Political News

మార్పు క‌నిపిస్తోంది.. కూట‌మికి జ‌నం అభ‌యం ..!

‘సుప‌రిపాల‌న‌లో తొలి అడుగు-ఇది మంచి ప్ర‌భుత్వం’ పేరుతో కూట‌మి ప్ర‌భుత్వంలోని ప్ర‌ధాన భాగ‌స్వామ్య పార్టీ టీడీపీ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్తోంది. ఈ నెల 2 నుంచి నాయ‌కులు, మంత్రులు ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నారు. ప్ర‌త్యేక బుక్‌లెట్లు ప‌ట్టుకుని ఏడాది కాలంలో ఏం చేశారో ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. చిన్న చిన్న లోపాలు ఉన్న‌ప్ప‌టికీ.. కార్య‌క్ర‌మంలో దాదాపు అంద‌రూ పాల్గొంటున్నారు. దీనిపై ప్ర‌జ‌ల నుంచి కూడా మంచి స్పంద‌నే ల‌భిస్తోంది.

ముఖ్యంగా మార్పు క‌నిపిస్తోంద‌న్న టాక్ ఎక్కువ‌గా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో వైసీపీ హ‌యాంలో కంటే ఇప్పుడు మార్పు క‌నిపిస్తోంద‌ని ఎక్కువ‌గా చెప్ప‌డం విశేషం. స‌హ‌జంగా న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో ఈ మాట ఎక్కువ‌గా వినిపించ‌డం కొత్త‌కాదు. కానీ, గ్రామీణ ప్రాంతాల్లోనూ మార్పు క‌నిపిస్తోంద‌ని ప్ర‌జ‌లు చెబుతున్నారు. దీనికి ప్ర‌ధానంగా 3 కార‌ణాలు చెబుతున్నారు. వాటిని ఆధారం చేసుకుని మార్పు క‌నిపిస్తోంద‌ని ఎక్కువ మంది అభిప్రాయ‌ప‌డ్డారు.

1) ర‌హ‌దారుల నిర్మాణం: గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల‌ను నిర్మిస్తుండ‌డాన్ని మెజారిటీ ప్ర‌జ‌లు స్వాగ‌తిస్తున్నా రు. ఒక‌ప్పుడు 20 మైళ్ల దూరంలో ఉన్న గ్రామాల‌కు కూడా.. ర‌హ‌దారులు లేకుండా పోయాయి. వాటిని ఇప్పుడు నిర్మిస్తున్నారు.అలాగే.. చిన్న చిత‌కా ర‌హ‌దారుల‌నుకూడా వేస్తున్నారు. ఒక‌ప్పుడు ఖ‌ర్చుల పేరుతో ప్ర‌భుత్వాలు వాటికి దూరంగా ఉండేవి. ఇప్పుడు ఆ ప‌రిస్థితి మారింది. ఎక్క‌డ అవ‌కాశం ఉంటే అక్క‌డ రోడ్లు వేస్తున్నారు.

2) ఉపాది హామీ ప‌థ‌కం కింద నిధులు వెచ్చించి.. ప‌నులు చేయిస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వ‌ల‌స‌లు త‌గ్గాయి. కొన్ని చోట్ల ఇంకా వ‌ల‌స‌లు ఉన్నా.. మ‌రిన్ని చోట్ల మాత్రం త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఇది కూడా.. తాజాగా మంత్రులు, ఎమ్మెల్యేల ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌జ‌లు చెబుతున్నారు. 3) ఇంటికే అందుతున్న ప‌థ‌కాలు. ముఖ్యంగా త‌ల్లికి వంద‌నం ప‌థ‌కం మంచి మార్కులు వేసేలా చేసింది. ఇంట్లో ఎంత మంది పిల్ల‌లు ఉంటే అంద‌రికీ నిధులు అంద‌డం ప‌ట్ల ప్ర‌జ‌లు హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలా.. మార్పు క‌నిపిస్తోందని మెజారిటీ ప్ర‌జ‌లు అభిప్రాయ ప‌డుతుండ‌డం విశేషం.

This post was last modified on July 8, 2025 12:14 pm

Share

Recent Posts

అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడి ప్రేమ్ కహాని

తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…

30 minutes ago

అల్లు అర్జున్ 23… అప్పుడే ఇన్ని ప్రచారాలా

ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…

39 minutes ago

మరో రెండు ఎయిమ్స్ ఆసుపత్రుల కోసం జనసేన వినతి

రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…

1 hour ago

దర్శన్ కేసులో కీలక మలుపు

కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…

2 hours ago

ఆగస్ట్ 7… ఓటిటిలో కంటెంట్ వర్షం

థియేటర్లలో రేపు నాలుగైదు సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేకంగా ఓటిటిలో వచ్చే కొత్త కంటెంట్ కోసం ఎదురు…

2 hours ago

వైసీపీ ‘జెన్ జీ’ కాదు… ‘గంజాయ్ జీ’

వైసీపీ అధినేత జ‌గ‌న్ వెనుక ఉండే కార్య‌క‌ర్త‌లు, యువ‌త అంతా `జెన్‌జీ` అంటూ వైసీపీ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు. ముఖ్యంగా…

2 hours ago