Political News

తెలంగాణ‌కు మ‌ళ్లీ చెబుతున్నా…: బాబు కీల‌క కామెంట్స్‌

తెలంగాణ‌కు మ‌ళ్లీ చెబుతున్నా.. అంటూ ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క కామెంట్లు చేశారు. ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఉన్న జ‌ల వివాదాల‌ను కూర్చుని చ‌ర్చించుకుందామ‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. దీనికి నాయ‌కులు, పార్టీలు స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న సూచించారు. ఇరు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య స‌ఖ్య‌త‌, స‌మ‌న్వ‌యం చాలా అవ‌స‌ర‌మ‌ని.. గ‌తంలో తాము స‌హ‌క‌రించామ‌ని చెప్పారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టును అడ్డుకోవాల‌ని కొంద‌రు అనుకున్నారు.కానీ.. మేం స‌హ‌క‌రించాం.. అని తెలిపారు.

ఇప్పుడు క‌ర్నూలు జిల్లాలో చేప‌ట్టే బ‌న‌క‌చ‌ర్ల ద్వారా తెలంగాణ‌కు ఎలాంటి న‌ష్టం ఉండ‌బోద‌ని మ‌రోసారి తెలంగాణ ప్ర‌జ‌ల‌కు చెబుతున్నాన‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. అన్నీ ఆలోచించే ఈ నిర్ణ‌యం తీసు కున్నామ‌న్నారు. స‌గ‌టున 100 సంవ‌త్స‌రాల గోదావ‌రి ప్ర‌వాహాన్ని లెక్కించామ‌న్నారు. కేవ‌లం స‌ముద్రం లోకి వృథాగా పోతున్న నీటిని మాత్రమే తాము వాడుకుంటున్నామ‌న్నారు. అవ‌స‌ర‌మైతే.. తెలంగాణకు కూడా ఇస్తామ‌ని చెప్పారు. దీనిలో అడ్డు ప‌డ‌డం ద్వారా.. అన‌వ‌స‌ర స‌మ‌స్య‌లు తెచ్చుకున్న‌ట్టే అవుతుంద‌న్నారు.

సముద్రంలోకి పోయే గోదావ‌రి జ‌లాల్లో 200 టీఎంసీలు వాడుకుంటే తెలుగు ప్రజలు బాగుపడతారన్న చంద్ర‌బాబు.. ఇదేస‌మ‌యంలో ఇరు రాష్ట్రాల‌కు నీటి కొర‌త తీరుతుంద‌న్నారు. “ఇదే విషయాన్ని పదే పదే చెబుతున్నా.. ఎవరికీ నష్టం లేదు.” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. బ‌న‌క‌చ‌ర్ల‌ను కేంద్రం అడ్డుకుంద‌ని జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని కూడా చంద్ర‌బాబు తిప్పికొట్టారు.

దీనిని కేంద్రం అడ్డుకోలేద‌న్న ఆయ‌న‌.. అధికారుల‌కు కొన్ని అనుమానాలు వ‌చ్చాయి.. వాటిని నివృత్తి చేసిన త‌ర్వాత‌.. అనుమ‌తులు ఇస్తార‌ని అన్నారు. స‌హ‌జంగా రాష్ట్రాల మ‌ధ్య ఉండే స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించేందుకు కేంద్రం ప్ర‌య‌త్నిస్తోంద‌న్నారు. న‌దుల అనుసంధానం కోసం మోడీ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. గ‌తంలో తాము న‌దుల అను సంధానం చేశామ‌ని.. దీనిపై స‌మ‌గ్ర రిపోర్టును ఇవ్వాల‌ని కేంద్రం కోరింద‌న్నారు.

This post was last modified on July 3, 2025 9:12 pm

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

4 hours ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

6 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

6 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

7 hours ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

8 hours ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

9 hours ago