Vijayawada: Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu addresses a press conference, in Vijayawada, on May 5, 2019. (Photo: IANS)
తెలంగాణకు మళ్లీ చెబుతున్నా.. అంటూ ఏపీ సీఎం చంద్రబాబు కీలక కామెంట్లు చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలను కూర్చుని చర్చించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. దీనికి నాయకులు, పార్టీలు సహకరించాలని ఆయన సూచించారు. ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత, సమన్వయం చాలా అవసరమని.. గతంలో తాము సహకరించామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవాలని కొందరు అనుకున్నారు.కానీ.. మేం సహకరించాం.. అని తెలిపారు.
ఇప్పుడు కర్నూలు జిల్లాలో చేపట్టే బనకచర్ల ద్వారా తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండబోదని మరోసారి తెలంగాణ ప్రజలకు చెబుతున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసు కున్నామన్నారు. సగటున 100 సంవత్సరాల గోదావరి ప్రవాహాన్ని లెక్కించామన్నారు. కేవలం సముద్రం లోకి వృథాగా పోతున్న నీటిని మాత్రమే తాము వాడుకుంటున్నామన్నారు. అవసరమైతే.. తెలంగాణకు కూడా ఇస్తామని చెప్పారు. దీనిలో అడ్డు పడడం ద్వారా.. అనవసర సమస్యలు తెచ్చుకున్నట్టే అవుతుందన్నారు.
సముద్రంలోకి పోయే గోదావరి జలాల్లో 200 టీఎంసీలు వాడుకుంటే తెలుగు ప్రజలు బాగుపడతారన్న చంద్రబాబు.. ఇదేసమయంలో ఇరు రాష్ట్రాలకు నీటి కొరత తీరుతుందన్నారు. “ఇదే విషయాన్ని పదే పదే చెబుతున్నా.. ఎవరికీ నష్టం లేదు.” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. బనకచర్లను కేంద్రం అడ్డుకుందని జరుగుతున్న ప్రచారాన్ని కూడా చంద్రబాబు తిప్పికొట్టారు.
దీనిని కేంద్రం అడ్డుకోలేదన్న ఆయన.. అధికారులకు కొన్ని అనుమానాలు వచ్చాయి.. వాటిని నివృత్తి చేసిన తర్వాత.. అనుమతులు ఇస్తారని అన్నారు. సహజంగా రాష్ట్రాల మధ్య ఉండే సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. నదుల అనుసంధానం కోసం మోడీ ప్రయత్నిస్తున్నారని.. గతంలో తాము నదుల అను సంధానం చేశామని.. దీనిపై సమగ్ర రిపోర్టును ఇవ్వాలని కేంద్రం కోరిందన్నారు.
This post was last modified on July 3, 2025 9:12 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…