Political News

సోష‌ల్ మీడియాపైనే జ‌గ‌న్ ఆశ‌లు ..!

వైసీపీ అధినేత జగన్ మళ్ళీ సోషల్ మీడియా పైన ఆధారపడినట్లు తెలుస్తోంది. పార్టీ యువజన విభాగం నాయకులతో భేటీ అయిన ఆయన సోషల్ మీడియాను మరింత దూకుడుగా తీసుకువెళ్లాలని చెప్పారు. సోషల్ మీడియాను ఆధారంగా చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాలని ఆదేశించారు. అయితే సోషల్ మీడియా గురించి రెండు ప్రధాన ప్రశ్నలు అయితే వెంటాడుతున్నాయి. ఒకటి సోషల్ మీడియా ను ప్రజలు ఎంతవరకు ఫాలో అవుతున్నారు అనేది ఒక ప్రశ్న.

ఇక‌, సోషల్ మీడియాలో దూకుడుగా ఉండడం అంటే అధికారపక్షంపై గురుచుకుపడడమా? లేకపోతే పారదర్శకంగా పనిచేయడ‌మా?  గ‌తంలో వైసీపీ చేసిన మంచిని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్ల‌డ‌మా? అనే దాంట్లో తేడా కనిపిస్తోంది. సాధారణంగా ఇప్పటి వరకు వైసిపి సోషల్ మీడియా అనగానే విమర్శలు, వివాదాలకు కేంద్రంగా మారిన చర్చ ఉన్నది. కాబట్టి అనేక కేసులు కూడా నమోదు అయ్యాయి. బోరుగడ్డ అనిల్ కుమార్ వంటి వారు, అలాగే పోసాని కృష్ణ మురళి వంటి సీనియర్ నాయకులు కూడా అరెస్టు అయ్యారు.

సోషల్ మీడియాలో చేసిన దోషణలు, వివాదాస్పద వ్యాఖ్యలు కారణంగానే ఇప్పుడు కూడా అదే పద్ధతిలో జగన్ ముందుకు వెళ్తున్నారా? లేకపోతే  పార‌ద‌ర్శ‌కంగా రాజకీయాలు చేయాలని సూచిస్తున్నారా? అనేది చూడాల్సి ఉంది. మరోవైపు యువతకు అవకాశాలు ఇస్తామని కానీ భవిష్యత్తులో వారికి పదవులు కల్పిస్తామని గాని ఎలాంటి హామీ ఇవ్వకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ కావాలని చెప్పడం కొంతమంది దీనిపై ప్ర‌భావం చూపిస్తోంది.

ఇదే విష‌యంపై వైసీపీ యువజన విభాగంలో నాయకులు చర్చించుకున్నారు. సాధారణంగా సోషల్ మీడియా అంటేనే మధ్యతరగతికి మాత్రమే చేరువైన మాధ్యమం. ఇప్పటివరకు మధ్యతరగతి వ‌ర్గం ఏ మేరకు వైసీపీకి అనుకూలంగా ఉందనే దాన్నిబట్టి సోషల్ మీడియా పనితీరు ఆధారపడి ఉంటుంది. మరి జగన్ ఆశలు ఏ మేరకు ఫ‌లిస్తాయి అనేది చూడండి. మాస్ అయితే.. జ‌గ‌న్ వెంట ఉన్నారు. క్లాస్ మాత్రం చంద్ర‌బాబు వెనుకే ఉన్నార‌న్న‌ది వాస్త‌వం. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఈ సోష‌ల్ మీడియాను ఏ ర‌కంగా డీల్ చేస్తారో చూడాలి.

This post was last modified on July 4, 2025 8:20 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

32 minutes ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

40 minutes ago

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

2 hours ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

2 hours ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

3 hours ago

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

3 hours ago