Political News

జ‌గ‌న్‌ను క‌లిసిన వంశీ.. ఏం చెప్పారంటే!

“దేవుడు అన్నీ చూస్తున్నాడు.. ఈ ప్ర‌భుత్వానికి పోయే కాలం వ‌చ్చింది.” అని వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న సాగుతోంద‌న్న ఆయ‌న‌.. మ‌న‌కు కూడా మంచి రోజులు వ‌స్తాయ‌ని.. అప్పుడు మ‌నం కూడా చేయొచ్చ‌ని న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించారు. తాజాగా ప‌లు కేసుల నుంచి బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన వైసీపీ నాయ‌కుడు, గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీ స‌తీస‌మేతంగా జ‌గ‌న్‌ను క‌లుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా వంశీతో జ‌గ‌న్ ప‌లు విష‌యాల‌ పై చ‌ర్చించారు. పార్టీని ముందుకు న‌డిపించే బాధ్య‌త మీ దేన‌ని వ్యాఖ్యానించారు. ఎన్ని కేసులు పెట్టినా.. వెర‌వాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. పార్టీ అండ‌గా ఉం టుంద‌ని చెప్పారు. ఈ కేసులు తాత్కాలిక‌మేన‌ని ప్ర‌జ‌ల్లో చంద్ర‌బాబుపై తీవ్ర వ్య‌తిరేక‌త పెరిగిపోయింద ని.. ఏక్ష‌ణ‌మైనా ఆయ‌న దిగిపోయే అవ‌కాశం ఉంద‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించిన‌ట్టు తెలిసింది. ఈ సంద‌ర్భంగా గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఇంకా త‌ప్పుడు కేసులు పెట్టే అవ‌కాశం ఉంద‌ని.. త‌న‌పై కూడా కేసులు న‌మోదు చేశార‌ని జ‌గ‌న్ చెప్పుకొ చ్చారు. పార్టీలో స‌గం మంది నాయ‌కుల‌పై కేసులు ఉన్నాయ‌న్న ఆయ‌న‌.. ఎవ‌రూ భ‌య‌ప‌డాల్సిన అవ స‌రం లేద‌ని.. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వ‌డ్డీతో స‌హా బ‌దులు తీర్చుకుందామ‌ని భ‌రోసా క‌ల్పిం చారు. ఆరోగ్యం జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాల‌ని సూచించారు. పార్టీ త‌ర‌ఫున పోరాటాలు తీవ్ర త‌రం చేయాల‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం మ‌న సొంత మ‌వుతుంద‌న్నారు. కాగా.. వంశీ ఉలుకుప‌లుకు లేకుండా..జ‌గ‌న్ చెప్పింది విన‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on July 3, 2025 9:10 pm

Share

Recent Posts

అసెంబ్లీలో మంత్రుల పక్కన సీఎం కూర్చోవడం ఎప్పుడైనా చూసారా?

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…

3 hours ago

ఇంట్రెస్టింగ్… ఫ్లాప్ దర్శకుల కలయికలో సినిమా?

సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…

5 hours ago

ఇరుముడి కొట్టుడు మళ్లీ మొదలు

‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…

5 hours ago

సుబ్బులక్ష్మి బయోపిక్… సాయిపల్లవి స్థానంలో రష్మిక

సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…

6 hours ago

తెలుగు రామాయణ మీద 100 కోట్లు సేఫేనా

నవంబర్ లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద అంచనాలు ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జోరుగా…

7 hours ago

ఓజి 2 సౌండ్ చెయ్యడం లేదేంటి

సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్…

7 hours ago