“దేవుడు అన్నీ చూస్తున్నాడు.. ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది.” అని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందన్న ఆయన.. మనకు కూడా మంచి రోజులు వస్తాయని.. అప్పుడు మనం కూడా చేయొచ్చని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. తాజాగా పలు కేసుల నుంచి బెయిల్పై బయటకు వచ్చిన వైసీపీ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సతీసమేతంగా జగన్ను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా వంశీతో జగన్ పలు విషయాల పై చర్చించారు. పార్టీని ముందుకు నడిపించే బాధ్యత మీ దేనని వ్యాఖ్యానించారు. ఎన్ని కేసులు పెట్టినా.. వెరవాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ అండగా ఉం టుందని చెప్పారు. ఈ కేసులు తాత్కాలికమేనని ప్రజల్లో చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయింద ని.. ఏక్షణమైనా ఆయన దిగిపోయే అవకాశం ఉందని జగన్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా గన్నవరం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఇంకా తప్పుడు కేసులు పెట్టే అవకాశం ఉందని.. తనపై కూడా కేసులు నమోదు చేశారని జగన్ చెప్పుకొ చ్చారు. పార్టీలో సగం మంది నాయకులపై కేసులు ఉన్నాయన్న ఆయన.. ఎవరూ భయపడాల్సిన అవ సరం లేదని.. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. వడ్డీతో సహా బదులు తీర్చుకుందామని భరోసా కల్పిం చారు. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. పార్టీ తరఫున పోరాటాలు తీవ్ర తరం చేయాలని.. వచ్చే ఎన్నికల్లో భారీ విజయం మన సొంత మవుతుందన్నారు. కాగా.. వంశీ ఉలుకుపలుకు లేకుండా..జగన్ చెప్పింది వినడం గమనార్హం.
This post was last modified on July 3, 2025 9:10 pm
ఘజియాబాద్లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమింగ్కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…
అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…
టాలీవుడ్లో మంచి అనుబంధం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు, నాగవంశీలది ఒకటి. ఇద్దరికి బిజినెస్ పరంగా గట్టి బంధమే…
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని సంతోషంలో ముంచెత్తే పరిణామం చోటుచేసుకుంది. చిరు తనయుడు రామ్ చరణ్ కవల పిల్లలకు తండ్రి…
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు.. ఈ వార్త నిజం కావడానికి దశాబ్దంన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అభిమానులు. వీరి…