Political News

ఒంగోలు జ‌న‌సేన సెట్‌రైట్‌.. బాలినేనికి అభ‌యం!

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ఒంగోలు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం జ‌న‌సేన‌లో కొన్నాళ్లుగా విభేదాలు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. సంస్థాగతంగా పార్టీలో ఉన్న నాయ‌కులు కొంద‌రు.. వైసీపీ నుంచి జ‌న‌సేన‌లోకి వ‌చ్చిన సీనియ‌ర్ నాయ‌కుడు బాలినేని శ్రీనివాస‌రెడ్డితో విభేదిస్తున్నారు. ముఖ్యంగా జ‌న‌సేన కీల‌క నాయ‌కులుగా ఉన్న రియాజ్‌, ఇమ్మ‌డి కాశీనాథ్‌లు బాలినేనిని తీవ్రంగా వ్య‌తిరేకి స్తున్నారు. వైసీపీలో ఉండ‌గా.. త‌మ‌ను ఇబ్బందుల‌కు గురి చేశార‌ని.. ఆయ‌నను పార్టీలోకి ఎలా చేర్చుకున్నారంటూ.. గ‌త కొన్నాళ్లుగా ప్ర‌శ్నిస్తున్నారు. బ‌హిరంగ వేదిక‌ల‌పై కూడా కామెంట్లు చేస్తున్నారు.

ఈ విష‌యం గ‌తంలోనూ పార్టీ అధిష్టానం దృష్టికి వ‌చ్చింది. అయితే.. మంత్రి, జ‌నసేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల ఇంచార్జి నాదెండ్ల మ‌నోహ‌ర్ రెండు మూడు సార్లు స‌ర్దిచెప్పారు. అయిన‌ప్ప‌టికీ..వారు వెన‌క్కి త‌గ్గ‌లేదు. బాలినేని వంటివారి వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేద‌ని..ఆయ‌న పార్టీలో కోవ‌ర్టు వంటి వార‌ని కూడా తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఆయ‌నను పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపించాల‌ని గ‌తంలో జిల్లా ఇంచార్జ్‌గా ఉన్న రియాజ్ డిమాండ్ చేశారు. ఇక‌, కాశీనాథ్ కూడా.. బాలినేని వ్య‌వ‌హార శైలిని త‌ప్పుబ‌ట్టారు. ఆయ‌న కార‌ణంగా జ‌న‌సేన నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త లేకుండా పోయింద‌న్నారు.

ఇలా ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో జ‌న‌సేన నాయ‌కులు ఎక్కువ మంది బాలినేని త‌ప్పుబ‌ట్ట‌డంతోపాటు.. ఆయ‌న‌ను పార్టీ కార్య‌క్రమాల‌కు కూడా దూరంగా ఉంచారు. ఈ వ్య‌వ‌హారంపై తాజాగా జిల్లాలో ప‌ర్య‌టించిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్పందించారు. మార్కాపురం లో శుక్ర‌వారం ప‌ర్య‌టించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఇక్క‌డ జ‌ల్ జీవ‌న్ మిష‌న్ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. కార్య‌క్ర‌మం అనంత‌రం.. ఆయ‌న పార్టీ నాయ‌కుల‌తో మాట్లాడుతూ.. అంద‌రూ క‌లిసిమెలిసి ఉండాల‌ని చెప్పారు. బాలినేని త‌న‌కు ఆత్మీయుడ‌ని.. ఆయ‌న గ‌తంలోనూ మ‌న‌తోనే ఉన్నార‌ని చెప్పుకొచ్చారు.

వైసీపీ మంత్రిగా ఉన్న‌ప్పుడు కూడా జ‌న‌సేన విష‌యాల్లో ఆయ‌న పాజిటివ్‌గా వ్య‌వ‌హ‌రించార‌ని చెప్పారు. చిన్న చిన్న విభేదాలు ఉంటే.. స‌రిచేసుకోవాల‌ని.. బాలినేనికి మంచి ఫ్యూచ‌ర్ ఉంద‌ని.. ఆయ‌న వ‌ల్ల పార్టీ మ‌రింత బ‌ల‌ప‌డుతుంద‌ని చెప్పుకొచ్చారు. ఎలాంటి విభేదాలు రాకుండా అంద‌రూ క‌లిసి ప‌నిచేయాల‌ని చెప్పుకొచ్చారు. దీంతో ప్ర‌కాశం జిల్లాలో జ‌న‌సేన విభేదాలకు దాదాపు చెక్ ప‌డిన‌ట్టేన‌ని నాయ‌కులు చెబుతున్నారు. వాస్త‌వానికి బాలినేని నేరుగా నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌ను క‌లుసుకుని.. ఆ పార్టీలో చేరిన విష‌యం తెలిసిందే.

Satya

Recent Posts

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

1 hour ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

3 hours ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

4 hours ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

4 hours ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

4 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

5 hours ago