Political News

జ‌గ‌న‌న్న ఇళ్ల‌కు చంద్ర‌బాబు మోక్షం..

వైసిపి హయంలో సీఎంగా ఉన్న జగన్ పలు పథకాలను ప్రారంభించారు. అయితే కొన్ని అనివార్య కార ణాల వల్ల కరోనా వంటి మహమ్మార్లు విజృంభించిన నేపథ్యంలో ఆయా ప్రాజెక్టులు నిలిచిపోయాయి. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సాధారణంగా ఇలాంటి ప్రాజెక్టులను కొనసాగిస్తాయని చెప్పడానికి ఎక్కడ అవకాశం లేదు. ఎందుకంటే గతంలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదిక కూల్చేశారు. అదేవిధంగా రాజధాని అమరావతి పనులను కూడా అటుకెక్కించారు.

కాబట్టి ప్రభుత్వం మారితే గత ప్రభుత్వం తాలూకా పనులను కొనసాగిస్తుంది అని చెప్పడానికి ఎక్కడ అవకాశం అయితే లేదు. దీనిని బట్టి జగన్ హయాంలో మొదలుపెట్టిన పథకాలను తర్వాత వచ్చిన ప్ర‌భుత్వం కొనసాగిస్తుందని ఎవరు ఊహించరు. కానీ కూటమి ప్రభుత్వం వాటిని కొనసాగిస్తోంది. అంతేకాదు.. ఆయా ప‌థ‌కాల‌ను ర‌ద్దు కూడా చేయ‌లేదు. ఉదాహరణకు ‘జగనన్న ఇల్లు’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్.. గత ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు పేదలకు పంపిణీ చేశారు.

కానీ ఇంతలో ఎన్నికలు రావడంతో ఈ పనులు సగంలోనే నిలిచిపోయి. కొన్ని అసలు ప్రారంభమే కాలేదు. ఇంతలో ప్రభుత్వం మారడం జరిగిపోయింది. అయితే చంద్రబాబు హయాంలో ఆయా పనులను ముందుకు తీసుకువెళ్తారని ఎవరు ఊహించలేదు. సహజంగా ఉండే రాజకీయ వైష‌మ్యాలు, రాజకీయ వైరుధ్యాలు అలాగే సదరు పథకాలను అమలు చేయడం ద్వారా వచ్చే వ్యక్తి గ‌త ల‌బ్ధి వంటి వాటిని నాయకులు లెక్కలు వేసుకుని అమలు చేస్తారు.

కాబట్టి అలా చూసుకున్నప్పుడు జగన్ ప్రారంభించిన కార్యక్రమాన్ని చంద్రబాబు పూర్తి చేస్తారని ఎవరు ఊహించరు. కానీ, జగన్ సొంత జిల్లాలోనే ఈ పథకాన్ని దాదాపు పూర్తి చేయించే పనిని చంద్రబాబు భుజాన వేసుకున్నారు. రాయచోటిలో ప్రభుత్వం గతంలో మంజూరు చేసిన జగనన్న ఇళ్ల ప‌థ‌కాన్ని ఈ ప్రభుత్వం పూర్తి చేయించే దిశగా అడుగులు వేస్తోంది. రాయచోటి, రాజంపేట, మదనపల్లె, తంబళ్లపల్లి పీలేరు నియోజకవర్గాల్లో 342 లేఔట్లను గత వైసిపి ప్రభుత్వం చేసింది.

దీనిలో దాదాపు 80 వేల మందికి ఇళ్లు మంజూరు చేశారు. అయితే ప్రభుత్వం మారడంతో ఆయా ఇల్లు సగంలోనే ఆగిపోయాయి. వీటిని పూర్తి చేయించేందుకు తాజాగా కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటివరకు 6000 మందికి రుణాలు ఇప్పించి తద్వారా ఇల్లు కట్టుకునేలా ప్రోత్సహిస్తుంది. కాబట్టి రాజకీయాల్లో వైరుధ్యాలు ఉండొచ్చు కానీ ప్రజలకు మేలు చేసే వాటి విషయంలో మాత్రం చంద్రబాబు దూర‌ దృష్టితో ఉన్నారని చెప్పాలి.

Satya

Recent Posts

వంద దేవుళ్ళు తల్లిది పెద్ద టాలెంటే

ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…

3 minutes ago

వింటేజ్ హీరో నెక్స్ట్ ఏం చేయబోతున్నారో

కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…

3 hours ago

జూన్ చివరి వారం… రీ రిలీజుల అర్పణం

అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…

5 hours ago

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

10 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

12 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

12 hours ago