Political News

తండ్రి త‌గ్గ త‌న‌యుడు: ఆ టీడీపీ ఎమ్మెల్యే క‌థేంటంటే..!

తండ్రి వార‌స‌త్వంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన యువ నాయ‌కుల్లో కొంద‌రు చాలా దూకుడుగా పని చేస్తున్నా రు. మ‌రికొంద‌రు.. మంద‌గ‌మ‌నంతో ముందుకు సాగుతున్నారు. ఒక‌రిద్ద‌రు మాత్రం ఇంకా తండ్రి చాటు బిడ్డ‌ల్లానే ఉండిపోతున్నారు. ఒక‌రిద్ద‌రు మాత్రం తండ్రి పేరు నిల‌బెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇలాంటి వారిలో ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని ప‌త్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కీల‌కంగా మారారు. సుదీర్థ కాలంగా రాజ‌కీయాల్లో ఉన్న కేఈ కుటుంబం నుంచి వార‌సుడిగా ఆయ‌న రంగ ప్ర‌వేశం చేసిన విష‌యం తెలిసిందే.

మాజీ ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి త‌న‌యుడిగా శ్యామ్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. 2019 ఎన్నిక‌ల్లోనే ప‌త్తికొండ నుంచి పోటీ చేశారు. అయితే.. అప్ప‌ట్లో వైసీపీ హ‌వా, జ‌గ‌న్ పాద‌యాత్ర ప్ర‌భావంతో ప‌రాజ‌యం పాల‌య్యారు. అయిన‌ప్ప‌టికీ.. రాజకీయంగా పుంజుకున్నారు. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండ‌డంతోపాటు.. త‌న‌దైన శైలితో యువ‌త‌ను చేరువ చేసుకున్నారు. మంత్రి నారా లోకేష్ టీంలో కూడా.. శ్యామ్‌కు ప్ర‌త్యేక స్థానం ఉంద‌ని అంటారు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లోవిజ‌యం ద‌క్కించుకున్న ఆయ‌న రాజ‌కీయంగా తండ్రి బాట‌లో న‌డుస్తున్నారు.

ముఖ్యంగా రైతుల‌కు అందుబాటులో ఉండ‌డం, వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా రు. అదేస‌మ‌యంలో ఐటీపై మంచి ప‌ట్టున్న శ్యామ్ బాబు.. ప్రైవేటు సంస్థ‌ల‌ను ఆహ్వానించి.. జాబ్ మేళాలు నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 200 మంది యువ‌త‌కు ఉద్యోగాలు క‌ల్పించారు. త‌ద్వారా నియోజ‌క‌వ‌ర్గంలో నిరుద్యోగ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అదేవిధంగా ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను కూడా ఆయ‌న ప్ర‌చారం చేస్తున్నారు.

ఇక‌, రాజ‌కీయంగా ప‌త్తికొండ చాలా డిఫరెంట్‌. వైసీపీ నాయ‌కురాలు కంగాటి శ్రీదేవి వ‌ర్సెస్ కేఈ కుటుంబాల మ‌ధ్య ద‌శాబ్దాలుగా రాజ‌కీయంగా వైరం ఉంది. శ్రీదేవి భ‌ర్త హ‌త్య అనంత‌రం ఈ వివాదాలు మ‌రింత పెరిగాయి. వైసీపీ హ‌యాంలో కేఈ కుటుంబం పై క‌వ్వింపు రాజ‌కీయాలు కూడా జ‌రిగాయి. అయితే.. కేఈ శ్యామ్ ఎమ్మెల్యే అయిన త‌ర్వాత‌.. ఉద్రిక్త‌త‌లు త‌గ్గించే చ‌ర్య‌లు చేప‌ట్టారు. వైసీపీ నాయ‌కురాలి వివాదాస్పద వ్యాఖ్య‌ల‌ పై స్పందించ‌డ‌మే మానేశారు. పైగా.. ఉద్రిక్తత‌కు అవ‌కాశం ఇవ్వ‌ని విధంగా అంద‌రినీ క‌లుపుకొని పోతూ.. రాజ‌కీయాల్లో త‌న‌దైన శైలిని అనుస‌రిస్తున్నారు. దీంతో తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా శ్యామ్ గుర్తింపు పొందుతున్నారు.

This post was last modified on July 12, 2025 12:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago