Political News

ఫ‌స్ట్ మాట‌లోనే తూటా పేల్చిన ఏపీ బీజేపీ చీఫ్‌!

ఏపీ బీజేపీ నూత‌న అధ్య‌క్షుడిగా ఇటీవ‌ల ఎంపికైన పాకాల వెంక‌ట నాగేంద్ర మాధ‌వ్‌.. తన తొలి మాట‌లోనే తూటా పేల్చారు. ఏపీ బీజేపీ చీఫ్‌గా ఎంపికై వారం గ‌డిచినా.. మంచి రోజు కోసం వెయిట్ చేసిన ఆయ‌న‌ తాజాగా బుధ‌వారం విజ‌య‌వాడ‌లోని పార్టీ కార్యాల‌యంలో బాథ్య‌త‌లు చేప‌ట్టారు. ముందుగా తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి బీజేపీ ఆఫీసు వ‌ర‌కు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంత‌రం ఆయ‌న విజ‌య‌వాడ‌లోని ప్ర‌ముఖ షాపింగ్ సెంట‌ర్ బీసెంట్ రోడ్డు చివ‌రిలో ఉన్న లెనిన్ సెంట‌ర్‌కు చేరుకున్నారు.

అక్క‌డి ప్ర‌ముఖ క‌వి.. జ్ఞాన‌పీఠ్ అవార్డు గ్ర‌హీత‌ విశ్వనాథ సత్యనారాయణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా మాధ‌వ్ బీజేపీ చీఫ్ హోదాలో తొలిసారి మాట్లాడుతూ.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్న లెనిన్ సెంట‌ర్ పేరును త‌క్ష‌ణ‌మే మార్చాల‌ని అన్నారు. అస‌లు మ‌న దేశానికి లెనిన్‌కు ఏంటి సంబంధ‌మ‌ని ప్ర‌శ్నించారు. భారత దేశానికి ఎలాంటి సంబంధం లేని వ్య‌క్తి లెనిన్‌ పేరును ఈ సెంట‌ర్‌కు ఎలా పెడ‌తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

దీనిపై క‌మ్యూనిస్టులు నిప్పులు చెరుగుతున్నారు. లెనిన్ సిద్ధాంతాలు.. ఆయ‌న గురించి తెలియ‌ని వ్య‌క్తులే ఈ వ్యాఖ్య‌లు చేస్తార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. మార్కిస్టు పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడైన లెనిన్ ర‌ష్యాలో చేసిన మార్పులు, సంస్క‌ర‌ణ‌ల‌ను తెలుసుకోవాల‌ని సూచించారు. ఇదిలావుంటే.. గ‌తంలో పార్టీ చీఫ్‌గా ఉన్న సోము వీర్రా జజు కూడా.. గుంటూరులోని జిన్నా ట‌వ‌ర్ సెంట‌ర్ పేరును మార్చాల‌ని.. అక్క‌డ జిల్లా విగ్ర‌హాన్ని తొల‌గించాల‌ని పెద్ద ఎత్తున ఉద్య‌మం చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. అప్ప‌ట్లోనూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి.

This post was last modified on July 9, 2025 10:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

23 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

30 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

1 hour ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago