Political News

‘సుపరిపాలనలో’ బాబు ధైర్యం!

భారత రాజకీయాల్లో ఏ నేత అయినా ఎన్నికల ముందు హామీలు గుప్పించడం.. ఆ తర్వాత తిరిగి ఎన్నికల సమయంలోనే కనిపించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇప్పుడు ఏపీలో ఆ పరిస్థితి మారిపోయింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న ఓ నిర్ణయాన్ని చూస్తే మాత్రం ప్రత్యర్థులైనా ఆయనను అభినందించకుండా ఉండలేరు. ఎందుకంటే.. సీఎంగా తన ఏడాది పాలన ఎలా ఉంది? అంటూ ఆయన నేరుగా ప్రజల్లోకే వెళ్లారు. ఈ తరహా నిర్ణయం తీసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. ఈ విషయంలో బాబును బీట్ చేసే వారు లేరు. గతంలో బాబు నిర్ణయానికి మించి పనిచేసిన నేతలూ లేరు.

బాబు నేతృత్వంలోని కూటమి సర్కారు ఇప్పుడు ఏపీవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో “ఇంటింటికీ సుపరిపాలనలో తొలి అడుగు” పేరిట కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. బుధవారమే ప్రారంభమైన ఈ కార్యక్రమం నెలాఖరు దాకా కొనసాగనుంది. ప్రతి నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యేలు, టీడీపీ ఇంచార్జీలు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ తిరిగి తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా? ఆయా పథకాల అమలులో ఏమైనా ఇంబ్బందులు ఎదురవుతు న్నాయా? లేదంటే అసలు పథకాలే అందడం లేదా? ఇలా పలు ప్రశ్నలను కూటమి నేతలు ఆయా ఇళ్లల్లోని జనాలను ప్రశ్నిస్తున్నారు. వారి నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ను నమోదు చేసుకుంటున్నారు. మొత్తంగా ఈ కార్యక్రమం రెండో రోజు గురువారం కూడా ఓ రేంజిలో సాగింది.

అయినా ఎక్కడైనా గడచిన ఏడాదిలో నా పాలన ఎలా ఉంది అని అడిగే నేత మన దేశంలో ఎక్కడైనా కనిపిస్తారా? దీపం పెట్టి వెతికినా దొరకడం కష్టమే. అలాంటిది మరో రెండు పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు మా పాలన ఎలా ఉందో చెప్పండి అంటూ ఏడాది ముగిసిన వెంటనే ప్రజల వద్దకు తనతో పాటు తన ఎమ్మెల్యేలను, నేతలను పంపే ధైర్యం చంద్రబాబు చేస్తున్నారంటే… నిజంగానే ఆయన ధైర్యం నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టరే అని చెప్పక తప్పదు. ఏ నేత అయినా తాను ఏడాదిలో ఇది చేశా, అది చేశా… ఇంకా చేయాల్సింది కొంత ఉంది అంటూ చెప్పుకుంటారు గానీ బాబు మాదిరిగా నా పాలన ఎలా ఉంది అని మాత్రం అడగరు.

అయినా బాబుకు ఈ మేర ధైర్యం ఎలా వచ్చిందన్న విషయానికి వస్తే… ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చింది సూపర్ సిక్స్ హామీలే. వాటిలో ఇప్పటికే నాలుగు హామీలను అమలు చేశారు. మహిళలకు ఉచిత గ్యాస్, తల్లికి వందనం పథకాలను నేరుగా అమలు చేసిన చంద్రబాబు ప్రతి మహిళకు రూ.1,500లను పీ4 పథకానికి అటాచ్ చేశారు. అదే విధంగా నిరుద్యోగ భృతిని స్కిల్ డెవలప్ మెంట్ స్కీంకు అటాచ్ చేశారు. ఇక మిగిలిన రెండు పథకాల్లో అన్నదాత సుఖీభవ పథకాన్ని కేంద్రం వేసే రైతు భరోసా నిధులతో కలిపి ప్రారంభించనున్నారు. అదే సమయంలో ఆగస్టు నుంచి రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. ఇక పింఛన్ల పంపిణీని బాబు పండుగ మాదిరిగా నిర్వహిస్తున్నారు. చెప్పినవన్నీ చేసిన నేతకు ఈమేర దైర్యం రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు కదా.

This post was last modified on July 4, 2025 8:04 am

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

గేమ్ కోసం ఫోన్ ఇవ్వలేదని ముగ్గురు అక్కాచెల్లెళ్ళు…

​ఘజియాబాద్‌లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…

2 hours ago

అల్లరోడి ఆల్కహాల్ అడ్రస్ ఎక్కడ

అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…

2 hours ago

మామతో దళపతి… మాజీ అల్లుడితో ఎమోషనల్ డ్రామా

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…

3 hours ago

దిల్ రాజుకు, నాగవంశీకి చెడిందా?

టాలీవుడ్లో మంచి అనుబంధం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు, నాగవంశీలది ఒకటి. ఇద్దరికి బిజినెస్ పరంగా గట్టి బంధమే…

3 hours ago

చిరుపై విమర్శకులకు లావణ్య కౌంటర్

ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని సంతోషంలో ముంచెత్తే పరిణామం చోటుచేసుకుంది. చిరు తనయుడు రామ్ చరణ్ కవల పిల్లలకు తండ్రి…

3 hours ago

రెండు షాట్ల కోసం మహేష్ ఆరు నెలల కష్టం

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు.. ఈ వార్త నిజం కావడానికి దశాబ్దంన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అభిమానులు. వీరి…

4 hours ago