ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం జనసేనలో కొన్నాళ్లుగా విభేదాలు హల్చల్ చేస్తున్నాయి. సంస్థాగతంగా పార్టీలో ఉన్న నాయకులు కొందరు.. వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డితో విభేదిస్తున్నారు. ముఖ్యంగా జనసేన కీలక నాయకులుగా ఉన్న రియాజ్, ఇమ్మడి కాశీనాథ్లు బాలినేనిని తీవ్రంగా వ్యతిరేకి స్తున్నారు. వైసీపీలో ఉండగా.. తమను ఇబ్బందులకు గురి చేశారని.. ఆయనను పార్టీలోకి ఎలా చేర్చుకున్నారంటూ.. గత కొన్నాళ్లుగా ప్రశ్నిస్తున్నారు. బహిరంగ వేదికలపై కూడా కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం గతంలోనూ పార్టీ అధిష్టానం దృష్టికి వచ్చింది. అయితే.. మంత్రి, జనసేన రాజకీయ వ్యవహారాల ఇంచార్జి నాదెండ్ల మనోహర్ రెండు మూడు సార్లు సర్దిచెప్పారు. అయినప్పటికీ..వారు వెనక్కి తగ్గలేదు. బాలినేని వంటివారి వల్ల ప్రయోజనం లేదని..ఆయన పార్టీలో కోవర్టు వంటి వారని కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఆయనను పార్టీ నుంచి బయటకు పంపించాలని గతంలో జిల్లా ఇంచార్జ్గా ఉన్న రియాజ్ డిమాండ్ చేశారు. ఇక, కాశీనాథ్ కూడా.. బాలినేని వ్యవహార శైలిని తప్పుబట్టారు. ఆయన కారణంగా జనసేన నాయకుల మధ్య సఖ్యత లేకుండా పోయిందన్నారు.
ఇలా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన నాయకులు ఎక్కువ మంది బాలినేని తప్పుబట్టడంతోపాటు.. ఆయనను పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంచారు. ఈ వ్యవహారంపై తాజాగా జిల్లాలో పర్యటించిన పవన్కల్యాణ్ స్పందించారు. మార్కాపురం లో శుక్రవారం పర్యటించిన పవన్ కల్యాణ్.. ఇక్కడ జల్ జీవన్ మిషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమం అనంతరం.. ఆయన పార్టీ నాయకులతో మాట్లాడుతూ.. అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పారు. బాలినేని తనకు ఆత్మీయుడని.. ఆయన గతంలోనూ మనతోనే ఉన్నారని చెప్పుకొచ్చారు.
వైసీపీ మంత్రిగా ఉన్నప్పుడు కూడా జనసేన విషయాల్లో ఆయన పాజిటివ్గా వ్యవహరించారని చెప్పారు. చిన్న చిన్న విభేదాలు ఉంటే.. సరిచేసుకోవాలని.. బాలినేనికి మంచి ఫ్యూచర్ ఉందని.. ఆయన వల్ల పార్టీ మరింత బలపడుతుందని చెప్పుకొచ్చారు. ఎలాంటి విభేదాలు రాకుండా అందరూ కలిసి పనిచేయాలని చెప్పుకొచ్చారు. దీంతో ప్రకాశం జిల్లాలో జనసేన విభేదాలకు దాదాపు చెక్ పడినట్టేనని నాయకులు చెబుతున్నారు. వాస్తవానికి బాలినేని నేరుగా నాగబాబు, పవన్ కల్యాణ్లను కలుసుకుని.. ఆ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…