Vijayawada: Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu addresses a press conference, in Vijayawada, on May 5, 2019. (Photo: IANS)
తెలంగాణకు మళ్లీ చెబుతున్నా.. అంటూ ఏపీ సీఎం చంద్రబాబు కీలక కామెంట్లు చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలను కూర్చుని చర్చించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. దీనికి నాయకులు, పార్టీలు సహకరించాలని ఆయన సూచించారు. ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత, సమన్వయం చాలా అవసరమని.. గతంలో తాము సహకరించామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవాలని కొందరు అనుకున్నారు.కానీ.. మేం సహకరించాం.. అని తెలిపారు.
ఇప్పుడు కర్నూలు జిల్లాలో చేపట్టే బనకచర్ల ద్వారా తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండబోదని మరోసారి తెలంగాణ ప్రజలకు చెబుతున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసు కున్నామన్నారు. సగటున 100 సంవత్సరాల గోదావరి ప్రవాహాన్ని లెక్కించామన్నారు. కేవలం సముద్రం లోకి వృథాగా పోతున్న నీటిని మాత్రమే తాము వాడుకుంటున్నామన్నారు. అవసరమైతే.. తెలంగాణకు కూడా ఇస్తామని చెప్పారు. దీనిలో అడ్డు పడడం ద్వారా.. అనవసర సమస్యలు తెచ్చుకున్నట్టే అవుతుందన్నారు.
సముద్రంలోకి పోయే గోదావరి జలాల్లో 200 టీఎంసీలు వాడుకుంటే తెలుగు ప్రజలు బాగుపడతారన్న చంద్రబాబు.. ఇదేసమయంలో ఇరు రాష్ట్రాలకు నీటి కొరత తీరుతుందన్నారు. “ఇదే విషయాన్ని పదే పదే చెబుతున్నా.. ఎవరికీ నష్టం లేదు.” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. బనకచర్లను కేంద్రం అడ్డుకుందని జరుగుతున్న ప్రచారాన్ని కూడా చంద్రబాబు తిప్పికొట్టారు.
దీనిని కేంద్రం అడ్డుకోలేదన్న ఆయన.. అధికారులకు కొన్ని అనుమానాలు వచ్చాయి.. వాటిని నివృత్తి చేసిన తర్వాత.. అనుమతులు ఇస్తారని అన్నారు. సహజంగా రాష్ట్రాల మధ్య ఉండే సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. నదుల అనుసంధానం కోసం మోడీ ప్రయత్నిస్తున్నారని.. గతంలో తాము నదుల అను సంధానం చేశామని.. దీనిపై సమగ్ర రిపోర్టును ఇవ్వాలని కేంద్రం కోరిందన్నారు.
This post was last modified on July 3, 2025 9:12 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…