ర‌కంగా ఇది మ‌హిళా ఓటు బ్యాంకును టీడీపీకి మ‌రింత చేరువ చేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇదేస‌మ‌యంలో అస‌లు ఆర్టీసీ బ‌స్సులు ఉచితంగా ఇవ్వ‌లేమ‌ని చెప్పిన వైసీపీకి మైనస్ అవుతుంద‌ని కూడా అంటున్నారు.

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ సూప‌ర్ 6 హామీలు ప్ర‌క‌టించిన‌ప్పుడు వైసీపీ ఎద్దేవా చేసింది. మ‌హిళా ప్ర‌యాణికులకు ఉచితంగా బ‌స్సుల్లో ప్ర‌యాణం చేసేందుకు అవ‌కాశం క‌ల్పిస్తే.. ఆర్టీసీని ఎత్తేయ‌డమే మిగిలి ఉంటుంద‌ని వైసీపీ అధినేత జ‌గ‌నే ప్రెస్‌మీట్లో వ్యాఖ్యానించారు. అప్ప‌టికే తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌లో అమ‌లైన ఆ ప‌థ‌కంపై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌ను ప్ర‌భుత్వాలు ప‌డుతున్న ఇబ్బందుల‌ను ఆయ‌న ఉటంకించా రు. దీంతో బాబు అలివికాని హామీ ఇచ్చార‌ని చెప్పుకొచ్చారు. కానీ, కూట‌మి స‌ర్కారు దీనిని ప్ర‌తిష్టాత్మకంగా తీసుకుని అమ‌లు చేస్తోంది. దీంతో వైసీపీ మైనస్ కాగా.. కూట‌మికి ప్ల‌స్ అయింది.

This post was last modified on July 12, 2025 12:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

30 minutes ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago