Political News

జ‌గ‌న్‌ను క‌లిసిన వంశీ.. ఏం చెప్పారంటే!

“దేవుడు అన్నీ చూస్తున్నాడు.. ఈ ప్ర‌భుత్వానికి పోయే కాలం వ‌చ్చింది.” అని వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న సాగుతోంద‌న్న ఆయ‌న‌.. మ‌న‌కు కూడా మంచి రోజులు వ‌స్తాయ‌ని.. అప్పుడు మ‌నం కూడా చేయొచ్చ‌ని న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించారు. తాజాగా ప‌లు కేసుల నుంచి బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన వైసీపీ నాయ‌కుడు, గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీ స‌తీస‌మేతంగా జ‌గ‌న్‌ను క‌లుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా వంశీతో జ‌గ‌న్ ప‌లు విష‌యాల‌ పై చ‌ర్చించారు. పార్టీని ముందుకు న‌డిపించే బాధ్య‌త మీ దేన‌ని వ్యాఖ్యానించారు. ఎన్ని కేసులు పెట్టినా.. వెర‌వాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. పార్టీ అండ‌గా ఉం టుంద‌ని చెప్పారు. ఈ కేసులు తాత్కాలిక‌మేన‌ని ప్ర‌జ‌ల్లో చంద్ర‌బాబుపై తీవ్ర వ్య‌తిరేక‌త పెరిగిపోయింద ని.. ఏక్ష‌ణ‌మైనా ఆయ‌న దిగిపోయే అవ‌కాశం ఉంద‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించిన‌ట్టు తెలిసింది. ఈ సంద‌ర్భంగా గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఇంకా త‌ప్పుడు కేసులు పెట్టే అవ‌కాశం ఉంద‌ని.. త‌న‌పై కూడా కేసులు న‌మోదు చేశార‌ని జ‌గ‌న్ చెప్పుకొ చ్చారు. పార్టీలో స‌గం మంది నాయ‌కుల‌పై కేసులు ఉన్నాయ‌న్న ఆయ‌న‌.. ఎవ‌రూ భ‌య‌ప‌డాల్సిన అవ స‌రం లేద‌ని.. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వ‌డ్డీతో స‌హా బ‌దులు తీర్చుకుందామ‌ని భ‌రోసా క‌ల్పిం చారు. ఆరోగ్యం జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాల‌ని సూచించారు. పార్టీ త‌ర‌ఫున పోరాటాలు తీవ్ర త‌రం చేయాల‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం మ‌న సొంత మ‌వుతుంద‌న్నారు. కాగా.. వంశీ ఉలుకుప‌లుకు లేకుండా..జ‌గ‌న్ చెప్పింది విన‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on July 3, 2025 9:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago